తన సినిమాలను చెప్పిన బడ్జెట్లో పూర్తయ్యేలా జాగ్రత్త పడతాడని.. ప్రకటించిన డేటుకు రిలీజ్ చేస్తాడని నానికి ఉన్న పేరును ‘ది ప్యారడైజ్’ దెబ్బ తీసింది. ఈ మూవీ బడ్జెట్ చాలా పెరిగిపోయింది. అలాగే ముందులో మార్చి రిలీజ్ అనుకుని, అది కుదరక ఆగస్టుకు వాయిదా వేస్తే.. ఆ డేట్ను కూడా ఈ చిత్రం అందుకోలేకపోయింది. చివరికి సెప్టెంబరు 24న ‘ది ప్యారడైజ్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈసారి డేట్ మిస్ కాదనే అనుకుంటున్నారంతా.
ఐతే సినిమా లేటైనప్పటికీ.. హైప్ ఏమీ తగ్గిపోలేదు. ‘ది ప్యారడైజ్’ నుంచి రిలీజ్ చేసిన ప్రతి ప్రోమో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. లిరిక్స్, ట్యూన్, సింగింగ్.. అన్నీ వేరే లెవెల్లో ఉండడంతో ఈ పాట విపరీతంగా వైరల్ అయింది. రిలీజైన దగ్గర్నుంచి ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో పాటను రిలీజ్ చేయడానికి టీం రెడీ అయింది. ఈ శనివారమే సెకండ్ సింగిల్ లాంచ్ కాబోతోంది.
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘ది ప్యారడైజ్’ రెండో పాట గురించి జరుగుతున్న ప్రచారమే నిజమని తేలిపోయింది. బాగా పాపులర్ అయిన తెలంగాణ ఫోక్ సాంగ్ ‘యెషనాగుల కట్ట మీద’ పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేశాడు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. పెద్ద సినిమాల్లో తెలంగాణ పాట అంటే కాకర్ల శ్యామ్ లిరిక్స్ అందించడం కామన్. ఈ పాటకు కూడా ఆయనే సాహిత్యం అందిస్తున్నాడు. ‘ఆయా షేర్’ పాట పాడిన జంగిరెడ్డి.. ప్రభతో కలిసి ఈ పాటను ఆలపించాడట.
ఐతే శనివారం ఆన్ లైన్లోకి పాట రానుండగా.. అంతకంటే ముందే ప్రేక్షకుల ముందు ఈ పాటను లైవ్ పెర్ఫామ్ చేయబోతున్నాడు అనిరుధ్. శుక్రవారం జరగనున్న లైవ్ కన్సర్ట్లో అనిరుధ్.. హీరో నానితో కలిసి ఈ పాటను లాంచ్ చేసి పెర్ఫామ్ చేయబోతున్నాడట. ‘యెషనాగుల కట్ట మీద’ పాట ఇప్పటికే బాగా పాపులర్ కాగా.. దానికి అనిరుధ్ టచ్ ఇచ్చాడంటే అది కూడా ‘ఆయా షేర్’ స్థాయిలోనే ప్రకంపనలు రేపుతుందని భావిస్తున్నారు. ఈ పాట కూడా అంచనాలకు తగ్గట్లు ఉంటే ‘ది ప్యారడైజ్’ హైప్ ఇంకో లెవెల్కు చేరడం ఖాయం.
This post was last modified on August 27, 2026 10:09 pm
అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద…
దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. నియోజకవర్గాల పునర్విభజనను వచ్చే 25 ఏళ్ల…
రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్లో గతానికి భిన్నమైన `వ్యక్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇందిరమ్మ హయాంలో…
కీలకమైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల తరబడి సాగుతున్న ప్రాజెక్టులనే…
దేశవ్యాప్తంగా 288 మంది నేపాల్ వరదల్లో గల్లంతయ్యారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 532 మంది ఆచూకీ కనిపించకుండా…
నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…