సాప్ట్ వేర్ రంగమంతా ఇప్పుడు వీకెండ్ వచ్చిందంటే… ఫుల్ ఎంజాయ్ మెంట్ లోకి దిగిపోతోంది. శని, ఆదివారాలు రెండు రోజులూ ఇల్లు కూడా గుర్తుకు రానంతగా జల్సాల్లో మునిగి తేలుతున్నారు. ఇలాంటి ఓ వీకెండ్ పార్టీకి వెళ్లిన ఓ యువ టెకీ పార్టీలోనే విగత జీవిగా మారిపోయాడు. హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టగా… ఈ టెకి మృతి మాత్రం మిస్టరీగానే మారిపోయింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే… మంచిర్యాల జిల్లాకు చెందిన గండ్ల రాము (27) ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చాడు. రామాంతపూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో అతడు సాఫ్ట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. సాఫ్ట్ వేర్ అంటేనే… వారాంతాల్లో ఎంజాయ్ మెంటే కదా. అదే బాటన రాము పనిచేస్తున్న సంస్థ కూడా సాగింది. ఆ కంపెనీలోని తన సహోద్యోగులతో కలిసి రాము వీకెండ్ పార్టీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
వీకెండ్ పార్టీని వీరంతా కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని ఓ ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసుకున్నారు. అనుకున్నదే తడవుగా అంతా కలిసి ఆ ఫామ్ హౌస్ కు చేరిపోయారు. శనివారం సాయంత్రం మొదలైన ఈ పార్టీ ఆ రోజు అర్దరాత్రి దాకా కొనసాగినట్లు సమాచారం. పోలీసులకు ఏమాత్రం సమాచారం లేకుండానే ఈ పార్టీని నడుపుకున్న వీరంతా… చివరలో రాము ఫామ్ హౌస్ లోని స్విమ్మింగ్ పూల్ లో రాము అచేతనావస్థలో కనిపించడంతో షాక్ తిన్నారు.
ఎలాగోలా రామును స్విమ్మింగ్ పూల్ లో నుంచి బయటకు తీసుకువచ్చినా కూడా అతడిలో చలనం కనిపించలేదు. దీంతో అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా… అప్పటికే రాము చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఫలితంగా ఆ బ్యాచ్ సమాచారాన్ని పోలీసులకు చేరవేయక తప్పలేదు. సమాచారం అందుకున్న పోలీసులు రాము మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి… ఫామ్ హౌస్ ను పరిశీలించారు.
ఇదిలా ఉంటే… వీకెండ్ పార్టీలో ఎంజాయ్ కోసం వచ్చి విగత జీవిగా మారిన రాము శరీరంపై కొన్నిచోట్ల గాయాలు కనిపించినట్లు సమాచారం. దీంతో రామును అతడి స్నేహితులే హత్య చేసి ఉంటారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే స్విమ్మింగ్ పూల్ లో దిగిన తర్వాతే అతడు ఊపిరాడక చనిపోయి ఉంటాడని అతడి స్నేహితులు చెబుతున్నారు. దీంతో మిస్టరీ డెత్ గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు మొదలుపెట్టారు.
This post was last modified on June 15, 2026 12:57 pm
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…