కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ సినిమాలు చేసింది టాలీవుడ్లోనే. ఏడాది ముందు వరకు ఆమె వ్యక్తిగత జీవితం గురించి పెద్ద చర్చ లేదు. ఆమె రిలేషన్షిప్లో ఉన్నట్లుగా ఎప్పుడూ వార్తలు కూడా రాలేదు. కానీ బైసన్ సినిమా కోసం కలిసి పని చేసిన ధ్రువ్ విక్రమ్తో అనుపమ ప్రేమలో పడ్డట్లు ఆ సినిమా రిలీజ్ టైంలో వార్తలు వచ్చాయి. తర్వాత ఇద్దరూ కలిసి ప్రయాణం సాగిస్తున్నట్లే అంతా భావించారు.
కానీ ఈ మధ్య ఇద్దరూ విడిపోయారని తేలిపోయింది. రిలేషన్షిప్ నుంచి బయటికి వచ్చాక స్వేచ్ఛగా ఉందనే అర్థం వచ్చేలా అనుపమ వరుసగా క్రిప్టిక్ పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రిలేషన్షిప్లో ఉన్న వాళ్లను బ్రేకప్ మొదట బాధ పెట్టినా.. తర్వాత సంతోషంగానే కనిపిస్తుంటారు. ఇప్పుడు అనుపమ కూడా ఆ స్థితిలోనే ఉన్నట్లుంది.
తన కొత్త చిత్రం క్రేజీ కళ్యాణం ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చి మీడియాను కలిసిన అనుపమకు.. విలేకరుల నుంచి ఇటీవలి క్రిప్టిక్ పోస్టుల గురించే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల జీవితంలో చెడ్డ రోజుల గురించే మాట్లాడారు కదా, ఇప్పుడు మీరు ఓకేనా అని అడిగితే.. తాను చాలా బాగున్నట్లు చెప్పిన అనుపమ, మీకేమనిపిస్తోంది అంటూ ఎదురు ప్రశ్నించింది. గత ఏడాది కాలం అంత బాగా సాగలేదన్నది వాస్తవమని, ఇప్పుడు జీవితం పట్ల చాలా ఆశాజనకంగా ఉన్నానని ఆమె చెప్పింది.
ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉన్నట్లు చెప్పిన అనుపమ.. క్రేజీ కళ్యాణం సినిమా చేస్తున్నపుడు కూడా తాను ఇలాగే ఉండుంటే ఇంకా క్రేజీగా ఉండేదని వ్యాఖ్యానించింది. మరోవైపు ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జనాలకు అవసరమా అని అడిగితే.. తన సోషల్ మీడియా తన ఇష్టం అని, తనకు ఏదనిపిస్తే అది చేస్తానని ఆమె తేల్చి చెప్పింది. మీరు రిలేషన్షిప్లో అవతలి వ్యక్తిని బ్లేమ్ చేస్తున్నారా అని అడిగితే.. మీకు నన్ను చూస్తే ఏమనిపిస్తోంది, నా జీవితం గురించి మీకేం తెలుసు అంటూ కొంచెం ఘాటుగానే స్పందించింది అనుపమ.
This post was last modified on August 1, 2026 11:41 pm
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…