Trends

గుండు కొట్టుకుంటే విజయ్ ప్రభుత్వం 15 వేలు ఇస్తుందని…

ఇప్పటి వరకు పుణ్యం వస్తుందని గుండు చేయించుకున్న వాళ్ళను చూసాం కానీ ఇప్పుడు పుణ్యం  15 వేల రూపాయల గిఫ్ట్ వస్తుందని ఆశ పడి గుండు చేయించుకున్న వాళ్ళను ఇప్పుడే చూస్తున్నాం. ఇది అత్యాశల కాలం. 100 రూపాయలు పెట్టుబడి పెడితే  10 వేల రూపాయలు వస్తాయని చెబితే విద్యావంతులు సైతం ఆశ పడి లక్షల రూపాయలు చెల్లించి చేతులు కాల్చుకుంటున్న రోజులు. ఇదే అత్యాశను అడ్డం పెట్టుకొని ఒక ఆకతాయి పలువురు మహిళలకు గుండు కొట్టించుకునేలా చేశాడు…ఇంతకూ ఏమి జరిగిందంటే…

గుండు కొట్టించుకుంటే నగదు బహుమతి….

తమిళనాడు లోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో తహసీల్దార్ కార్యాలయం నుంచి కొందరు మహిళలకు మూడు రోజుల క్రితం ఒక అపరిచితుడి నుంచి ఫోన్ వచ్చింది. ప్రస్తుతం కరోనా లాంటి మరో కొత్త వ్యాధి సోకుతుందని. ఈ వ్యాధి సోకకుండా విదేశాల్లో చాలా మంది మహిళలు గుండు చేయించుకుంటున్నారని చెప్పాడు. తమిళనాడులో  ఈ వ్యాధి సోకాకుండా గుండు చేయించుకున్న మహిళలకు విజయ్ ప్రభుత్వం మహిళలకు రూ. 15 వేలు, కాలేజీ విద్యార్థినులకైతే రూ. 45 వేలు, ఒక ల్యాప్ టాప్, పురుషులకైతే రూ. 6 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు నమ్మించాడు.

పరిమిత సంఖ్యలో టోకెన్లు ఉన్నాయని, వెంటనే పుదుకొత్తంబాడి మహిళలు గుండు చేయించుకొని కార్యాలయం వద్దకు వచ్చి డబ్బులు తీసుకొని పోవాలని నమ్మించాడు. అంతే… ఈ ఫోన్ కాల్ ను గుడ్డిగా నమ్మిన చిత్ర, రమయి, కావేరి అనే మహిళలు దగ్గరలో వున్న సెలూన్ కు వెళ్లి గుండు చేయించుకున్నారు. తర్వాత ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని రావడంతో మోసపోయామని గ్రహించారు.  ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి రాష్ట్రం మొత్తం వ్యాపించింది. 

పుకార్లు నమ్మొద్దు…

గుండు స్కీంతో ఉలిక్కిపడిన విజయ్ ప్రభుత్వం వెంటనే అధికారులను అప్రమత్తం చేసింది. సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని, అపరిచిత వ్యక్తులు నేరుగా ఫోన్లు చేస్తే నమ్మి మోసపోవద్దని ప్రకటించింది. ఇలాంటి ఫోన్లు వచ్చిన వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచించింది.

This post was last modified on July 29, 2026 2:46 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

1 hour ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago