శత్రువులో సైతం మంచి లక్షణం ఉంటే మెచ్చుకునే సంస్కృతి భారత్ సొంతం. రామాయణ, భారత, భాగవతాలు కూడా ఇదే చెబుతున్నాయి. అయితే.. మనం కొన్ని కారణాలతో మన దాయాదిదేశం పాకిస్థాన్ ను మెచ్చుకోలేక పోవచ్చు. కానీ, అన్ని విషయాల్లోనూనా? అంటే.. కాదు!. కేవలం రెండు ప్రధాన కారణాలతోనే పాక్ను భారత్ వ్యతిరేకిస్తోంది. 1) ఉగ్రవాద ప్రోత్సాహం. 2) కశ్మీర్ భూభాగం.
తాజాగా పాకిస్థాన్కు ప్రపంచ దేశాల నుంచి ఊహించని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాలకు కంటిపై కునుకులేకుండా చేస్తున్న ఇరాన్ యుద్ధాన్ని ఇప్పటికి రెండు సార్లు వాయిదా వేయించడంలో పాకిస్థాన్ చేసిన దౌత్యం ఫలించడమే దీనికి కారణం. గతంలో 5 రోజులు.. ప్రస్తుతం రెండు వారాల పాటు అమెరికా యుద్ధాన్ని నిలుపుదల చేసేలా.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీప్ చేసిన ప్రయత్నం ఫలించింది. అమెరికాకు భారత్-పాక్ మిత్రదేశాలన్న విషయం తెలిసిందే.
అయితే.. ఇరాన్ యుద్ధంలో భారత్ తటస్థ వైఖరిని తీసుకుంది. ఎవరికీ ఏమీ చెప్పలేదు. ఉమ్మడి శాంతి మంత్రం ప్రవచించింది. కానీ, పాకిస్థాన్ ఈవిషయంలో ప్రోయాక్టివ్ రోల్ పోషించింది.(ఇది ప్రశంస కాదు). ఇరాన్-అమెరికాలు రెండు కూడా పాకిస్థాన్కు మిత్ర దేశాలే. దీంతో ఆది నుంచి కూడా ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించింది. దీనిలో భాగంగానే ఇటీవల ట్రంప్.. 5 రోజుల పాటు విరామం ప్రకటించారు. మరోసారి.. ఆయన కారాలు మిరియాలు నూరుతూ.. అణుయుద్ధానికి సంకేతాలు ఇచ్చారు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్.. సహా ఆదేశ సైనికాధికారులు రంగంలోకి దిగారు. అటు ఇరాన్, ఇటు అమెరికాలతో సంయుక్త చర్చలు జరిపారు. యుద్ధం వద్దని వారించారు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించే బాధ్యత తీసుకున్నారు. అదేసమయంలో అమెరికాను నిలువరించేలా చేశారు. ఈ విషయాన్ని ట్రంపే తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
దీంతో ప్రస్తుతం రెండు వారాల పాటు ప్రపంచానికి కునుకు పట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలను ఉటంకిస్తూ.. పాకిస్థాన్పై ప్రపంచ దేశాలు.. ప్రశంసలు గుప్పిస్తున్నాయి. మంచి ఎవరు చేసినా.. మంచే కాబట్టి.. మనకు శత్రువు అయినంత మాత్రాన.. అన్నింటినీ వ్యతిరేకించాల్సిన అవసరం.. హ్రస్వ దృష్టితో చూడాల్సిన అవసరం లేదుకదా!… అంటున్నారు భారత్లోని పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…