తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని బహిరంగ సభలోనే వ్యాఖ్యానించారు. ములుగు జిల్లాలో నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క.. ఇటీవల తనపై బీఆర్ ఎస్ నేతలు చేసిన అవినీతి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క.. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ కేంద్రాల్లోని మహిళా ఉద్యోగులకు స్మార్టు ఫోన్లను పంపిణీ చేశారు.
అయితే.. ఈ వ్యవహారంలో సీతక్క అవినీతికి పాల్పడ్డారంటూ బీఆర్ ఎస్లోని కొందరు నాయకులు వ్యాఖ్యానించారు. ఒక్కొక్క ఫోనును అధిక మొత్తానికి కొనుగోలు చేసి.. కమీషన్ల రూపంలో సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై తాజాగా సీతక్క రియాక్ట్ అయ్యారు. ఒక్కొక్క ఫోనును 11650 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేశామని చెప్పారు. కానీ.. కొందరు తనపై అవినీతి ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తూ.. ఒక్కొక్క ఫోన్ను 14 వేల రూపాయలకు పైగా మొత్తం వెచ్చించి కొనుగోలు చేసినట్టు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి చెప్పుతెగేలా బుద్ధి చెబుతానని మంత్రి సీతక్క బ్లాస్ట్ అయ్యారు. తాను అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. తన పరిధిలో ఎక్కడ అవినీతి జరిగిందో ఆధారాలతో సహా చెప్పాలని ఆమె బీఆర్ ఎస్ నాయకులకు ఆమె సవాల్ రువ్వారు. ఫోన్ల కొనుగోలులో అంతా పారదర్శకంగానే జరిగిందన్నారు. ప్రతి రూపాయికీ జవాబుదా రీగా ఉన్నానన్నారు. రాజకీయ ప్రేరేపిత అవినీతి ఆరోపణలు చేసేవారికి చెప్పుతెగుద్దని హెచ్చరించారు. మేడారం పనుల్లోనూ గతంలో తాను అవినీతి చేసినట్టు ఆరోపించారని.. కానీ.. నిరూపించలేక పోయారని దుయ్యబట్టారు.
అధికారంలో ఉన్నా..
వాస్తవానికి ఇటీవల తెలంగాణనాయకులు హద్దులు మీరుతున్నారు. మంత్రి పదవుల్లో ఉన్నవారు..నోరు చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. వాటికి అదే రీతిలో సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్య రీతిలోనే మంత్రులుగా ఉన్నవారు మాట్లాడాలి. కానీ, చెప్పుతెగుద్ది.. లగెత్తించి కొడతాం.. బట్టులు ఊడదీయిస్తాం.. వంటి కృతక, ముతక భాషను వినియోగించడం సరికాదన్న సూచనలు వస్తున్నాయి. రాజకీయం వేరు.. అధికారం వేరు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపథ్యంలో మంత్రులు ఒకింత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది.
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…