అభివృద్ధి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన గౌరవం కల్పించింది. విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా భూములు ఇచ్చిన రైతులు, రైతు కూలీలు, మహిళలను తొలి ప్రయాణికులుగా ఆహ్వానించి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది.
జేవర్ ప్రాంతానికి చెందిన 170 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు లక్నో నుంచి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన తొలి ప్రయాణికుల విమానంలో ప్రయాణించారు. గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాలోని జేవర్ ప్రాంత రైతు కుటుంబాలు విమానాశ్రయం నిర్మాణం కోసం తమ పూర్వీకుల భూములను అందించాయి.
ఒకప్పుడు తాము సాగు చేసిన పొలాలపై నేడు ప్రపంచ స్థాయి విమానాశ్రయం నిర్మితమవడాన్ని రైతులు గర్వంగా వీక్షించారు. తమ భూములపై నిర్మించిన విమానాశ్రయం నుంచే తొలి విమాన ప్రయాణం చేయడం జీవితంలో మరపురాని అనుభూతిగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, విమానాశ్రయ నిర్మాణానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రైతుల త్యాగం, సహకారం వల్లే ఇటువంటి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతులను తొలి ప్రయాణికులుగా గౌరవించడం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
This post was last modified on June 15, 2026 1:11 pm
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…