బాలయ్య నిన్న జరిగిన NBK 111 షూటింగ్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్రమైన గాయం కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ ఏఐజిలో చేరిన తర్వాత ఇవాళ చిన్న శస్త్ర చికిత్స నిర్వహించబోతున్నట్టు సమాచారం. అది అయ్యాక కనీసం నెల రోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించిన హెల్త్ బులెటిన్ ఇవాళో రేపో విడుదల చేసే అవకాశం ఉంది. అది వచ్చాక ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వొచ్చు.
ఆరోగ్యం ప్రధానం కాబట్టి బాలకృష్ణ రెస్టు తీసుకోవడం చాలా అవసరం. ఇదిలా ఉండగా డిసెంబర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్న ఎన్బికె 111 ఇప్పుడు తన ప్రణాళికను మార్చుకోక తప్పేలా లేదు. ఎందుకంటే నాలుగు వారాలు షూటింగ్ కి దూరమంటే ఆగస్ట్ చివరికి కానీ బాలయ్య బయటికి రాలేరు. ఈలోగా ఆర్టిస్టుల కాల్ షీట్లు మారిపోతాయి. షెడ్యూల్స్ ని మళ్ళీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాంబినేషన్ ఉన్న ఎపిసోడ్లకు కొంత ఇబ్బందికర పరిస్థితి వస్తుంది.
అదే జరిగితే 2027 సంక్రాంతి లేదా అంతకన్నా ఆలస్యంగా ఎన్బికె 111 వస్తుంది. ప్రస్తుతానికి ఇవన్నీ అంచనాల దశనే కాబట్టి బాలయ్య ఇంకా త్వరగా కోలుకుంటే ప్లానింగ్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు తమన్ సంగీతం సమకూరుస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ లెక్కన కొరటాల శివ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. గత కొన్నేళ్లలో బాలయ్య షూటింగ్ లో గాయపడిన సందర్భాలు లేవు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి సమస్య రాకుండా చూసుకున్నారు. అయితే నిన్న అనుకోకుండా జరిగిన ఘటన వల్ల పట్టుతప్పి కింద పడ్డారు. ఆందోళన చెందాల్సింది లేకపోయినా ఈ వయసులో బాలయ్య లాంటి సీనియర్ హీరోలు విపరీతమైన జాగురుకతతో ఉండాలి. తారక్, పవన్ కళ్యాణ్ సహా ఎందరో ప్రముఖులు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
This post was last modified on July 22, 2026 10:57 am
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…