ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో ‘గెట్ టు గెదర్’ పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది. పదేళ్ల క్రితం విడిపోయిన స్కూల్ బ్యాచ్ల నుంచి ముప్ఫై, నలభై ఏళ్ల కిందటి పాత విద్యార్థుల వరకు అంతా సోషల్ మీడియా ద్వారా ఒక్కటవుతున్నారు. పాత రోజులను గుర్తుచేసుకోవడం, ఒకరికొకరు సాయం చేసుకోవడం వరకు ఈ వేడుకలు బాగానే ఉంటున్నాయి. కానీ, ఈ కలయికల చాటున కొన్ని అనవసరమైన గొడవలు, దారుణమైన నేరాలు కూడా బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యంగా ఇలాంటి పార్టీల్లో పాత పరిచయాలు మళ్ళీ మొదలై, అవి వివాహేతర సంబంధాలకు దారితీస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. పెళ్లై, పిల్లలు ఉన్న వారు కూడా పాత ప్రేమలను వెలికితీసి తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ఇలాంటి బంధాల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి, అవి చివరికి హత్యలు లేదా ఆత్మహత్యల వరకు వెళ్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఒక మహిళ కూడా పాత మిత్రుడి పరిచయంతో తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని కన్న పిల్లలనే చంపేసిన ఉదంతం అందరినీ భయపెట్టింది.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఇటీవల ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా ఈ గెట్ టు గెదర్ పార్టీల తాలూకు దుష్పరిణామమే అని తెలుస్తోంది. తన భార్య పాత స్నేహితుడితో సన్నిహితంగా ఉండటం, ఆ విషయం భర్తకు తెలియడంతో మనస్తాపం చెంది అతను ప్రాణాలు తీసుకున్నాడు. అయితే ఇవి బయటకు వచ్చిన కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి కలయికల వల్ల మనస్పర్థలు వచ్చి, బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్న వారు, లోలోపలే సర్దుకుపోతున్న భార్యాభర్తలు కూడా ఎందరో ఉన్నారు.
పాత స్నేహితుల కలయికలో హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల ఒక్క వ్యక్తి ప్రాణమే కాదు, మొత్తం కుటుంబాలే చిన్నాభిన్నం అవుతున్నాయి. కేవలం పార్టీల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని అనలేం కానీ, ఆ పేరుతో పాత ప్రేమలను గుర్తుచేసుకొని కొందరు తప్పటడుగులు వేస్తున్నారు. మారుతున్న జీవనశైలి, సోషల్ మీడియాలో నిరంతరం టచ్లో ఉండటం వల్ల వ్యక్తులు తమ బాధ్యతలను మర్చిపోతున్నారు. తాత్కాలిక సంతోషం కోసం తీసుకునే నిర్ణయాలు జైలుపాలు చేయడం లేదా ప్రాణాలు తీయడం వరకు వెళ్తున్నాయి.
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…