సూర్యుడు తూర్పున ఉదయించును.. అనే మాట తెలిసిందే. అయితే.. తాజాగా అదే సూర్యుడు.. ఏపీలోనితూర్పు గోదావరి జిల్లాను తాజాగా మంటెత్తించాడు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఎండ మంటలు రేపింది. భానుడి భగ భగలతో తూర్పుగోదావరి వాసులు అల్లాడిపోయారు. ఏ మండలంలో చూసినా.. ఉష్ణోగ్రతలు.. 48 డిగ్రీలకు పైమాటే అన్నట్టుగా నమోదయ్యాయి. దీంతో ఆదివారం ఇంటి నుంచి ప్రజలు బయటకు కాలు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో కూడా.. ఎండ తీవ్రత 47 డిగ్రీలకు పైగానే నమోదైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాటి పరిస్థితిపై అంచనా వేసి.. ప్రజలకు కొన్ని సూచనలు చేసింది.
ఆదివారం పరిస్థితి ఇదీ..
తూర్పు గోదావరి: చిట్యాలలో 48.3, గోపాలపురంలో 48.3, ఉండ్రాజవరంలో 48.1 డిగ్రీలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఉడుకెత్తిపోయారు. ఇక, పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పరిస్థితి ఇలానే సాగింది. ఈ జిల్లాలోని అత్తిలి, ఇరగవరం, తణుకు మండలాల్లో 48.1 డిగ్రీల చొప్పున భానుడు ప్రతాపం చూపించాడు. ఇక, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలోనూ 48.1 డిగ్రీలతో ఎండ మండించింది. దీంతో ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టలేక పోయారు.
44-47 మధ్యే..
దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు తక్కువగా ఎక్కడా నమోదు కాకపోవడం గమనార్హం. వాస్తవానికి 40 డిగ్రీలు అంటేనే అదిరిపోతారు. అలాంటి రాష్ట్రం మొత్తంగా 44 డిగ్రీల నుంచి 48 డిగ్రీలకు పైగానే భానుడు విజృంభించడం గమనార్హం. విశాఖ నుంచి విజయవాడ వరకు, కర్నూలు నుంచి గుంటూరు వరకు అన్ని ప్రధాన జాతీయ రహదారులు కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇంత ఎండలో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భావించిన డ్రైవర్లు.. రహదారులకు పక్కగా వాహనాలను నిలిపివేశారు. ఇక సాధారణ జనజీవనం కూడా పెద్దగా కనిపించలేదు.
ఎక్కడెక్కడ ఎన్నెన్ని డిగ్రీలు?
This post was last modified on May 24, 2026 8:48 pm
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…