Trends

నాణానికి రెండు వైపులు ఉంటాయి

నిజమే… నాణేనికి రెండు వైపులూ ఉంటాయి. నాణెం ఎప్పుడూ ఒక వైపుతోనే ముద్రించబడదు. నాణేనికి ఓ వైపు బొమ్మ ఉంటే… మరోవైపున బొరుసు కూడా ఉంటుంది. అయితే మెజారిటీ సమాజం ఆ నాణేనికి ఉన్న బొమ్మను మాత్రమే గుర్తిస్తూ… బొరుసును గుర్తించదు. ఇది అసంకల్పితమే అయినప్పటికీ… బాధ్యత గల ప్రజా ప్రతినిధులు అయినా, అదికారులు అయినా… బొమ్మతో పాటు బొరుసునూ గుర్తిస్తారు. తొలుత తాము బొరుసును గుర్తించని వైనాన్ని నిజాయతీగా ఒప్పుకుంటారు. అదే సమయంలో బొరుసు బయటపడిన తీరును కూడా వారు ఏమాత్రం సంకోచించకుండా సమాజానికి వెలిబుచ్చుతారు.

అలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలంగాణ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి.. రాష్ట్రంలో అదనపు డీజీ హోదాలో పనిచేస్తున్న మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తులో వెలుగుచూసిన ఘటన ఇది. హైదరాబాద్ మహా నగర పరిధిలోని రాచకొండ పోలీస్ కమిషనర్ గా భగవత్ ఉన్నప్పుడు జరిగిన ఘటన ఇది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో స్వయంగా భగవతే ఈ విషయాన్ని వెల్లడించారు. కేసు నమోదు, నిందితుల అరెస్టు, ఆ తర్వాత చోటుచేసుకున్న ట్విస్టులను ఆయన ఆసక్తికరంగా వివరించారు. అంతేకాకుండా సదరు కేసు దర్యాప్తులో బాగంగా తొలుత తాము పొరబడిన విషయాన్నీ ఆయన ఒప్పుకున్న తీరు నిజంగానే ఆసక్తికరమని చెప్పక తప్పదు.

భగవత్ రాచకొండ సీపీగా ఉన్న సమయంలో ఓ యువతి నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓ ఆటో డ్రైవర్ తో పాటు నలుగురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు అయ్యింది. దర్యాప్తులో భాగంగా భగవత్ టీం నిందితులను పట్టేసింది. అయితే విచారణలో తామెలాంటి తప్పు చేయలేదని నిందితులు చెప్పారు. అంతేకాకుండా తాము తప్పు చేసినట్టు ఏ ఒక్క ఆధారమూ లేదని, ఆ యువతే తప్పుడు ఫిర్యాదు చేసిందని తెలిపారు. నిందితులు పదే పదే అదే విషయాన్ని చెబుతుండటంతో భగవత్ వారి వైపు నుంచి ఆలోచించారు.

కేసులో ఆధారాలను భగవత్ మరోమారు పరిశీలించారు. కేసులో కీలకమైన సీన్ రీకన్ స్ట్రక్షన్ ను చేపట్టారు. అక్కడే అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది. నిందితులు చెప్పినట్లుగా రేప్ ఏమీ జరగలేదని, బాధితురాలు నిందితుల్లోని ఓ ఆటో డ్రైవర్ పై కక్షపూరితంగానే ఈ కేసు పెట్టిందని గుర్తించారు. ఇంకేముంది… బాదితురాలిని పిలిపించిన భగవత్…ఆమెను అన్ని కోణాల్లో మరోమారు విచారించారు. ఈ సందర్భంగా యువతి తన తప్పును ఒప్పేసుకుంది. ఆటో రుసుము చెల్లింపు సందర్భంగా ఆటో డ్రైవర్ తో తగాదా జరగగా… దానిపై కక్షసాధించేందుకే తాను అతడితో పాటు మరో ముగ్గురిపై ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. దీంతో భగవత్ యువతిని మందలించి… నిందితులను వదిలిపెట్టేశారు.

అక్కడితోనే ఆగిపోయి ఉంటే… ఇదసలు కేసే కాదు. చాలా మంది దర్యాప్తు అదికారులు నిజం తేలింది కదా ఇక వదిలేద్దామనుకుంటారు. మరి అకారణంగా రేపిస్టులు అని ముద్ర పడిన ఆ నలుగురి పరిస్థితి ఏమిటి? ఆ దిశగానే ఆలోచించిన భగవత్… మీడియా సమావేశం పెట్టి మరీ ఆ నలుగురు నిందితులు మంచివారేనని, వారిపై అకారణంగానే రేపిస్టులు అనే ముద్ర పడిందని చెప్పారు. ఆ నలుగురు రేపిస్టులు ఎంతమాత్రం కాదని… వారు సమాజంలో మంచి పౌరులని పేర్కొని మరీ వారిని వదిలిపెట్టారు. అక్కడితో ఆ కేసు క్లోజ్ కాగా… ఇప్పుడు ఆ నలుగురు కూడా మంచిగానే జీవితం సాగిస్తున్నారు.

This post was last modified on July 4, 2026 2:10 pm

Share

Recent Posts

విజయ్ జయలలిత పేరు ఎందుకు చెప్పలేదు?

తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. "1967లో అన్నాదురై,…

11 hours ago

మనుషులను గోకుతూ.. నెలకు రూ.14 లక్షలు సంపాదిస్తున్నాడు!

ఎక్కడైనా దురద పెడితే చేతితో గోక్కుంటాం. లేదంటే పక్కన ఉన్నవాళ్లను కాస్త గోకమని అడుగుతాం. కానీ చైనాలో మాత్రం ఇదే…

11 hours ago

తెలంగాణా అసెంబ్లీలో బ్లాక్ డే

తెలంగాణా అసెంబ్లీ ప్రారంభం కావడమే యుద్ధ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ గేటు వద్ద ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో…

12 hours ago

కూలిపోయిన హాస్టల్… అగ్రిమెంట్‌లో మాత్రం ‘మాకు బాధ్యత లేదు’!

ఢిల్లీలో హాస్టల్ భవనం కూలిపోయిన ఘటనలో ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఏడుగురు మరణించిన విషయం తెలిసిందే.…

15 hours ago

అప్పుడు బన్నీతో… ఇప్పుడు బాలయ్యతో?

తెలుగు సినిమాల్లోకి పరభాషా నటులను క్యారెక్టర్, విలన్ పాత్రల్లోకి తీసుకోవడం కొత్తేమీ కాదు. ఇది దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయమే. సొంత…

16 hours ago

ది ప్యారడైజ్.. నాన్ స్టాప్ మోడ్

చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేస్తాడని నేచురల్ స్టార్ నానికి ఉన్న పేరును ‘ది ప్యారడైజ్’ బాగా దెబ్బ తీసింది.…

16 hours ago