నేపాల్–టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక జలప్రళయంలో కైలాస మానససరోవర యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఈశా ఫౌండేషన్కు చెందిన సుమారు 80 మంది సభ్యులు గల్లంతైనట్లు సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. గల్లంతైన వారిలో 34 మంది పురుషులు, 46 మంది మహిళలు ఉన్నారని, 22 మంది అమెరికన్లు, 12 మంది కెనడియన్లు, 11 మంది ఆస్ట్రేలియన్లు, 9 మంది బ్రిటన్ పౌరులు ఉన్నారని వెల్లడించారు. అయితే వారి పరిస్థితిపై అధికారిక నిర్ధారణ ఇంకా రాలేదని స్పష్టం చేశారు.
సుమారు వారం క్రితం ఇమిగ్రేషన్ ప్రక్రియ కోసం బృందం ఓ భవనానికి వెళ్లిందని సద్గురు తెలిపారు. ఉదయం 9.05 గంటలకు ఇమిగ్రేషన్ కేంద్రానికి చేరుకున్నట్లు ఈశాంగ ప్రవీణ్ నుంచి సందేశం వచ్చిందని, 9.14 గంటలకు అకస్మాత్తుగా వరద సంభవించిందని చెప్పారు. ఆ తర్వాత ప్రవీణ్ నేపాల్ ఫోన్ అందుబాటులో లేకుండా పోయిందని తెలిపారు. ఇమిగ్రేషన్ భవనం వరదల్లో కొట్టుకుపోయినట్లు పేర్కొంటూ, ఈ విపత్తులో ప్రభావితులు, గల్లంతైన వారి సంఖ్య 1,500 దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే ఇది అధికారిక సంఖ్య కాదన్నారు.
ఘటన జరిగిన గంటలోపే భారత్, నేపాల్తో పాటు సంబంధిత దేశాల రాయబార కార్యాలయాలకు సమాచారం అందించినట్లు సద్గురు తెలిపారు. భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, చైనా రాయబార కార్యాలయం నుంచి ప్రభావిత ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి కోరుతున్నామని చెప్పారు.
అమెరికా రాయబార కార్యాలయం కూడా స్పందించి చర్యలు చేపడుతోందన్నారు. గల్లంతైన తమ వారి ఆచూకీ తెలుసుకోవడంతో పాటు పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రభావిత ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని భారత్, చైనా, అమెరికా రాయబార కార్యాలయాలను కోరినట్లు తెలిపారు.
This post was last modified on August 27, 2026 10:05 pm
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…
మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…
ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…