అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నర్సీపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన మహానాడు వేదికగా ఆయనను సమర్ధించే కార్యకర్తలు, నాయకులు విజయ్ కు రాజ్యసభ టికెట్ ఇవ్వాలని తీర్మానం చేశారు. అయితే, ఈ సీటు వస్తుందా.. రాదా.. అనే విషయాన్ని పక్కన పెడితే అసలు విజయ్కు రాజ్యసభ సీటు ఇవ్వడం ఎంతవరకు మంచిది? ఎంతవరకు భవిష్యత్తు ఉంటుంది? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. ప్రధానంగా పెద్దల సభ అనగానే వయసు మళ్ళిన వాళ్ళు.. లేదా బాగా అనుభవజ్ఞుడైన వారికి మాత్రమే ఒకప్పుడు టికెట్లు ఇచ్చేవారు.
తద్వారా లోక్సభ తీసుకునే నిర్ణయాలు రాజ్యసభలో చర్చించి అనంతరం వాటిని ఆమోదించే పరిస్థితి ఉండేది. అయితే రాను రాను పెద్దల సభ కూడా రాజకీయ పునరావసర కేంద్రంగా మారింది అనేది ప్రధాన విమర్శ. ఈ క్రమంలోనే అనేకమంది రాజ్యసభకు వస్తున్నారు. ఇటీవల రెండు దశాబ్దాలుగా రాజ్యసభకు వెళుతున్న వారిని గమనిస్తే వయసుతో నిమిత్తం లేకుండా అనేకమంది రాజ్యసభలో కూర్చునే పరిస్థితి ఉంది. కానీ ఇది వ్యక్తిగత రాజకీయాలను గమనించినప్పుడు సదరు నేతలకు పెద్దగా కలిసి రావడం లేదు.
దీనికి ప్రధాన కారణం రాజ్యసభకు వెళ్ళిన వారిపై ప్రజల్లో పెద్దగా ఇమేజ్ లేకపోవడంతో పాటు స్థానిక సమస్యలపై వారు పోరాటం చేసే పరిస్థితి కూడా ఉండదనే ఆలోచన బలంగా నాటుకుపోయింది. ఈ నేపథ్యంలో విజయ్ లాంటి ఫ్యూచర్ ఉన్న యువ నాయకులకు రాజ్యసభ అనేది అంత సరైన వేదిక కాదన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం విజయ్ వయసు 40లలోపే ఉంది. ఆయనకు మంచి భవిష్యత్తు కూడా ఉంది. మరొక మూడు సంవత్సరాలు ఆగితే అదే నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుంది.
తద్వారా ప్రజలకు మరింత ఎక్కువగా సేవ చేసేందుకు కూడా అవకాశం లభిస్తుంది. దీనికి తోడు ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు కార్యకర్తలతో ఆయనకు ఉన్న అనుబంధం మరింత పెంచుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు పదవి కావాలి అన్న ఏకైక లక్ష్యమో.. లేకపోతే తాను కూడా ఏదో ఒక పదవిని దక్కించుకోవాలన్న ఆలోచనతో ఉండటమో తెలియదు కానీ మొత్తానికి రాజ్యసభకు వెళ్లాలన్న ఆలోచనలో అయితే విజయ్ ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ లాంటి యువ నాయకుడు అసెంబ్లీకి వెళ్లడం ద్వారా స్థానిక సమస్యలను ప్రస్తావించడంతోపాటు వ్యక్తిగతంగా ఇమేజ్ను పెంచుకునేందుకు కూడా అవకాశం ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
కాబట్టి విజయ్ లాంటి యువకులకు ముఖ్యంగా భవిష్యత్తు నాయకులుగా పేరు తెచ్చుకున్న వారికి స్థానిక అసెంబ్లీ లేదా లోక్సభకు పోటీ చేయడమే సరైన మార్గం. ఈ నేపథ్యంలో విజయ్ కు రాజ్యసభ అంతగా పేరు తీసుకురాకపోవచ్చు అన్న చర్చ నడుస్తోంది. దూకుడు స్వభావంతో పాటు వారసత్వంగా వచ్చిన రాజకీయాలను కాపాడుకునేందుకు రాజ్యసభకు వెళితే ఒక గేటు మూసుకుపోతుందన్న చర్చ కూడా నడుస్తోంది. కాబట్టి విజయ్ మరొక మూడు సంవత్సరాలు ఆగి నర్సీపట్నం నియోజకవర్గ నుంచి పోటీ చేయడమే ఉత్తమమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
భాగ్య నగరిగా పిలుచుకుంటున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక తప్పదు. రెండు,…
టాలీవుడ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇక్కడున్న టాప్ స్టార్లు చాలామందితో ఒకటికి మించి సినిమాలు చేసిందామె. తమిళంలోనూ…
2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని…
కొత్త సినిమాలకు ప్రమోషన్ తగ్గినా కష్టమే. ప్రచారం మరీ ఎక్కువైనా ప్రమాదమే. వీలైనంత ఎక్కువగా ప్రమోషన్లు చేసి జనం దృష్టి…
టిడిపిలో భారీ జోష్ కనిపించింది. ముఖ్యంగా 33% సీట్లను, పదవులను మహిళలకు కేటాయిస్తామని పార్టీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు…
ఢిల్లీలో జరిగిన పెద్ది ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ ఒక ఆసక్తికరమైన విషయం పంచుకున్నాడు. గతంలో ఒకసారి ప్రధాన…