Trends

భారత్ ఫార్మాపై ట్రంప్ టారిఫ్ ల్యాండ్ బాంబ్!

భారత ఫార్మా రంగానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. జెనరిక్ ఔషధాల దిగుమతులపై దశలవారీగా భారీ సుంకాలను విధించనున్నట్లు ఆయన ప్రకటించారు. 2026 ఆగస్టు 1 నుండి రెండేళ్ల పాటు జీరో శాతం టారిఫ్ ఉంటుందని, 2028 ఆగస్టు నుండి ఏకంగా 100 శాతం, 2029 నుండి 200 శాతం సుంకం అమలు చేస్తామని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఫార్మా కంపెనీలు అమెరికాలోనే ప్లాంట్లు పెట్టి ఉత్పత్తులను తయారు చేయాలనేదే తన ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

ఈ నిర్ణయం వల్ల భారతదేశానికి భారీగా నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచానికే ‘ఫార్మసీ’గా పేరుగాంచిన భారత్, ప్రతి ఏటా అమెరికాకు దాదాపు 9 నుండి 10 బిలియన్ డాలర్ల విలువైన జెనరిక్ మందులను ఎగుమతి చేస్తోంది. అమెరికాలో వాడే మొత్తం జెనరిక్ మందుల్లో దాదాపు 40 శాతం వాటా ఇండియాదే. బిపి, షుగర్, క్యాన్సర్, ఇతర తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన భారతీయ మందులను అక్కడి ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు.

పేటెంట్ మందుల కంపెనీలతో పోలిస్తే జెనరిక్ ఔషధాలు తయారుచేసే సంస్థలకు లాభాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వందల శాతాల్లో పన్నులు పడితే, ఆ భారాన్ని తట్టుకుని తక్కువ ధరలకే మందులు అమ్మడం కంపెనీలకు చాలా కష్టం. రాత్రికి రాత్రే అమెరికాలో ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రొడక్షన్ మొదలుపెట్టడం కూడా ఏ మందుల కంపెనీకి సాధ్యమయ్యే పని కాదు. సండోజ్, తేవా, వయాట్రిస్ లాంటి గ్లోబల్ దిగ్గజాలు కూడా ఈ నిబంధనల వల్ల ఇబ్బందుల్లో పడనున్నాయి.

ప్రస్తుతానికి భారతీయ కంపెనీలకు ఈ సుంకాల నుండి ఏమైనా మినహాయింపు దక్కుతుందా లేదా అనేది ఇంకా క్లియర్‌గా తెలియలేదు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే వాణిజ్య పరమైన చర్చలు జరుగుతున్నందున, భారత ప్రభుత్వం ఫార్మా ఎగుమతులపై ప్రత్యేక సడలింపుల కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. అయితే బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధాల విషయంలో పాత నిబంధనలే కొనసాగుతాయని అమెరికా స్పష్టం చేసింది. దేశీయంగా తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా ప్రభుత్వం చెప్తున్నా, దీనివల్ల మందుల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

This post was last modified on July 22, 2026 11:10 am

Share

Recent Posts

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

2 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

5 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

5 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

5 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

7 hours ago

జగన్ కేసుల లోగుట్టు సాయిరెడ్డి విప్పనున్నారా?

వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…

9 hours ago