ఏపీలోని నిర్దేశిత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభించిన ఈ పథకం వల్ల కోట్లాది మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు, గృహిణులు…ఇలా ఏడాది కాలంగా అన్ని వర్గాల మహిళల అభిమానాన్ని ఈ పథకం చూరగొంది. అంతేకాదు మహిళలను ఎన్డీఏకు చేరువ చేస్తున్న ఫ్రీ బస్సు పథకం పట్ల ప్రభుత్వం కూడా సంతృప్తిగా ఉంది.
అయితే, ఈ పథకం ప్రారంభమైన కొత్తలో ఆటో డ్రైవర్ల నుంచి కాస్త వ్యతిరేకత వ్యక్తమైంది. తమ రోజువారీ సంపాదనను ఈ పథకం గణనీయంగా ప్రభావితం చేసిందని వారు వాపోయారు. అయితే, అర్హత గల ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15 వేల రూపాయల ఆర్థిక సాయం వల్ల వారిలో వ్యతిరేకత తగ్గింది.
ఉచిత బస్సు ప్రయాణం వల్ల భారీ సంఖ్యలో మహిళలకు చాలా ప్రయోజనం కలిగింది. ఎన్డీఏకు మహిళా ఓటర్లతో సానుకూల సంబంధం ఏర్పరచడంలో ఈ పథకం ఎంతగానో సహాయపడింది. అయితే, నిత్యం బస్సుల్లో ప్రయాణించే కొందరు పురుషులు ఈ పథకం వల్ల కాస్త ఇబ్బంది పడడం మినహా వారి నుంచి కూడా పెద్ద వ్యతిరేకత రాలేదు.
ఈ పథకంతో పాటు మరిన్ని పథకాల అమలు వల్ల మహిళల్లో ఎన్డీఏ పట్ల ఆదరణ పెరుగుతోంది. భవిష్యత్ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఈ పథకం గణనీయంగా ప్రభావితం చేయగలదు. ఓవరాల్ గా ఏడాదిగా అమలవుతున్న ఈ పథకం సూపర్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇక, ఈ పథకానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రచారం చేసినప్పటికీ అది వర్కవుట్ కాలేదు.
This post was last modified on August 15, 2026 4:05 pm
మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తన మాతృభాషలో గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. ఎన్నో సూపర్…
ఉత్తరప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత రామజన్మభూమి అయోధ్యలో ఉన్న బాలరామయ్య ఆలయానికి రాజకీయ గ్రహణం వీడినట్టేనా? ఇక, ఆలయానికి రాజకీయ ప్రభావం,…
సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…
టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…
ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…