Political News

భోగాపురం క్రెడిట్ కోసం వైసీపీ తంటాలు…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఏపీ ప్ర‌జ‌లు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఊద‌ర గొడుతోంది. అంతేకాదు.. గ‌త వీడియోలు, కామెంట్లు, ప్ర‌క‌ట‌న‌ల‌ను త‌వ్వితీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దీనికి కార‌ణం.. విజ‌య‌న‌గ‌రంలో తాజాగా ప్రారంభ‌మైన‌ భోగాపురం(అల్లూరి సీతారామ‌రాజు) అంత‌ర్జాతీయ విమానాశ్రం. దీని ఘ‌న‌త త‌మ‌దేన‌ని ఇటీవ‌ల కాలంంలో త‌ర‌చుగా చెబుతున్న జ‌గ‌న్‌.. తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా మ‌రింత ప్ర‌చారానికి తెర‌దీశారు. అంతేకాదు.. చంద్ర‌బాబుపైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే `థ్యాంక్యూ జగనన్న అంటున్న ఆంధ్రాజనం` అంటూ వైసీపీ పోస్టు చేయ‌డం గ‌మ‌నార్హం.

క్రెడిట్ చోరీ..

ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల చిర‌కాల స్వ‌ప్నాన్ని సాకారం చేయ‌డంలో జ‌గ‌న్ స‌ఫ‌ల‌మ‌య్యారంటూ వైసీపీ సోష‌ల్ మీడియా పేర్కొంది. భోగాపురం విమానాశ్ర‌యాన్ని ఇప్పుడు ప్రారంభించి.. తొలి ఫ్లైట్ 2026లో ఎగురుతుంద‌ని జ‌గ‌న్ ఎప్పుడో చెప్పార‌ని కూడా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీనికి సంబంధించిన వీడియోల‌ను కూడా పోస్టు చేశారు. అయితే.. ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు ఈ క్రెడిట్‌ను త‌న ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీకి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో ఆరోపించారు. ఇలా.. వైసీపీ శ‌నివారం మ‌ధ్యాహ్నం నుంచి సాయంత్రం వ‌ర‌కు వ‌రుస‌గా ట్వీట్లు, పోస్టులు చేస్తూనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

ప‌ర‌మార్థం ఏంటి?

భోగాపురం విమానాశ్ర‌యం ప్రారంభంతో  ఉత్త‌రాంధ్ర రాజ‌కీయ ప‌వ‌నాలు అనూహ్యంగా మారే అవ‌కాశం ఉంది. ఇక్క‌డి భూముల‌కు ధ‌ర‌లు పెర‌గ‌డంతోపాటు.. ఉపాధి, విద్యావ‌కాశాలు కూడా భారీగా పుంజుకోనున్నాయి. అదేస‌మ‌యంలో అంత‌ర్జాతీయ సంస్థ‌లు కూడా ఇక్క‌డ‌కు రానున్నాయి. దీంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు అధికార కూట‌మికి అనుకూలంగా మార‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ‌ జ‌రుగుతోంది. వాస్త‌వానికి.. ఎప్ప‌టినుంచో ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీకి సానుకూల వాతావ‌ర‌ణం ఉంది. ఇక్క‌డి నుంచి అనేక మంది నాయ‌కులు విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ ప్ర‌భావం తాజాగా జ‌రిగిన అభివృద్ధితో మ‌రింత పెర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ అలెర్ట్ అయిన‌ట్టు విశ్లేష‌కులు భావిస్తున్నారు.

త‌మ‌ను తాము కాపాడుకునే క్ర‌మంలోను, త‌మ ఓటు బ్యాంకును ర‌క్షించుకునే క్ర‌మంలో భోగాపురం విమానాశ్ర‌యం అభివృద్ధి, ప్రారంభం వంటి వాటిని త‌మ‌కు అనుకూలంగా వైసీపీ మ‌లుచుకుంటోద‌న్న చ‌ర్చ టీడీపీలోనూ జ‌రుగుతోంది. దీనిని స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టాల‌ని తాజాగా టీడీపీ నాయ‌కులు హైక‌మాండ్ నుంచి ఆదేశాలు అందాయి. వైసీపీ చేస్తున్న ప్ర‌చారాన్ని స‌మ‌ర్థ వంతంగా తిప్పికొట్టాల‌ని పార్టీ చీఫ్ ప‌ల్లా శ్రీనివాస‌రావు ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేల‌కు ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇక‌, వైసీపీ కూడా భోగాపురం సెంట్రిక్‌గా జ‌గ‌న్ చేసిన కృషిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలంటూ నాయ‌కుల‌కు స‌మాచారం అందించింది. మొత్తంగా ఈవ్య‌వ‌హారం.. మ‌రో నాలుగైదు రోజులు రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క అంశంగా మార‌నుంది.

This post was last modified on August 1, 2026 8:51 pm

Share

Recent Posts

స్పైడర్ మ్యాన్ సక్సెస్… ఏ పాఠం నేర్చుకోవాలి

సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…

1 hour ago

టాక్సిక్ ట్రైలర్ మీద కోట్ల కళ్లున్నాయి

కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…

2 hours ago

ఎదిగే స్టేజిలో అలాంటి ఆలోచనలే రిస్కు

హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…

3 hours ago

సందీప్ కిషన్ మూవీకి టెన్షన్ లేదు

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…

3 hours ago

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

4 hours ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

7 hours ago