Political News

గవర్నర్ విందుకు హాజరు కాలేని పవన్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కాకినాడ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో వెంటనే హైదరాబాద్ కు పయనమయ్యారు. 

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన ఉత్సాహంగా కనిపించారు. అనంతరం జరిగిన సభలో యువతను ఉద్దేశించి అమూల్యమైన సందేశం ఇచ్చారు. వేడుకలు ముగిసిన కొద్ది సేపటికే తీవ్రమైన జ్వరం వచ్చింది.

వెంటనే రాజమండ్రిలో వైద్యులను సంప్రదించారు. వైద్య పరీక్షల అనంతరం వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ కు పయనం అయ్యారు. అమరావతిలో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి హాజరుకాలేక పోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 

నిజానికి పవన్ కళ్యాణ్ భుజం నొప్పితోనే స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. తీవ్రమైన నొప్పితోనే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల తర్వాత నొప్పి తీవ్రం కావడమే కాకుండా తీవ్ర జ్వరం వచ్చింది. ఇటీవలే ఆయన కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్యులు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చినప్పటికి విధులకు హాజరవుతున్నారు. దాంతో నొప్పి తిరగబట్టినట్లుందని సన్నిహితులు చెబుతున్నారు. 

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తీవ్రమైన జ్వరం వచ్చిందని తెలియగానే అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. పవన్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళిపోయినట్లు తెలిసి  ఏమైందని వాకబు చేస్తున్నారు. కొందరు అభిమానులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.

This post was last modified on August 15, 2026 5:19 pm

Share

Recent Posts

విజయ్, త్రిషల గోల మళ్లీ మొదలు!

తమిళనాడు సీఎం విజయ్, సినీ నటి త్రిషల మధ్య రిలేషన్ షిప్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి…

52 minutes ago

ఓజి విలన్ రొట్టె విరిగి నేతిలో పడింది

బాలీవుడ్ ఖాన్ల ప్రభంజనంలో తనకంటూ ఒక ఉనికిని దక్కించుకున్న హీరో ఇమ్రాన్ హష్మీ. ఒకప్పుడు మంచి హిట్లతో ముద్దుల వీరుడిగా…

1 hour ago

గుంటూరుపై వైసీపీ పూర్తి పట్టు కోల్పోయినట్టేనా?

గుంటూరులోని తూర్పు, ప‌డ‌మ‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ త‌న ప్ర‌భావం, ప్రాభవం కూడా కోల్పోయింది. రెండున్న‌రేళ్ల కాలంలో పార్టీ ఘోరంగా దెబ్బ‌తింద‌న్న…

1 hour ago

‘ఫ్రీ బస్సు’లో ఎన్డీఏకు చేరువవుతున్న మహిళలు

ఏపీలోని నిర్దేశిత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోన్న…

1 hour ago

అభిమాని ఆఖరిచూపుకు స్టార్ హీరో ఎందుకు వెళ్లలేదు

'టాక్సిక్' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న కన్నడ స్టార్ యశ్ వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఇక రీసెంట్ ఒక…

4 hours ago

కెన్యా విషయంలో జాగ్రత్తలు అవసరం

కొరియన్ కనకరాజు సీక్వెల్ కి ప్లానింగ్ జరుగుతోంది. కెన్యా కనకరాజు పేరుతో స్క్రిప్ట్ డిస్కషన్లు మొదలయ్యాయని సమాచారం. అంటే కొరియా…

4 hours ago