సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు? భారత టీ20 జట్టు విషయంలో చాలా రోజులుగా అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలివి. 2024లో టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ గెలవగానే రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అయిపోవడంతో సూర్యకుమార్ పగ్గాలందుకున్నాడు. అప్పట్నుంచి భారత్ ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు.
కానీ సూర్యకుమార్ మాత్రం ఫామ్ కోల్పోయాడు. కెప్టెన్గా విజయాలందుకుంటున్నప్పటికీ.. వ్యక్తిగత ప్రదర్శన దారుణంగా తయారవడంతో అతడిపై విమర్శలు తప్పలేదు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్తో పాటు దేశవాళీ క్రికెట్లోనూ అదరగొడుతున్నా.. అతడికి భారత టీ20 జట్టులో చోటే లేదు.
ఐపీఎల్లో కెప్టెన్గా 2024లో కోల్కతా నైట్రైడర్స్కు ట్రోఫీ అందించాడు. తర్వాతి ఏడాది అందరూ వేస్ట్ అని తేల్చేసిన పంజాబ్ కింగ్స్ లాంటి జట్టును ఫైనల్ చేర్చాడు. ఈ ఏడాది కూడా పంజాబ్ అతడి సారథ్యంలో రాణిస్తోంది.
ఇంకెప్పుడు శ్రేయస్ను భారత టీ20 జట్టులోకి తీసుకుంటారు.. ఎప్పుడు కెప్టెన్ను చేస్తారు అని అభిమానులు గగ్గోలు పెడుతుండగా.. ఎట్టకేలకు సెలక్టర్లలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది.
త్వరలోనే అతణ్ని జట్టులోకి తీసుకోవడమే కాదు.. కెప్టెన్ను కూడా చేయబోతున్నారట. వచ్చే నెల చివర్లో టీమ్ ఇండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ రెండు టీ20 మ్యాచ్లు ఆడాక.. ఇంగ్లాండ్కు వెళ్లి అక్కడ ఐదు టీ20లు ఆడుతుంది. ఐర్లాండ్ పర్యటన నుంచే శ్రేయస్ టీ20 కెప్టెన్ అవుతాడట.
ఒకేసారి జట్టులో చోటివ్వడం, కెప్టెన్ను చేయడం జరుగుతాయట. మరోవైపు సూర్యకుమార్ అంతర్జాతీయ కెరీర్ దాదాపుగా ముగిసినట్లే అంటున్నారు. అతను అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు.. ఐపీఎల్లోనూ తేలిపోతున్నాడు. ముంబయి తరఫున వరుసగా విఫలమవుతున్నాడు. అతడికి వయసు పెరిగింది. ఫామ్ పోయింది. దీంతో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్లో జట్టును విజేతగా నిలిపినప్పటికీ సూర్యపై వేటు తప్పదని తెలుస్తోంది.
This post was last modified on May 9, 2026 8:06 am
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…