సంతోష్ శోభన్.. ‘గోల్కొండ హైస్కూల్’ సినిమాలో స్కూల్ టీం కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు సంపాదించిన కుర్రాడు. ‘వర్షం’ దర్శకుడు శోభన్ కొడుకు ఇతనన్న విషయం చాలా మందికి తెలియదు. తండ్రి మంచి స్థాయిలో ఉండగానే తెరంగేట్రం చేసి నిలదొక్కుకోవాలని యువ కథానాయకులు చూస్తారు కానీ.. సంతోష్కు ఆ అవకాశం లేకపోయింది. తండ్రి బతికుండగా అతను చిన్న కుర్రాడు.
ఐతే ఇండస్ట్రీలో శోభన్కు మంచి పేరుండటంతో ఆయన లేకపోయినా.. కొడుక్కి మంచి ప్రోత్సాహమే లభించింది. అతడిలో మంచి ప్రతిభ ఉందని తొలి సినిమాతోనే రుజువైంది. ఆపై సంతోష్ హీరోగా మారి ‘తను నేను’, ‘పేపర్ బాయ్’ లాంటి సినిమాలు చేశాడు. కానీ అవి అతడికి సరైన కార్తీక్ రాపోలు అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు.
‘డజ్ సైజ్ మేటర్స్’ అంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్తో ఈ సినిమాను పరిచయం చేశారు. ఇప్పుడు మరో ఆసక్తికర వీడియోతో సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. ఇందులో సంతోష్ తన మీద తనే సెటైర్లు వేసుకోవడం విశేషం. ఈ వీడియోలో సంతోష్తో పాటు కమెడియన్ సుదర్శన్ కనిపించారు. టీ కొట్టు ముందు పేపర్ చదువుతున్న సంతోష్ను చూసి నిన్నెక్కడో చూసినట్లుందే అని అడగడం, తర్వాత ‘ఏక్ మిని కథ’ పోస్టర్ను గుర్తు తెచ్చుకోవడం.. ఆపై ఇంతకీ ఆ సినిమాలో హీరో ఎవరని అడగడం.. ఇంతకుముందే ఓ సినిమాలో చేశావ్ కదా అంటూ ‘పేపర్ బాయ్’ కాకుండా ఆఫీస్ బాయ్, స్మార్ట్ బాయ్ అంటూ ఏవేవో పేర్లు చెప్పడం భలే సరదాగా అనిపిస్తోంది.
సుదర్శన్ మాటలకు సంతోష్ ఇచ్చిన హావభావాలు అతడి టాలెంట్ ఏంటో చూపించాయి. రొటీన్కు భిన్నంగా ఉన్న ఈ వీడియోనే ప్రి టీజర్గా వదిలారు. త్వరలోనే ‘ఏక్ మిని కథ’ టీజర్ రాబోతోంది. దాంతో ఏమేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారో చూడాలి.
This post was last modified on March 11, 2021 9:55 am
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…