టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ తన తర్వాతి ప్రాజెక్ట్ ‘పెద్ది’తో మరోసారి సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి రకరకాల అంచనాలు ఉన్నాయి. గ్రామీణ నేపథ్యం ఉన్న కథలను పాన్ ఇండియా స్థాయిలో మెప్పించడం అనేది ఒక పెద్ద టాస్క్. కానీ ఈసారి చరణ్ టీమ్ పక్కా ప్లానింగ్తో రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది.
జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఉత్తరాది మార్కెట్లో ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది. చరణ్కు హిందీ బెల్ట్లో ఉన్న క్రేజ్ని వాడుకుంటూ, అక్కడ ఎటువంటి పెద్ద సినిమాలు లేకుండా క్లియర్ మార్గాన్ని మేకర్స్ సెట్ చేసుకున్నారు. నార్త్ ఇండియాలోనే కాకుండా దక్షిణాదిలోని ఇతర భాషల్లో కూడా ప్రస్తుతం ‘పెద్ది’కి గట్టి పోటీ ఇచ్చే సినిమాలు లేకపోవడం ఈ చిత్రానికి అతిపెద్ద ప్లస్ పాయింట్. కేవలం బాగుందనే టాక్ వస్తే చాలు, వసూళ్ల వేట ఆగడం కష్టమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్ల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా అని, అందులోనూ పల్లెటూరి ఇంటెన్సిటీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కేవలం ఒక యాక్షన్ సినిమా లాగా కాకుండా, ఎమోషన్స్ కూడా పక్కాగా కుదిరితే చరణ్ కెరీర్లో ఇది మరో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అవుతుంది. ఇప్పటికే రెహమాన్ అందించిన మ్యూజిక్ ఒక రేంజ్లో జనాల్లోకి వెళ్లిపోయింది.
అయితే పాన్ ఇండియా సక్సెస్ అనేది కేవలం విడుదల చేసే భాషల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. కంటెంట్ ఎంత బలంగా ఉందనేది ఇక్కడ ముఖ్యం. ‘పెద్ది’కి ఉన్న ఏకైక అడ్వాంటేజ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఖాళీగా ఉన్న విండో. జూన్ మొదటి వారంలో ఆడియన్స్ కూడా థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తారు కాబట్టి, ఓపెనింగ్స్ పరంగా ఇబ్బంది ఉండకపోవచ్చు.
కానీ ఆ తర్వాత రన్ కొనసాగాలంటే సినిమాలోని ఇంటెన్సిటీ నార్త్ ఆడియన్స్కు కూడా కనెక్ట్ అవ్వాలి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో మైత్రీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రిచ్గా తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఇక కంటెంట్ ఏ స్థాయిలో క్లిక్కవుతుందో చూడాలి.
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…