విశాఖపట్నం గాజువాక పరిధిలోని ఎల్వీ నగర్లో దారుణ ఘటన వెలుగుచూసింది. నేవీ ఉద్యోగి రవీంద్ర తనకు పరిచయమైన మౌనిక (29)ను హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో దాచిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, రవీంద్రకు ఇప్పటికే వివాహం కాగా, మౌనికతో వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తెలిసింది. ఇటీవల డబ్బుల వ్యవహారంపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం.
ఆదివారం రాత్రి భార్య పుట్టింటికి వెళ్లిన అవకాశాన్ని వినియోగించుకుని మౌనికను తన ఫ్లాట్కు పిలిచిన రవీంద్ర, అక్కడ జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నేరాన్ని దాచిపెట్టేందుకు మృతదేహాన్ని ముక్కలుగా చేసి కొంత భాగాన్ని ఫ్రిజ్లో ఉంచి, మిగిలిన భాగాలను మూట కట్టి ఇంట్లోనే దాచినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోవడం ఈ కేసులో మరింత సంచలనంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహ భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే మౌనిక తల భాగం కనిపించకపోవడంతో పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.
డబ్బుల కోసం వేధింపులే హత్యకు కారణమని నిందితుడు ప్రాథమిక విచారణలో తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ, నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దారుణం నగరంలో భయాందోళనలకు దారితీసింది.
This post was last modified on March 30, 2026 10:17 am
నాలుగు రోజుల కిందట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త చిత్రం ‘పెద్ది’…
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా సాగిపోయింది. సీనియర్ల నుంచి జూనియర్ కార్యకర్తల వరకు పెద్ద ఎత్తున మంగళగిరిలోని పార్టీ…
భీకరమైన ఫామ్ లో ఉంటేనే దర్శకులకు స్టార్ హీరోలతో చేసే అవకాశం దక్కుతుంది. ఒక్క ఫ్లాప్ జాతకాలను తలకిందులు చేస్తున్న…
మన జనాలకు సినిమా హీరోలు గుర్తున్నంతగా.. దేశం కోసం ప్రాణాలు వదిలిన సైనికులు గుర్తుండరు అన్నది కఠిన వాస్తవం. కొన్నేళ్ల…
కేరళ నటి హనీ రోజ్ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వెళ్ళినప్పుడు జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో…
గత ఏడాది గేమ్ ఛేంజర్ విడుదల తేదీ ప్రకటించే సమయంలో విశ్వంభర కోసం లాక్ చేసుకున్న సంక్రాంతి డేట్ ని…