ఇటీవలే జరిగిన ఏక్ దిన్ ఈవెంట్ లో సాయిపల్లవి హిందీలో ధారాళంగా మాట్లాడలేకపోవడాన్ని సోషల్ మీడియాలో కొందరు ట్రోలింగ్ కంటెంట్ కోసం వాడుకుంటున్నారు. అమీర్ ఖాన్ నిర్మాతగా తీసిన మూవీలో నటించి ఈ మాత్రం భాష నేర్చుకోలేదా అంటూ తన మీద కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అయితే నాలుగు వేల కోట్లతో తీసిన రామాయణలో సీతగా ఎలా మేనేజ్ చేస్తారనే ప్రశ్నలు సంధిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇదంతా అర్ధరహితం. ఎందుకో చూద్దాం.
హీరోయినే కాదు ఏ ఆర్టిస్టుకైనా భాషతో సంబంధం ఉండదు. తమ పెర్ఫార్మన్స్ కి అది ఎప్పటికీ అడ్డుగోడ కాదు. అదే నిజమైతే బాలీవుడ్ నుంచి ఎందరో హీరోయిన్లు ఇక్కడ గొప్ప అవకాశాలు దక్కించుకునే వాళ్ళు కాదు. ముప్పై సంవత్సరాల వెనుక మీనాక్షి శేషాద్రి నుంచి మొదలుపెట్టి ఇప్పటి దీపికా పదుకునే దాకా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. వీళ్లకు అక్షరం తెలుగు ముక్క రాదు. అయినా సరే బ్లాక్ బస్టర్స్ లో నటించారు. అభిమాన గణం సంపాదించుకున్నారు.
సో సాయిపల్లవి నటనని జడ్జ్ చేయాలంటే కేవలం హిందీనే ప్రామాణికంగా తీసుకోకూడదు. ఆ మాటకొస్తే ఏక్ దిన్ హీరో జునైద్ ఖాన్ మీద ఎక్కువ నెగటివిటీ ఉంది. అమీర్ ఖాన్ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఇతను ఇప్పటిదాకా బెస్ట్ అనిపించేవి ఇవ్వలేదు. ఇప్పుడీ మూవీలో కూడా ఎలా చేసుంటాడోననే అనుమానాలు జనాల్లో లేకపోలేదు. కేవలం స్టార్ కిడ్ అయిన కారణంగా తండ్రి పట్టువదలని విక్రమార్కుడిలా సినిమాలు తీయిస్తూనే ఉన్నాడు.
కేరళకు చెందిన సాయిపల్లవికి తెలుగు మీద పట్టు ఒక్క సినిమాతో ఒక్క రోజుతో రాలేదు. చాలా రోజులు కష్టపడింది. ఇప్పుడు హిందీలోనూ అలాగే చేస్తుంది. ఇది ఆమెను సమర్ధించే ప్రయత్నం కాదు. దేనికైనా కొంత టైం పడుతుందనే వాస్తవాన్ని సదరు ట్రోలర్స్ అర్థం చేసుకోవాలి. అయినా అమీర్ ఖాన్ కన్నీళ్లకే విచిత్ర భాష్యాలు చెప్పినవాళ్లకు ఇలాంటివి ఎన్ని చెప్పినా వృథా ప్రయాసే. ఇదంతా ఎలా ఉన్నా మే 1 విడుదల కాబోతున్న ఏక్ దిన్ సాయిపల్లవికి ఎలాంటి డెబ్యూ అవుతుందో చూడాలి.
This post was last modified on April 28, 2026 11:47 am
అదేదో నిన్నా మొన్నా చూసినట్టు ఉంది మహేష్ బాబు అభిమానులకు. సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఏప్రిల్ 28 బాక్సాఫీస్…
ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండడం.. ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొనియాడారు.…
విశాఖపట్నం కీర్తి .. విశ్వఖ్యాతికి చేరింది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి ఈ రోజు(మంగళవారం)…
ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అనగానే ప్రేక్షకుల్లో అమితాసక్తి కనిపిస్తుంది. మళ్లీ అలాంటి మ్యాజిక్ను రిపీట్ చేయడం కష్టమే…
దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తే.. ఆ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ అన్నీ ఒక్కసారిగా మారిపోవడం మామూలే. ముఖ్యంగా…
ఒడిశాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన సోదరి ఖాతా నుంచి డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి,…