ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంపై దృష్టి సారించారు. నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి తన పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయం కనుక ఇక్కడ తనకు ఎదురులేకుండా చేసుకునే వ్యూహంలో భాగంగా పిఠాపురంకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు.
ప్రధానంగా రహదారులను అభివృద్ధి పనులు చేపట్టారు. 307 కిలో మీటర్ల రహదారులను నిర్మించనున్నారు. మరమ్మత్తుల కోసం 200 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పటికే 100 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రోడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రహదారులు, సీసీ రోడ్లు వంటివి కూడా 80 శాతానికి పైగా పూర్తి చేశారు. ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలైన చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డిలకు సొంత నియోజకవర్గాలున్నాయి. చంద్రబాబుకు కుప్పం కంచుకోటగా మారింది. జగన్ కు పులివెందుల తిరుగులేని ఆధిపత్యం కట్ట బెడుతుంది. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గంలో శాశ్వతంగా పాగా వేయాలని ప్లాన్ చేస్తుకుంటున్నారు. తనకున్న అవకాశంతో నియోజకవర్గాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు.
అయితే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన పార్టీగా జనసేన ఉన్నందున, తనకు ఒక కంచుకోట తప్పక ఉండాలి. పవన్ చేస్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురాన్ని జనసేనకు ఒక కంచు కోటగా మారుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదనేది రాజకీయ విశ్లేషకుల మాట.
This post was last modified on August 6, 2026 8:24 pm
న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…
ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…
అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…
దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…
హైదరాబాద్కు చెందిన 33 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ సిద్దిపేటలోని ఒక హోటల్ గదిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.…