శత్రువులో సైతం మంచి లక్షణం ఉంటే మెచ్చుకునే సంస్కృతి భారత్ సొంతం. రామాయణ, భారత, భాగవతాలు కూడా ఇదే చెబుతున్నాయి. అయితే.. మనం కొన్ని కారణాలతో మన దాయాదిదేశం పాకిస్థాన్ ను మెచ్చుకోలేక పోవచ్చు. కానీ, అన్ని విషయాల్లోనూనా? అంటే.. కాదు!. కేవలం రెండు ప్రధాన కారణాలతోనే పాక్ను భారత్ వ్యతిరేకిస్తోంది. 1) ఉగ్రవాద ప్రోత్సాహం. 2) కశ్మీర్ భూభాగం.
తాజాగా పాకిస్థాన్కు ప్రపంచ దేశాల నుంచి ఊహించని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాలకు కంటిపై కునుకులేకుండా చేస్తున్న ఇరాన్ యుద్ధాన్ని ఇప్పటికి రెండు సార్లు వాయిదా వేయించడంలో పాకిస్థాన్ చేసిన దౌత్యం ఫలించడమే దీనికి కారణం. గతంలో 5 రోజులు.. ప్రస్తుతం రెండు వారాల పాటు అమెరికా యుద్ధాన్ని నిలుపుదల చేసేలా.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీప్ చేసిన ప్రయత్నం ఫలించింది. అమెరికాకు భారత్-పాక్ మిత్రదేశాలన్న విషయం తెలిసిందే.
అయితే.. ఇరాన్ యుద్ధంలో భారత్ తటస్థ వైఖరిని తీసుకుంది. ఎవరికీ ఏమీ చెప్పలేదు. ఉమ్మడి శాంతి మంత్రం ప్రవచించింది. కానీ, పాకిస్థాన్ ఈవిషయంలో ప్రోయాక్టివ్ రోల్ పోషించింది.(ఇది ప్రశంస కాదు). ఇరాన్-అమెరికాలు రెండు కూడా పాకిస్థాన్కు మిత్ర దేశాలే. దీంతో ఆది నుంచి కూడా ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించింది. దీనిలో భాగంగానే ఇటీవల ట్రంప్.. 5 రోజుల పాటు విరామం ప్రకటించారు. మరోసారి.. ఆయన కారాలు మిరియాలు నూరుతూ.. అణుయుద్ధానికి సంకేతాలు ఇచ్చారు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్.. సహా ఆదేశ సైనికాధికారులు రంగంలోకి దిగారు. అటు ఇరాన్, ఇటు అమెరికాలతో సంయుక్త చర్చలు జరిపారు. యుద్ధం వద్దని వారించారు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించే బాధ్యత తీసుకున్నారు. అదేసమయంలో అమెరికాను నిలువరించేలా చేశారు. ఈ విషయాన్ని ట్రంపే తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
దీంతో ప్రస్తుతం రెండు వారాల పాటు ప్రపంచానికి కునుకు పట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలను ఉటంకిస్తూ.. పాకిస్థాన్పై ప్రపంచ దేశాలు.. ప్రశంసలు గుప్పిస్తున్నాయి. మంచి ఎవరు చేసినా.. మంచే కాబట్టి.. మనకు శత్రువు అయినంత మాత్రాన.. అన్నింటినీ వ్యతిరేకించాల్సిన అవసరం.. హ్రస్వ దృష్టితో చూడాల్సిన అవసరం లేదుకదా!… అంటున్నారు భారత్లోని పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు.
This post was last modified on April 8, 2026 10:20 am
భూమా ఫ్యామిలీకి రాజకీయాల్లో మంచి గుర్తింపే ఉంది. అయితే దివంగత భూమా నాగిరెడ్డి మరణానికి ముందే… ఆయన సతీమణి భూమా…
కాపు సామాజిక వర్గాన్ని తటస్థం చేయాలన్న దిశగా వైసీపీ అడుగులు వేగంగా పడుతున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం…
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్నవారు ఏం చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవు అనే ఆరోపణలు తరచూ వస్తూ ఉంటాయి.…
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…