బీసీసీఐలో ఇప్పుడు కీలక మార్పులు జరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికి ముప్పు పొంచి ఉందని, ఆయన స్థానంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టే యోచనలో బోర్డు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ వివాదానికి ప్రధాన కారణం ఇంగ్లాండ్ టూర్లో కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి వచ్చిన పుకార్లే. రెండో వన్డే సమయంలో రోహిత్ తప్పుకుంటాడనే వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, చీఫ్ సెలెక్టర్ను ఏమాత్రం సంప్రదించకుండానే బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందిస్తూ.. రోహిత్ జట్టుతోనే కొనసాగుతాడని ప్రకటించారు. ఆ తర్వాతి మ్యాచ్లో రోహిత్ 138 పరుగులతో అదరగొట్టాడు. బోర్డుకి, సెలెక్టర్లకు మధ్య జరిగిన ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఈ వివాదం మొదలైంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఆటగాళ్లను సమర్థవంతంగా డీల్ చేయాలంటే వీవీఎస్ లక్ష్మణ్ లాంటి గౌరవప్రదమైన వ్యక్తి అయితేనే కరెక్ట్ అని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబర్లో జరిగే వార్షిక సమావేశంలో (AGM) దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే అగార్కర్ దారులు పూర్తిగా మూసుకుపోలేదు. త్వరలో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్లో జట్టు మంచి ఫలితాలు సాధిస్తే, 2027 వరల్డ్ కప్ వరకు ఆయనకే ఎక్స్టెన్షన్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది.
రోహిత్ శర్మ భవిష్యత్తుపై సెలెక్షన్ కమిటీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ నాటికి రోహిత్ను పక్కనపెట్టి కొత్త ప్రణాళికలతో వెళ్లాలని కొందరు సెలెక్టర్లు అభిప్రాయపడుతున్నారు. కానీ, సోషల్ మీడియాలో అభిమానుల నుంచి వస్తున్న మద్దతు చూసి కొందరు బోర్డు పెద్దలు మాత్రం రోహిత్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో టీమిండియా దారుణంగా విఫలమైంది. ఆడిన 10 మ్యాచ్లలో ఏకంగా 8 ఓడిపోయింది. దీనిపై జరగాల్సిన కీలకమైన రివ్యూ మీటింగ్ బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అనారోగ్యం వల్ల వాయిదా పడింది. త్వరలోనే ఈ సమావేశం జరగనుండగా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వర్చువల్గా ఇందులో పాల్గొననున్నాడు.
This post was last modified on August 6, 2026 9:04 pm
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…