టాలీవుడ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇక్కడున్న టాప్ స్టార్లు చాలామందితో ఒకటికి మించి సినిమాలు చేసిందామె. తమిళంలోనూ విజయ్, అజిత్, సూర్య లాంటి టాప్ స్టార్లతో నటించింది. మరోవైపు హిందీలోనూ కొన్ని పెద్ద సినిమాల్లో నటించింది. ఐతే ఒక కథానాయిక కెరీర్లో ఎంత పీక్స్ చూసినా.. వయసు పెరిగి, గ్లామర్ తగ్గుముఖం పట్టాక అవకాశాలు తగ్గడం మామూలే.
కాజల్ విషయంలోనూ అదే జరిగింది. పెద్ద హీరోల సరసన అవకాశాలు తగ్గుతున్న టైంలోనే ఆమె పెళ్లి కూడా చేసుకోవడంతో కెరీర్ మరింత డౌన్ అయింది. అదే సమయంలో సీత, సత్యభామ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు ఆమె అడుగులు వేసింది. కెరీర్లో కొంచెం గ్యాప్ వచ్చాక ‘భగవంత్ కేసరి’ సినిమాలో నందమూరి బాలకృష్ణతో జట్టు కట్టినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఆ సినిమా బాగా ఆడినా.. కాజల్కు మంచి పేరేమీ రాలేదు. దీంతో ఇంకో పెద్ద సినిమా అవకాశం రాలేదు.
ప్రస్తుతం హిందీలో ఒక సినిమా చేస్తున్న చందమామకు సౌత్లో మాత్రం అవకాశాలు లేనట్లే కనిపిస్తోంది. ఇలాంటి టైంలో కాజల్ ఫిజిక్ మీద బాగా శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. కొన్ని నెలల గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలో తన లేటెస్ట్ లుక్కు సంబంధించిన ఫొటోలు బాగా తిరుగుతున్నాయి. ఇందులో కాజల్ చాలా సన్నబడి కనిపిస్తోంది. తన ముఖంలో కూడా కొంచెం మార్పు కనిపిస్తోంది.
గ్లామర్ మీద బాగా శ్రద్ధ పెట్టి శరీరాకృతిని కాజల్ మార్చుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతే కాక పెళ్లి తర్వాత చేసిన మోస్ట్ గ్లామరస్ ఫొటో షూట్లలో ఇదొకటని చెప్పొచ్చు. మళ్లీ తాను గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అని ఆమె సంకేతాలు పంపుతున్నట్లు కనిపిస్తోంది. కానీ ఒకసారి పక్కన పెట్టిన కథానాయికలను మళ్లీ పెద్ద సినిమాల్లోకి తీసుకోవడం కష్టమే. మరి కాజల్ ఆశలు ఫలిస్తాయా.. ఆమెకు తెలుగు, తమిళ చిత్రాల్లో అవకాశాలేమైనా వస్తాయా అన్నది చూడాలి.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…