Political News

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి మొగ్గు చూపుతున్నాయి. నాయకులు, కార్యకర్తల సంఖ్య ఎక్కువగా ఉండటంతో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలు పార్టీలు కూడా దీనికి ఆసక్తి చూపుతున్నాయి. అయితే విభజన విషయంలో మాత్రం ఒక శాస్త్రీయ విధానాన్ని పాటించాలని సూచిస్తున్నాయి.

గతానికి భిన్నంగా

వాస్తవానికి దేశంలో నియోజకవర్గాల పెంపు అనేది కొత్త విషయం కాదు. ప్రతి 10 సంవత్సరాలకు జరిగే జనాభా లెక్కల ఆధారంగా ఏ రాష్ట్రంలో నియోజకవర్గాల పెంపు అవసరమో గుర్తించి ఆ మేరకు నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఏ నియోజకవర్గంలో అవసరం ఎక్కువగా ఉందో పరిశీలిస్తారు. ఆ తరువాతే నియోజకవర్గాన్ని విభజించాలా వద్దా అన్నదానిపై కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఈ సూత్రాన్ని పక్కన పెట్టారు.

జనాభా సంఖ్యతో సంబంధం లేకుండా నియోజకవర్గాలను పెంచాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ కూడా స్పష్టం చేశారు. తద్వారా ప్రతి రాష్ట్రంలోనూ సుమారు 50 శాతం మేరకు సీట్లు పెరగనున్నాయి. ఈ పరిణామం మంచిదేనని కొన్ని ప్రాంతీయ పార్టీలు చెబుతున్నాయి. కానీ మరికొన్ని పార్టీలు విభేదిస్తున్నాయి. పెరుగుతున్న సీట్లను పూర్తిగా మహిళలకు కేటాయించడాన్ని కూడా కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లోనే మహిళలకు కేటాయింపులు చేయాలని, కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలను మహిళలకు కేటాయించడం ద్వారా బీజేపీ రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందన్న వాదన వినిపిస్తోంది. అయితే దీనిని బలంగా వ్యతిరేకిస్తే మహిళలకు వ్యతిరేకంగా ఉన్నాయన్న భావన ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఈ వ్యవహారం రాజకీయ వివాదాలకు దారితీయే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

This post was last modified on April 11, 2026 9:57 pm

Share

Recent Posts

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

44 minutes ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

5 hours ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

6 hours ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

7 hours ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

9 hours ago