షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పోక్సో కేసులో అరెస్టైన కుమార్ బెయిల్ పై విడుదలైన వెంటనే బాధిత బాలిక, ఆమె తల్లి, ఆమె నాయనమ్మతో పాటు తన భార్య, ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్య చేయడం సంచలనం రేపింది.
ఆ తర్వాత పరారీలో ఉన్నాడు. కుమార్ ను ఎన్ కౌంటర్ చేయాలని, ఉరిశిక్ష వేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కుమార్ చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.
కొత్తూరు మండలంలోని పంజర్ల గ్రామం వద్ద ఒక వెంచర్లో అతడి మృతదేహం లభించిందని పోలీసులు తెలిపారు. స్థానికులు సమాచారమివ్వడంతో పోలీసులు అక్కడకు వెళ్లి శవాన్ని పరిశీలించారు.
ఆ మృతదేహం పక్కనే పురుగుల మందు డబ్బా ఉందని, ఆ మృతదేహం కుమార్ దేనని పోలీసులు చెబుతున్నారు. ఆ వెంచర్ కుమార్ బంధువుదని, అక్కడకు వచ్చి కుమార్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, రాజ్ కుమార్ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
This post was last modified on July 13, 2026 6:38 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…