Trends

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్ళిన అన్న..

ఒడిశాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన సోదరి ఖాతా నుంచి డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి, ఆమె మరణాన్ని నిరూపించేందుకు సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకెళ్లిన ఘటన సంచలనం రేపింది.

దియానాలి గ్రామానికి చెందిన జిటు (50) అనే నిరక్షరాస్యుడు, రెండు నెలల క్రితం మరణించిన తన సోదరి కక్రా ఖాతాలో ఉన్న సుమారు ₹19,300 కుటుంబ అవసరాల కోసం తీసుకోవాలని ప్రయత్నించాడు. అయితే మల్లిపోసి శాఖలోని ఒడిశా గ్రామీణ బ్యాంకు సిబ్బంది మరణ ధృవీకరణ పత్రం లేదా వారసత్వ పత్రాలు లేకుండా డబ్బు ఇవ్వలేమని తెలిపారు. ఖాతాదారు స్వయంగా రావాలని పట్టుబట్టినట్లు సమాచారం.

తాను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన జిటు, ఏప్రిల్ 27న సోదరి సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని తీసుకుని బ్యాంకుకు చేరుకున్నాడు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకునిజిటుకు నచ్చజెప్పారు. మృతదేహాన్ని మళ్లీ సమాధి చేయించడంతో పాటు అవసరమైన పత్రాల ఏర్పాటులో సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. మానవతా దృష్టితో సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.

ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న అవగాహన లోపం, పేదలకు ఎదురయ్యే ఇబ్బందులను బహిర్గతం చేసింది. అవసరమైన పత్రాలపై అవగాహన లేకపోవడం, అధికారుల కఠిన వైఖరి కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, క్లెయిమ్ చేయని బ్యాంకు ఖాతాల్లో వేల కోట్ల రూపాయలు నిల్వగా ఉన్నాయని, నిబంధనల వల్ల అవి వినియోగంలోకి రాకపోతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

Kumar

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

25 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

31 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

45 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago