భాగ్య నగరిగా పిలుచుకుంటున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక తప్పదు. రెండు, మూడేళ్ల క్రితం నగర శివారులోని కోకాపేటలో ప్రభుత్వ భూములను వేలం వేయగా.. ఎకరం ధర రూ.100 కోట్లు పలికిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే… తాజాగా ఆ ధర కాస్తా ఏకంగా రూ.237 కోట్లకు చేరి నిజంగానే జనానికి కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. కేవలం రెండేళ్ల వ్యవదిలోనే నగరంలోని భూముల ధర ఇలా రెండింతలు, మూడింతలు అయిపోతున్న తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.
నగరంలోని గచ్చిబౌలి సమీపంలోని రాయదుర్గంలో టీజీఐఐసీకి కేటాయించిన భూములున్న సంగతి తెలిసిందే. ఈ భూముల్లోని సర్వే నెంబరు 83/1లో – 6 ఎకరాల 9 గుంటల భూమి ఉండగా… దానిని గురువారం వేలం వేశారు. ఈ వేలానికి ప్రభుత్వాన్నే షాక్ కు గురి చేసే స్పందన లభించింది. బిడ్డింగ్ లో పాలుపంచుకున్న గౌర వెంచర్స్ ఈ భూమిని దక్కించుకుంది. ఈ భూమి కోసం ఆ సంస్థ ఎకరానికి ఏకంగా రూ.237 కోట్లను కోట్ చేయడం గమనార్హం.
ఎకరం భూమి ఏకంగా రూ.237 కోట్లు పలకడంతో నగర చరిత్రలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో చరిత్రలో మరెన్నడూ లేని రీతిలో భారీ ధర లభించినట్టైంది. ఫలితంగా ఇప్పటిదాకా నమోదైన రికార్డులన్నీ కూడా ఈ వేలంతో బద్దలైపోయాయని చెప్పక తప్పదు. ఇదే ప్రాంతంలో గతంలో ప్రభుత్వమే భూములను వేలం చేయగా…ఎకరాకు రూ.177 కోట్ల ధర లభించింది. దానిని తలదన్నేలా ఇప్పుడు ఎకరాకు ఏకంగా రూ.237 కోట్ల ధర రావడం గమనార్హం.
అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నర్సీపట్నం నియోజకవర్గంలో…
టాలీవుడ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇక్కడున్న టాప్ స్టార్లు చాలామందితో ఒకటికి మించి సినిమాలు చేసిందామె. తమిళంలోనూ…
2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని…
కొత్త సినిమాలకు ప్రమోషన్ తగ్గినా కష్టమే. ప్రచారం మరీ ఎక్కువైనా ప్రమాదమే. వీలైనంత ఎక్కువగా ప్రమోషన్లు చేసి జనం దృష్టి…
టిడిపిలో భారీ జోష్ కనిపించింది. ముఖ్యంగా 33% సీట్లను, పదవులను మహిళలకు కేటాయిస్తామని పార్టీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు…
ఢిల్లీలో జరిగిన పెద్ది ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ ఒక ఆసక్తికరమైన విషయం పంచుకున్నాడు. గతంలో ఒకసారి ప్రధాన…