Trends

నేపాల్ విషాదం… కన్నీరు పెట్టుకున్న సద్గురు

నేపాల్‌–టిబెట్‌ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక జలప్రళయంలో కైలాస మానససరోవర యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఈశా ఫౌండేషన్‌కు చెందిన సుమారు 80 మంది సభ్యులు గల్లంతైనట్లు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ తెలిపారు. గల్లంతైన వారిలో 34 మంది పురుషులు, 46 మంది మహిళలు ఉన్నారని, 22 మంది అమెరికన్లు, 12 మంది కెనడియన్లు, 11 మంది ఆస్ట్రేలియన్లు, 9 మంది బ్రిటన్‌ పౌరులు ఉన్నారని వెల్లడించారు. అయితే వారి పరిస్థితిపై అధికారిక నిర్ధారణ ఇంకా రాలేదని స్పష్టం చేశారు.

సుమారు వారం క్రితం ఇమిగ్రేషన్‌ ప్రక్రియ కోసం బృందం ఓ భవనానికి వెళ్లిందని సద్గురు తెలిపారు. ఉదయం 9.05 గంటలకు ఇమిగ్రేషన్‌ కేంద్రానికి చేరుకున్నట్లు ఈశాంగ ప్రవీణ్‌ నుంచి సందేశం వచ్చిందని, 9.14 గంటలకు అకస్మాత్తుగా వరద సంభవించిందని చెప్పారు. ఆ తర్వాత ప్రవీణ్‌ నేపాల్‌ ఫోన్‌ అందుబాటులో లేకుండా పోయిందని తెలిపారు. ఇమిగ్రేషన్‌ భవనం వరదల్లో కొట్టుకుపోయినట్లు పేర్కొంటూ, ఈ విపత్తులో ప్రభావితులు, గల్లంతైన వారి సంఖ్య 1,500 దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే ఇది అధికారిక సంఖ్య కాదన్నారు.

ఘటన జరిగిన గంటలోపే భారత్‌, నేపాల్‌తో పాటు సంబంధిత దేశాల రాయబార కార్యాలయాలకు సమాచారం అందించినట్లు సద్గురు తెలిపారు. భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, చైనా రాయబార కార్యాలయం నుంచి ప్రభావిత ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి కోరుతున్నామని చెప్పారు.

అమెరికా రాయబార కార్యాలయం కూడా స్పందించి చర్యలు చేపడుతోందన్నారు. గల్లంతైన తమ వారి ఆచూకీ తెలుసుకోవడంతో పాటు పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రభావిత ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని భారత్‌, చైనా, అమెరికా రాయబార కార్యాలయాలను కోరినట్లు తెలిపారు.

This post was last modified on August 27, 2026 10:05 pm

Share

Recent Posts

ప్రాణాలు తీసుకునే ముందు… ఆ పాప గుర్తుకు రాలేదా?

అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద…

25 minutes ago

పార్ల‌మెంటు డీలిమిటేష‌న్‌పై కాంగ్రెస్ భయం దేనికి?

దేశ‌వ్యాప్తంగా 543 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై కాంగ్రెస్ పార్టీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను వ‌చ్చే 25 ఏళ్ల…

2 hours ago

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌… `ప‌ర్స‌న‌లైజ్` అవుతున్న పార్టీలు!

రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌లో గ‌తానికి భిన్న‌మైన `వ్య‌క్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇందిర‌మ్మ హ‌యాంలో…

4 hours ago

టీడీపీకి ఓట్ల `ప్రాజెక్టులు`… త‌మ్ముళ్లు హ్యాపీ.. !

కీల‌క‌మైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న ప్రాజెక్టుల‌నే…

9 hours ago

దేశ‌వ్యాప్తంగా 288 మంది.. ఏపీలో ఐదుగురు.. ఏమ‌య్యారు?

దేశ‌వ్యాప్తంగా 288 మంది నేపాల్ వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంత‌య్యార‌ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. మొత్తం 532 మంది ఆచూకీ క‌నిపించ‌కుండా…

10 hours ago

మృతదేహాల నుంచి నగల అపహరణ… నేపాల్‌లో అమానవీయం

నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…

10 hours ago