షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పోక్సో కేసులో అరెస్టైన కుమార్ బెయిల్ పై విడుదలైన వెంటనే బాధిత బాలిక, ఆమె తల్లి, ఆమె నాయనమ్మతో పాటు తన భార్య, ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్య చేయడం సంచలనం రేపింది.
ఆ తర్వాత పరారీలో ఉన్నాడు. కుమార్ ను ఎన్ కౌంటర్ చేయాలని, ఉరిశిక్ష వేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కుమార్ చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.
కొత్తూరు మండలంలోని పంజర్ల గ్రామం వద్ద ఒక వెంచర్లో అతడి మృతదేహం లభించిందని పోలీసులు తెలిపారు. స్థానికులు సమాచారమివ్వడంతో పోలీసులు అక్కడకు వెళ్లి శవాన్ని పరిశీలించారు.
ఆ మృతదేహం పక్కనే పురుగుల మందు డబ్బా ఉందని, ఆ మృతదేహం కుమార్ దేనని పోలీసులు చెబుతున్నారు. ఆ వెంచర్ కుమార్ బంధువుదని, అక్కడకు వచ్చి కుమార్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, రాజ్ కుమార్ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…