పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల సీఐగా పనిచేస్తున్న వెంకటరమణ ఓ కీలకమైన కేసులో నిందితులకు సహకరించి అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన మరువకముందే… అదే స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్సై శ్రీనివాసరావు మరో కేసులో పట్టుబడిపోయారు.
ఏకాంతంగా గడిపే జంటలను టార్గెట్ చేసిన ఆయన వారి వీడియోలు తీసి… బెదిరింపులకు దిగారు. బాధితులతో డబ్బు దండుకోవడంతో పాటుగా తన కోరికలు తీర్చాలంటూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. ఈ విషయం తెలిసి ఆయనను సస్పెండ్ చేస్తూ ఐజీ సర్వశ్రేష్ణ త్రిపాఠి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
పల్నాడు జిల్లా ప్రత్యేకించి మాచర్ల పరిసరాల్లోని పర్యాటక కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు, మహిళలను టార్గెట్ చేసిన శ్రీనివాసరావు… ఓ ఆటో డ్రైవర్ సాయంతో దురాగతానికి పాల్పడ్డారు. జంటలు ఏకాంతంగా ఉన్న సమయంలో వారి వీడియోలను చిత్రీకరించే శ్రీనివాసరావు.,. ఆ తర్వాత వాటిని సదరు జంటలకు చూపించి వారి వద్ద డబ్బు డిమాండ్ చేసేవారు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే… వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించేవారు. ఈ బెదిరింపులకు భయపడే జంటలు ఆయన అడిగినంత డబ్బు సమర్పించుకునేవారు.
అయితే డబ్బు దండుకోవడంతోనే సరిపెట్టని శ్రీనివాసరావు… తన కోరిక తీర్చాలంటూ ఆ జంటల్లోని మహిళలను వేదించేవారు. తన కోరికను తీర్చకుంటే.. వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరించేవారు. దీంతో చాలా మంది ఆయనకు లొంగిపోయారన్న వాదన వినిపిస్తోంది.
ఇలా వందలాది జంటలపై శ్రీనివాసరావు వేధింపులకు పాల్పడ్డట్టుగా సమాచారం. ఈ విషయం ఎలాగోలా పోలీసు ఉన్నతాధికారులకు చేరగా… వారు దీనిపై సమగ్ర విచారణ చేపట్టారు. ఆరోపణలు నిజమేనని తేలడంతో శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఐజీ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
మొన్నటికి మొన్న ఓ పరువు హత్య కేసులో యువతిని చంపిన ఓ తండ్రికి సహకరించారంటూ మాచర్ల సీఐ వెంకటరమణపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా… అది నిజమేనని తేలింది. ఈ ఘటన మరువకముందే శ్రీనివాసరావు దురాగతం బయటపడటం గమనార్హం.
శ్రీనివాసరావు మాదిరిగానే… మాచర్ల పీఎస్ లో పనిచేస్తున్న ఓ సబ్ ఇన్ స్పెక్టర్ తో పాటు ఓ కానిస్టేబుల్ కూడా జంటల వీడియోలు తీస్తూ వేధింపులకు పాల్పడుతున్నట్లుగా వదంతులు వినిపిస్తున్నాయి. మొత్తంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న మాచర్లలో శాంతిభద్రతల పరిరక్షణను వదిలేసిన అక్కడి పోలీసులు ఈ తరహా వ్యవహారాల్లో నిమగ్నమైన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on April 12, 2026 10:54 am
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను…