మేం ఫేమస్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ కుర్రాడు.. చిన్న వయసులో హీరోగా అరంగేట్రం చేస్తూ, ఆ చిత్రానికి తనే దర్శకత్వం కూడా చేయడం విశేషం. సోషల్ మీడియా ద్వారా ఆ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసి ఓపెనింగ్స్ తెచ్చుకుని ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు సుమంత్. ఓవరాల్గా ఆ సినిమా ఒక మోస్తరు ఫలితాన్నందుకుంది.
ఇప్పుడు సుమంత్ రెండో చిత్రం గోదారి గట్టుపైన కూడా అదే తరహాలో బజ్ క్రియేట్ చేసింది. ఈ వారం సినిమాల్లో జనాలను థియేటర్లకు తీసుకొచ్చిన చిత్రమిదే. దీనికి రివ్యూలు, టాక్ యావరేజ్ అనేలాగే ఉన్నాయి. మరి సినిమా అంతిమంగా ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి. సుమంత్ అండ్ టీమ్ అయితే సినిమాను గట్టిగానే ప్రమోట్ చేస్తోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన సీనియర్ నటుడు జగపతిబాబు సైతం ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు.
ఆయనతో కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూలో సుమంత్ ప్రభాస్ తన పేరు వెనుక ఉన్న స్టోరీని బయటపెట్టాడు. సుమంత్ ప్రభాస్ అని ఇలా రెండు పేర్లు కలిపి పెట్టుకోవడం ఏంటి.. దీని వెనుక కథేంటి అని జగపతిబాబు అడగ్గా.. సుమంత్ సమాధానం చెప్పాడు.
తాను చిన్నతనంలో బుజ్జిగాడు సినిమా చూసి ప్రభాస్ ఫ్యాన్ అయ్యానని సుమంత్ తెలిపాడు. ఎనిమిదో క్లాసులో ఉండగా ఫేస్ బుక్ ఐడీ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తే.. సుమంత్ రెడ్డి పేరుతో ఐడీ క్రియేట్ కాలేదని అన్నాడు.
దీంతో తన పేరుకు తన ఫేవరెట్ హీరో అయిన ప్రభాస్ నేమ్ కూడా జోడించి, ఇంకేవో నంబర్లు కూడా యాడ్ చేస్తే అప్పుడు ఓకే అయిందని.. దీంతో తన పేరులోనూ సుమంత్ పక్కన ప్రభాస్ అని జోడించానని.. అలాగే పాపులర్ అయిన తాను ఇప్పుడు స్క్రీన్ నేమ్గా కూడా దాన్నే ఉంచేశానని తెలిపాడు. ఎలాగూ ఇండస్ట్రీలో సుమంత్ పేరుతో ఒక సీనియర్ హీరో ఉన్న నేపథ్యంలో సుమంత్ ప్రభాస్ అని పెట్టుకోవడం ఈ కుర్రాడికి మంచిదే అయింది.
This post was last modified on May 9, 2026 8:49 am
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…
ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…
సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు? భారత టీ20 జట్టు విషయంలో చాలా రోజులుగా అభిమానులను…
తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…