దేశంలో మరోమారు ఇంధన ధరలను భారీగా పెంచుతూ చమురు సంస్థలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పై దాదాపుగా రూ.3 మేర పెంచుతూ చమురు సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయం సోమవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చేసింది. అమెరికా, ఇరాన్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ నెలలోనే మూడు దఫాలుగా ఇంధన ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆదివారం రాత్రి కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు…నాలుగో సారి కూడా ఇంధన ధరలను పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. అనుకున్నదే తడవుగా పెట్రోల్ ధరను లీటర్ కు రూ.2.61 మేర పెంచిన కంపెనీలు.. డీజిల్ థరలను లీటర్ కు రూ.2.71 మేర పెంచాయి. ఫలితంగా నాలుగో సారి ఇంధన థరలు భారీగానే పెరిగినట్టు అయ్యింది.
ఒక్క నెలలోనే వరుసగా నాలుగు పర్యాయాలు ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. నాలుగో సారి సోమవారం ఉదయం నుంచి పెరిగిన థరల తర్వాత ఏపీలో పెట్రోల్ ధర రూ.117.19ను తాకగా… తెలంగాణలో ఈ థర రూ.115.58కి చేరుకుంది. వరుసబెట్టి చమురు కంపెనీలు ఇంధన థరలను పెంచుతున్న కారణంగా ఈ నెలలోనే పెట్రోల్ ధర లీటరుకు ఏకంగా రూ.6 నుంచి 7 దాకా పెరగగా… డీజిల్ ధర కూడా అంతే స్థాయిలో పెరిగిందని చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే… పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా ఆ విపత్కర పరిస్థితులను తట్టుకుని నిలబడే దిశగా పొదుపు చర్యలను కూడా ఆయన సూచించారు. ఈ క్రమంలో ఇంధన ధరల పెరుగుదల ఇదేమీ చివరిది కాదని, సమీప భవిష్యత్తులోనే మరికొన్ని సార్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి.
This post was last modified on May 25, 2026 7:48 am
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కాకినాడ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయనకు తీవ్ర…
తమిళనాడు సీఎం విజయ్, సినీ నటి త్రిషల మధ్య రిలేషన్ షిప్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి…
బాలీవుడ్ ఖాన్ల ప్రభంజనంలో తనకంటూ ఒక ఉనికిని దక్కించుకున్న హీరో ఇమ్రాన్ హష్మీ. ఒకప్పుడు మంచి హిట్లతో ముద్దుల వీరుడిగా…
గుంటూరులోని తూర్పు, పడమర నియోజకవర్గాల్లో వైసీపీ తన ప్రభావం, ప్రాభవం కూడా కోల్పోయింది. రెండున్నరేళ్ల కాలంలో పార్టీ ఘోరంగా దెబ్బతిందన్న…
ఏపీలోని నిర్దేశిత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోన్న…
'టాక్సిక్' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న కన్నడ స్టార్ యశ్ వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఇక రీసెంట్ ఒక…