Trends

నిన్న జొన్నగిరి… నేడు రామగిరి

రాయలసీమకు కరువు సీమ అనే ముద్ర శరవేగంగా తొలగిపోతోంది. తాగు, సాగు నీరు లేని నేలగా గతంలో ఉన్న సీమ జిల్లాలు ఇప్పుడు పుష్కలమైన నీటి వనరులతో అలరారుతున్నాయి. తాజాగా బంగారు గనులతో రాయలసీమ రతనాల సీమగా మారిపోతోంది. ఇప్పటికే రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో బంగారం వెలికితీత ప్రారంభం కాగా…త్వరలోనే శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి ప్రాంతంలోనూ గోల్డ్ మైన్స్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పరిశీలన పూర్తి కాగా… త్వరలోనే బంగారు వెలికితీతకు సంబంధించిన టెండర్లను పిలిచేందుకు కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది.

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రామగిరి ప్రాంతంలో 2002 దాకా బంగారం వెలికితీత పనులు కొనసాగాయి. బంగారం వెలికితీతకు సంబంధించి అప్పటిదాకా జారీ అయిన టెండర్ల గడువు ముగియడంతో రామగిరి గోల్డ్ ఫీల్డ్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అయితే తాజాగా ఏపీలో కూటమి సర్కారు అదికారం చేపట్టిన తర్వాత సీమలో అత్యంత విలువైన ఖనిజ సంపద ఉన్న విషయాన్ని గుర్తించి… వాటిలో అత్యంత అరుదైనదిగా భావిస్తున్న బంగారును వెలికితీసేందుకు రంగం సిద్ధం అయ్యింది. అందులో భాగంగా తొలుత కర్నూలు జిల్లా పరిధిలోని జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ఇటీవలే ప్రారంభం కాగా..రామగిరిలో గోల్డ్ మైనింగ్ కు రంగం సిద్దం అవుతోంది.

ప్రస్తుతం సత్యసాయి జిల్లా పరిధిలోని ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోరి వచ్చిన రామగిరిలో బంగారం ఖనిజ నిక్షేపాలు పెద్ద ఎత్తున ఉన్నట్లుగా ఇటీవలే గుర్తించారు. ఈ విషయంపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం ఖనిజం ఏ స్థాయిలో ఉంది? సదరు ఖనిజంలో బంగారం విలువ ఎంత? అన్న వివరాలపై అధ్యయనం చేయించింది. ఈ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ లో టన్నకు 1 గ్రామ్ బంగారం మాత్రమే వస్తుండగా… రామగిరి ఖనిజంలో టన్నుకు ఏకంగా 4 గ్రామలు బంగారం వచ్చే అవకాశాలు ఉన్నాయట. 

ఈ విషయం తెలిసిన వెంటనే… ఏపీ ఖనిజ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవలే రామగిరి ప్రాంతంలో పర్యటించారు. స్థానిక (రాప్తాడు) ఎమ్మెల్యే పరిటాట సునీత, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ లతో కలిసి రామగిరి పరిధిలోని ఖనిజ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గతంలో రామగిరి పరిధిలో జరిగిన గోల్డ్ మైనింగ్ ప్రాంతంతో పాటుగా అక్కడి జరిగిన కార్యకలాపాలను ఆయన పరిశీలించారు. జొన్నగిరి కంటే లాభదాయకమైన గోల్డ్ మైనింగ్ రామగిరిలో సాధ్యం కానున్న నేపథ్యంలో అతి త్వరలోనే రామగిరిలో గోల్డ్ మైనింగ్ ను ప్రారంభిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

కర్నూలులో జొన్నగిరి, శ్రీసత్యసాయిలో రామగిరిలతో పాటు రాయలసీమలోని మరిన్ని ప్రాంతాల్లో బంగారం వంటి విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లుగా మంత్రి రవీంద్ర తెలిపారు. అందులో భాగంగా జొన్నగిరి, రామగిరితో పాటు చిత్తూరు జిల్లాలోని చిగురుకుంట ప్రాంతంలోనూ బంగారం నిక్షేపాలు ఉన్నట్లుగా తేలిందని ఆయన చెప్పుకొచ్చారు. రామగిరి తర్వాత చిగురుకుంటలోనూ గోల్డ్ మైనింగ్ కార్యకలాపాలను ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. మొత్తంగా కరువు సీమగా పేరున్న రాయలసీమ ఇప్పుడు నిజంగానే రతనాల సీమగా మారిపోనుందని చెప్పక తప్పదు.

This post was last modified on July 17, 2026 5:44 pm

Share

Recent Posts

నేపాల్‌లో జ‌ల ప్ర‌ళ‌యం… టిబెట్‌పై చైనా కుట్ర చేసిందా?!

భార‌త పోరుగు దేశం, దేవ‌భూమి నేపాల్‌లో ఒక్క‌సారిగా సంభ‌వించిన జ‌ల ప్ర‌ళ‌యం.. ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేసింది. ఒక్క‌సారిగా ఉప్పొంగిన కోశీ…

33 minutes ago

తక్కువ బడ్జెట్ హనుమాన్… హిట్టు కొట్టేసింది  

మూడు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో కొత్త రికార్డులు తిరగరాస్తూ హనుమాన్ ఎంత సంచలన విజయం సాధించిందో మూవీ లవర్స్…

1 hour ago

రవితేజ ఇకపై మరింత జాగ్రత్తగా

వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…

2 hours ago

సందీప్ వంగ ప్రభావం ఆ స్థాయిలో ఉంది

తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…

3 hours ago

పులివెందుల టికెట్ వదులుకుంటారా జగన్ సార్?

ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణ‌యాలు.. చేసే ప్ర‌క‌ట‌నల విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. స‌మ‌యం వ‌చ్చింద‌నో.. సంద‌ర్భం చిక్కింద‌నో…

4 hours ago

బ్యాలెట్ పోరుపై వైసీపీ ఆశ‌లు ఫ‌లించేనా…?

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న స్థానిక ఎన్నిక‌ల‌ను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికి ఎన్నిక‌ల సంఘం కూడా…

4 hours ago