సాప్ట్ వేర్ రంగమంతా ఇప్పుడు వీకెండ్ వచ్చిందంటే… ఫుల్ ఎంజాయ్ మెంట్ లోకి దిగిపోతోంది. శని, ఆదివారాలు రెండు రోజులూ ఇల్లు కూడా గుర్తుకు రానంతగా జల్సాల్లో మునిగి తేలుతున్నారు. ఇలాంటి ఓ వీకెండ్ పార్టీకి వెళ్లిన ఓ యువ టెకీ పార్టీలోనే విగత జీవిగా మారిపోయాడు. హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టగా… ఈ టెకి మృతి మాత్రం మిస్టరీగానే మారిపోయింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే… మంచిర్యాల జిల్లాకు చెందిన గండ్ల రాము (27) ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చాడు. రామాంతపూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో అతడు సాఫ్ట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. సాఫ్ట్ వేర్ అంటేనే… వారాంతాల్లో ఎంజాయ్ మెంటే కదా. అదే బాటన రాము పనిచేస్తున్న సంస్థ కూడా సాగింది. ఆ కంపెనీలోని తన సహోద్యోగులతో కలిసి రాము వీకెండ్ పార్టీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
వీకెండ్ పార్టీని వీరంతా కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని ఓ ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసుకున్నారు. అనుకున్నదే తడవుగా అంతా కలిసి ఆ ఫామ్ హౌస్ కు చేరిపోయారు. శనివారం సాయంత్రం మొదలైన ఈ పార్టీ ఆ రోజు అర్దరాత్రి దాకా కొనసాగినట్లు సమాచారం. పోలీసులకు ఏమాత్రం సమాచారం లేకుండానే ఈ పార్టీని నడుపుకున్న వీరంతా… చివరలో రాము ఫామ్ హౌస్ లోని స్విమ్మింగ్ పూల్ లో రాము అచేతనావస్థలో కనిపించడంతో షాక్ తిన్నారు.
ఎలాగోలా రామును స్విమ్మింగ్ పూల్ లో నుంచి బయటకు తీసుకువచ్చినా కూడా అతడిలో చలనం కనిపించలేదు. దీంతో అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా… అప్పటికే రాము చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఫలితంగా ఆ బ్యాచ్ సమాచారాన్ని పోలీసులకు చేరవేయక తప్పలేదు. సమాచారం అందుకున్న పోలీసులు రాము మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి… ఫామ్ హౌస్ ను పరిశీలించారు.
ఇదిలా ఉంటే… వీకెండ్ పార్టీలో ఎంజాయ్ కోసం వచ్చి విగత జీవిగా మారిన రాము శరీరంపై కొన్నిచోట్ల గాయాలు కనిపించినట్లు సమాచారం. దీంతో రామును అతడి స్నేహితులే హత్య చేసి ఉంటారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే స్విమ్మింగ్ పూల్ లో దిగిన తర్వాతే అతడు ఊపిరాడక చనిపోయి ఉంటాడని అతడి స్నేహితులు చెబుతున్నారు. దీంతో మిస్టరీ డెత్ గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు మొదలుపెట్టారు.
అభివృద్ధి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన గౌరవం కల్పించింది. విమానాశ్రయం ప్రారంభోత్సవం…
ఇటీవలే విడుదలైన సింగ్ గీతంకు ఊహించిన దానికన్నా పెద్ద స్పందన కనిపిస్తోంది. కంటెంట్ మాస్ ప్రేక్షకులకు పూర్తిగా కనెక్టయ్యేలా లేకపోయినా…
2026 సంవత్సరంలో ఆరు నెలలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంకో రెండు వారాలు బాలన్స్ ఉంది. ఈ ఏడాది మొత్తంలో పదమూడు…
ఈ ఏడాది మోస్ట్ అవైడెట్ సినిమాల్లో టాక్సిక్ ఒకటి. కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్…
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతలకు మధ్య పలు కేసుల విచారణకు…
ఏపీలో టీడీపీ-వైసీపీల మధ్య మాటల తూటాలు.. మరింత భారీ రేంజ్లో పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ చేసిన వ్యాఖ్యలపై…