సంతోష్ శోభన్.. ‘గోల్కొండ హైస్కూల్’ సినిమాలో స్కూల్ టీం కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు సంపాదించిన కుర్రాడు. ‘వర్షం’ దర్శకుడు శోభన్ కొడుకు ఇతనన్న విషయం చాలా మందికి తెలియదు. తండ్రి మంచి స్థాయిలో ఉండగానే తెరంగేట్రం చేసి నిలదొక్కుకోవాలని యువ కథానాయకులు చూస్తారు కానీ.. సంతోష్కు ఆ అవకాశం లేకపోయింది. తండ్రి బతికుండగా అతను చిన్న కుర్రాడు.
ఐతే ఇండస్ట్రీలో శోభన్కు మంచి పేరుండటంతో ఆయన లేకపోయినా.. కొడుక్కి మంచి ప్రోత్సాహమే లభించింది. అతడిలో మంచి ప్రతిభ ఉందని తొలి సినిమాతోనే రుజువైంది. ఆపై సంతోష్ హీరోగా మారి ‘తను నేను’, ‘పేపర్ బాయ్’ లాంటి సినిమాలు చేశాడు. కానీ అవి అతడికి సరైన కార్తీక్ రాపోలు అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు.
‘డజ్ సైజ్ మేటర్స్’ అంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్తో ఈ సినిమాను పరిచయం చేశారు. ఇప్పుడు మరో ఆసక్తికర వీడియోతో సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. ఇందులో సంతోష్ తన మీద తనే సెటైర్లు వేసుకోవడం విశేషం. ఈ వీడియోలో సంతోష్తో పాటు కమెడియన్ సుదర్శన్ కనిపించారు. టీ కొట్టు ముందు పేపర్ చదువుతున్న సంతోష్ను చూసి నిన్నెక్కడో చూసినట్లుందే అని అడగడం, తర్వాత ‘ఏక్ మిని కథ’ పోస్టర్ను గుర్తు తెచ్చుకోవడం.. ఆపై ఇంతకీ ఆ సినిమాలో హీరో ఎవరని అడగడం.. ఇంతకుముందే ఓ సినిమాలో చేశావ్ కదా అంటూ ‘పేపర్ బాయ్’ కాకుండా ఆఫీస్ బాయ్, స్మార్ట్ బాయ్ అంటూ ఏవేవో పేర్లు చెప్పడం భలే సరదాగా అనిపిస్తోంది.
సుదర్శన్ మాటలకు సంతోష్ ఇచ్చిన హావభావాలు అతడి టాలెంట్ ఏంటో చూపించాయి. రొటీన్కు భిన్నంగా ఉన్న ఈ వీడియోనే ప్రి టీజర్గా వదిలారు. త్వరలోనే ‘ఏక్ మిని కథ’ టీజర్ రాబోతోంది. దాంతో ఏమేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారో చూడాలి.
This post was last modified on March 11, 2021 9:55 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…