విశాఖపట్నం గాజువాక పరిధిలోని ఎల్వీ నగర్లో దారుణ ఘటన వెలుగుచూసింది. నేవీ ఉద్యోగి రవీంద్ర తనకు పరిచయమైన మౌనిక (29)ను హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో దాచిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, రవీంద్రకు ఇప్పటికే వివాహం కాగా, మౌనికతో వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తెలిసింది. ఇటీవల డబ్బుల వ్యవహారంపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం.
ఆదివారం రాత్రి భార్య పుట్టింటికి వెళ్లిన అవకాశాన్ని వినియోగించుకుని మౌనికను తన ఫ్లాట్కు పిలిచిన రవీంద్ర, అక్కడ జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నేరాన్ని దాచిపెట్టేందుకు మృతదేహాన్ని ముక్కలుగా చేసి కొంత భాగాన్ని ఫ్రిజ్లో ఉంచి, మిగిలిన భాగాలను మూట కట్టి ఇంట్లోనే దాచినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోవడం ఈ కేసులో మరింత సంచలనంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహ భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే మౌనిక తల భాగం కనిపించకపోవడంతో పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.
డబ్బుల కోసం వేధింపులే హత్యకు కారణమని నిందితుడు ప్రాథమిక విచారణలో తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ, నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దారుణం నగరంలో భయాందోళనలకు దారితీసింది.
This post was last modified on March 30, 2026 10:17 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…