ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో ‘గెట్ టు గెదర్’ పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది. పదేళ్ల క్రితం విడిపోయిన స్కూల్ బ్యాచ్ల నుంచి ముప్ఫై, నలభై ఏళ్ల కిందటి పాత విద్యార్థుల వరకు అంతా సోషల్ మీడియా ద్వారా ఒక్కటవుతున్నారు. పాత రోజులను గుర్తుచేసుకోవడం, ఒకరికొకరు సాయం చేసుకోవడం వరకు ఈ వేడుకలు బాగానే ఉంటున్నాయి. కానీ, ఈ కలయికల చాటున కొన్ని అనవసరమైన గొడవలు, దారుణమైన నేరాలు కూడా బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యంగా ఇలాంటి పార్టీల్లో పాత పరిచయాలు మళ్ళీ మొదలై, అవి వివాహేతర సంబంధాలకు దారితీస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. పెళ్లై, పిల్లలు ఉన్న వారు కూడా పాత ప్రేమలను వెలికితీసి తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ఇలాంటి బంధాల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి, అవి చివరికి హత్యలు లేదా ఆత్మహత్యల వరకు వెళ్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఒక మహిళ కూడా పాత మిత్రుడి పరిచయంతో తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని కన్న పిల్లలనే చంపేసిన ఉదంతం అందరినీ భయపెట్టింది.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఇటీవల ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా ఈ గెట్ టు గెదర్ పార్టీల తాలూకు దుష్పరిణామమే అని తెలుస్తోంది. తన భార్య పాత స్నేహితుడితో సన్నిహితంగా ఉండటం, ఆ విషయం భర్తకు తెలియడంతో మనస్తాపం చెంది అతను ప్రాణాలు తీసుకున్నాడు. అయితే ఇవి బయటకు వచ్చిన కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి కలయికల వల్ల మనస్పర్థలు వచ్చి, బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్న వారు, లోలోపలే సర్దుకుపోతున్న భార్యాభర్తలు కూడా ఎందరో ఉన్నారు.
పాత స్నేహితుల కలయికలో హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల ఒక్క వ్యక్తి ప్రాణమే కాదు, మొత్తం కుటుంబాలే చిన్నాభిన్నం అవుతున్నాయి. కేవలం పార్టీల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని అనలేం కానీ, ఆ పేరుతో పాత ప్రేమలను గుర్తుచేసుకొని కొందరు తప్పటడుగులు వేస్తున్నారు. మారుతున్న జీవనశైలి, సోషల్ మీడియాలో నిరంతరం టచ్లో ఉండటం వల్ల వ్యక్తులు తమ బాధ్యతలను మర్చిపోతున్నారు. తాత్కాలిక సంతోషం కోసం తీసుకునే నిర్ణయాలు జైలుపాలు చేయడం లేదా ప్రాణాలు తీయడం వరకు వెళ్తున్నాయి.
This post was last modified on May 5, 2026 4:18 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖను మంత్రివర్గం నుంచి సీఎం…
2019లో పాకిస్థాన్తో జరిగిన వైమానిక పోరుతో అభినందన్ వర్ధమాన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఇప్పుడు అతను కొత్త కెరీర్ మొదలుపెట్టారు.…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
పదకొండు నెలల గ్యాప్ తర్వాత ప్రభాస్ దర్శనం చేయించే ఫౌజీ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. స్పిరిట్…
రాష్ట్రంలో క్రెడిట్ వార్ ముదిరి పాకాన పడింది. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఈ క్రెడిట్ మాదంటే కాదు మాదని…
నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సుజిత్ వదిలిన ఓజి యూనివర్స్ వీడియో మీద మిశ్రమ స్పందన కనిపిస్తోంది.…