దేశంలో ఏపీ సీఎం చంద్రబాబు గురించి తెలియని వారు లేరు. విజన్ ఉన్న ముఖ్యమంత్రిగానే కాకుండా.. 75 ఏళ్ల వయసులో కూడా ఆయన చాలా యాక్టివ్గా 25 ఏళ్ల నవయుకుడిలా ఛెంగు ఛెంగున కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దాదాపు రెండు నుంచి 3 గంటలపాటు నిలబడే కార్యక్రమాల్లో ప్రసంగాలు కూడా దంచి కొడుతున్నారు. దీంతో చంద్రబాబు స్టామినా గురించి.. తరచుగా జాతీయ మీడియాలోనూ చర్చ నడుస్తోంది. ఇక, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితాలోనూ చంద్రబాబు ముందున్నారు.
ఆయన దూకుడు అంతా ఇంతాకాదు. భవిష్యత్తును ముందు గానే అంచనా వేసుకుని దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే గతంలోనే ప్రధాని సహా.. అనేక మంది జాతీయ నాయకులు చంద్రబాబు సేవలను వినియోగించుకున్నారు. 2016లో దేశంలో పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోనే మోడీ కమిటీని వేశారు. దేశంలో తర్వాత తీసుకురా వాల్సిన మార్పులపై ఈ కమిటీ అధ్యయనం చేసింది.
ఈ కమిటీకి చంద్రబాబు నేతృత్వం వహించారు. ప్రస్తుతం డిజిటల్ ట్రాన్సాక్షాన్స్.. సహా.. యూపీఐ సేవలను మరింత విస్తరించేందుకు నాడు ఈ కమిటీనే సలహాలు సూచనలు ఇచ్చిందని.. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి సైతం వివరించారు. కాగా.. ఇప్పుడు మరోసారి చంద్రబాబుకు మంచి అవకాశం చిక్కింది. దేశంలోని అన్ని పార్టీలను.. ముఖ్యంగా.. ఎన్డీయేతర పార్టీలను ఐక్యంగా ముందుకు నడిపించేందుకు.. ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.
ప్రధానంగా.. పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కాంగ్రెస్ సహా.. ఇతర ఎన్డీయేతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. గత నెలలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు వీగిపోయింది. అయితే.. జూన్- జూలై మధ్య కాలంలో జరిగే సభల్లో.. ఈ బిల్లును ఆమోదించాలని కేంద్రం నిర్ణయించింది.
అయితే .. ప్రత్యర్థి పార్టీలను ఒప్పించడం.. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం.. అనే ప్రధాన క్రతువును చంద్రబాబుకే అప్పగించాలని ప్రధాని నిర్ణయించినట్టు తెలిసింది. ఇదే జరిగితే.. చంద్రబాబు నేతృత్వంలో పార్టీలు ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రధాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on May 24, 2026 9:48 pm
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…