Trends

హైదరాబాద్‌లో ఎకరం ఎంతంటే..

భాగ్య నగరిగా పిలుచుకుంటున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక తప్పదు. రెండు, మూడేళ్ల క్రితం నగర శివారులోని కోకాపేటలో ప్రభుత్వ భూములను వేలం వేయగా.. ఎకరం ధర రూ.100 కోట్లు పలికిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే… తాజాగా ఆ ధర కాస్తా ఏకంగా రూ.237 కోట్లకు చేరి నిజంగానే జనానికి కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. కేవలం రెండేళ్ల వ్యవదిలోనే నగరంలోని భూముల ధర ఇలా రెండింతలు, మూడింతలు అయిపోతున్న తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.

నగరంలోని గచ్చిబౌలి సమీపంలోని రాయదుర్గంలో టీజీఐఐసీకి కేటాయించిన భూములున్న సంగతి తెలిసిందే. ఈ భూముల్లోని సర్వే నెంబరు 83/1లో – 6 ఎకరాల 9 గుంటల భూమి ఉండగా… దానిని గురువారం వేలం వేశారు. ఈ వేలానికి ప్రభుత్వాన్నే షాక్ కు గురి చేసే స్పందన లభించింది. బిడ్డింగ్ లో పాలుపంచుకున్న గౌర వెంచర్స్ ఈ భూమిని దక్కించుకుంది. ఈ భూమి కోసం ఆ సంస్థ ఎకరానికి ఏకంగా రూ.237 కోట్లను కోట్ చేయడం గమనార్హం.

ఎకరం భూమి ఏకంగా రూ.237 కోట్లు పలకడంతో నగర చరిత్రలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో చరిత్రలో మరెన్నడూ లేని రీతిలో భారీ ధర లభించినట్టైంది. ఫలితంగా ఇప్పటిదాకా నమోదైన రికార్డులన్నీ కూడా ఈ వేలంతో బద్దలైపోయాయని చెప్పక తప్పదు. ఇదే ప్రాంతంలో గతంలో ప్రభుత్వమే భూములను వేలం చేయగా…ఎకరాకు రూ.177 కోట్ల ధర లభించింది. దానిని తలదన్నేలా ఇప్పుడు ఎకరాకు ఏకంగా రూ.237 కోట్ల ధర రావడం గమనార్హం.

suman

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

2 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

2 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

3 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

4 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

4 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

4 hours ago