ఒడిశాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన సోదరి ఖాతా నుంచి డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి, ఆమె మరణాన్ని నిరూపించేందుకు సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకెళ్లిన ఘటన సంచలనం రేపింది.
దియానాలి గ్రామానికి చెందిన జిటు (50) అనే నిరక్షరాస్యుడు, రెండు నెలల క్రితం మరణించిన తన సోదరి కక్రా ఖాతాలో ఉన్న సుమారు ₹19,300 కుటుంబ అవసరాల కోసం తీసుకోవాలని ప్రయత్నించాడు. అయితే మల్లిపోసి శాఖలోని ఒడిశా గ్రామీణ బ్యాంకు సిబ్బంది మరణ ధృవీకరణ పత్రం లేదా వారసత్వ పత్రాలు లేకుండా డబ్బు ఇవ్వలేమని తెలిపారు. ఖాతాదారు స్వయంగా రావాలని పట్టుబట్టినట్లు సమాచారం.
తాను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన జిటు, ఏప్రిల్ 27న సోదరి సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని తీసుకుని బ్యాంకుకు చేరుకున్నాడు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకునిజిటుకు నచ్చజెప్పారు. మృతదేహాన్ని మళ్లీ సమాధి చేయించడంతో పాటు అవసరమైన పత్రాల ఏర్పాటులో సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. మానవతా దృష్టితో సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న అవగాహన లోపం, పేదలకు ఎదురయ్యే ఇబ్బందులను బహిర్గతం చేసింది. అవసరమైన పత్రాలపై అవగాహన లేకపోవడం, అధికారుల కఠిన వైఖరి కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, క్లెయిమ్ చేయని బ్యాంకు ఖాతాల్లో వేల కోట్ల రూపాయలు నిల్వగా ఉన్నాయని, నిబంధనల వల్ల అవి వినియోగంలోకి రాకపోతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని…