Political News

కొండా దంప‌తులు బీజేపీలో ఉండ‌గ‌ల‌రా…?

కొండా మురళి, కొండా సురేఖ దంపతులు ఇప్పటివరకు రాజకీయంగా అడుగు పెట్టని ఒకే ఒక్క ప్రధాన పార్టీ బీజేపీ. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న తీవ్రమైన అంతర్గత విభేదాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వారి కుమార్తె సుస్మితా ప‌టేల్ చేసిన వ్యాఖ్యలు, పార్టీ క్రమశిక్షణా కమిటీ చర్యల హెచ్చరికలతో తమ వద్ద ‘ప్లాన్-బీ’ ఉందనే పరోక్ష సంకేతాలను వారు పంపుతున్నారు.

ఒకవేళ అధిష్టానం కేబినెట్ నుంచి తప్పిస్తే ఆత్మగౌరవం పేరిట బయటకు వచ్చి నిర్ణయం తీసుకోవడానికి కొండా దంపతులు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వారు బీజేపీ అగ్రనేతలతో రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కొండా సురేఖ బీజేపీ ఎంట్రీపై కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి న‌ర్మ‌గ‌ర్భంగా స్పందిస్తూ ముందు ఆమె పార్టీకి, ప‌ద‌వికి రాజీనామా చేస్తే అప్పుడు ఆలోచిస్తామ‌న్న‌ట్టుగా మాట్లాడారు.

బీజేపీ కోణం నుంచి చూస్తే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన మున్నూరు కాపు, పద్మశాలి సామాజిక వర్గాలకు చెందిన బీసీ నాయకత్వం కోసం ఆ పార్టీ సుదీర్ఘకాలంగా వెతుకుతోంది. మాస్ ఫాలోయింగ్ ఉన్న ఫైర్‌బ్రాండ్ బీసీ మహిళా ముఖంగా కొండా సురేఖను చేర్చుకోవడం వల్ల ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించవచ్చని కమలనాథులు లెక్కిస్తున్నారు. వీరి ఆర్థిక బలం, క్యాడర్ బలం కూడా పార్టీకి కలిసివచ్చే అంశమే. కొండా సురేఖ దంప‌తులు బీజేపీలో చేరితే ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో బీజేపీకి మంచి ఊపే వ‌స్తుంది.

అయితే, కొండా మార్కు రాజకీయాలను బీజేపీ అధిష్టానం భరించగలదా అనే సందేహం సహజంగానే వ్యక్తమవుతోంది. కమలం పార్టీలోని కఠినమైన క్రమశిక్షణ, ఆర్ఎస్ఎస్ భావజాలం, ఢిల్లీ అధిష్టానం చెప్పినట్లు నడిచే కేంద్రీకృత వ్యవస్థలో కొండా దంపతులు ఇమడటం దాదాపు అసాధ్యమనే అభిప్రాయం ఉంది. కొండా మురళి, సురేఖల నైజం ఎప్పుడూ వ్యక్తిగత నాయకత్వం చుట్టూనే తిరుగుతుంది తప్ప ఒక పార్టీ విధానాల‌కు లోబ‌డి పనిచేసే తత్వం కాదు. ప్రశ్నించే వెసులుబాటు ఉన్న కాంగ్రెస్‌లోనే ఇమడలేక సొంత ప్రభుత్వంపైనే బహిరంగ విమర్శలు చేసిన వీరు బీజేపీలో ఎక్కువ రోజులు ఉండలేరనేది బహిరంగ రహస్యం.

గతంలో కాంగ్రెస్ నుంచి వైఎస్సార్‌సీపీకి, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌కు, మళ్లీ తిరిగి కాంగ్రెస్‌కు మారిన చరిత్ర వీరిది. ఒకవేళ వీరు వ్యూహాత్మకంగా బీజేపీలో చేరినా, అది తాత్కాలిక రాజకీయ ఆశ్రయం మాత్రమే అవుతుంది. సిద్ధాంతాల కంటే తమ ఆధిపత్యానికే ప్రాధాన్యమిచ్చే కొండా దంపతులకు బీజేపీ ఒక ఆప్షన్ కావచ్చు కానీ, ఆ బంధం సుదీర్ఘ కాలం నిలవడం మాత్రం కష్టమేనని పొలిటికల్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి.

This post was last modified on August 27, 2026 7:30 pm

Share

Recent Posts

ప్రాణాలు తీసుకునే ముందు… ఆ పాప గుర్తుకు రాలేదా?

అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద…

1 hour ago

పార్ల‌మెంటు డీలిమిటేష‌న్‌పై కాంగ్రెస్ భయం దేనికి?

దేశ‌వ్యాప్తంగా 543 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై కాంగ్రెస్ పార్టీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను వ‌చ్చే 25 ఏళ్ల…

3 hours ago

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌… `ప‌ర్స‌న‌లైజ్` అవుతున్న పార్టీలు!

రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌లో గ‌తానికి భిన్న‌మైన `వ్య‌క్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇందిర‌మ్మ హ‌యాంలో…

4 hours ago

టీడీపీకి ఓట్ల `ప్రాజెక్టులు`… త‌మ్ముళ్లు హ్యాపీ.. !

కీల‌క‌మైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న ప్రాజెక్టుల‌నే…

9 hours ago

దేశ‌వ్యాప్తంగా 288 మంది.. ఏపీలో ఐదుగురు.. ఏమ‌య్యారు?

దేశ‌వ్యాప్తంగా 288 మంది నేపాల్ వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంత‌య్యార‌ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. మొత్తం 532 మంది ఆచూకీ క‌నిపించ‌కుండా…

11 hours ago

మృతదేహాల నుంచి నగల అపహరణ… నేపాల్‌లో అమానవీయం

నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…

11 hours ago