ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్రం నోటిఫై చేసిన నేపథ్యంలో దీనికి చట్టబద్ధత కలిగింది. అయితే.. ఇక నుంచి అమరావతిని ప్రత్యేకంగా చూడడంతోపాటు..ఇక్కడ అన్ని విషయాలపైనా కీలక ముందడుగు పడేలా సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా అమరావతికి పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అదేసమయంలో అమరావతికి ప్రత్యేకమైన పాలనా వ్యవస్థ ఉండేలా కూడా కీలక చర్యలు తీసుకుంటున్నారు.
అదేసమయంలో అమరావతి స్వయం ఉపాధి కేంద్రంగా మారేలా కూడా.. ఆయన చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా.. అమరావతి పాలనాపరమైన వ్యవస్థీకృత ఏర్పాట్ల కోసం సమగ్ర నివేదిక తయారు చేసేందుకు సంస్థలను ఆహ్వానిస్తున్నారు. దీనిపై అధ్యయనం చేయడంతోపాటు.. ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా భద్రత, ఇక్కడి భూముల సమగ్ర వినియోగం, ప్రత్యేక మునిసిపల్ చట్టాలను రూపొందించనున్నారు.
ఈ మేరకు తాజాగా ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అమరావతిలో ఏర్పాటు చేసే టోల్ గేట్ల నుంచి ఇతర సదుపాయాల వరకు.. ఫీజుల వసూలు, అక్రమాలు, అవినీతి, అనధికారిక నిర్మాణాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ టెండర్లలో పేర్కొన్న అంశాల మేరకు.. రాజధాని భవిష్యత్లో స్వయంపాలిత ప్రాంతంగా మారుతుంది. ఆర్థిక వనరుల నిర్వహణ, యూజర్ఛార్జీలు, డెవలప్మెంట్ ఛార్జీల వసూలుకు ప్రత్యేక నిబంధనలు రూపొందించనున్నారు.
తద్వారా.. అమరావతికి సొమ్ములు చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అమరావతిలో పరిపాలన కోసం ఒక అపెక్స్బాడీ(స్వయం నిర్ణయాధికారులు ఉంటాయి) ఏర్పాటుకు వీలుగా ప్రస్తుత పట్టణాభివృద్ధిశాఖ చట్టాల్లో మార్పులు చేయనున్నారు. ముఖ్యంగా మెట్రోపాలిటన్ ప్లానింగ్ వర్తించేలా మార్పులు చేస్తారు. అదేసమయంలో అమరావతిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తే పరిపాలన ఎలా ఉండాలనే అంశం మీద విధి విధానాలు తయారు చేయనున్నారు. భూఆదాయ వివరాలను ఎలా ఉండాలనే అంశాన్ని కూడా టెండర్లలో పేర్కొన్నారు.
This post was last modified on April 8, 2026 10:24 am
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…