అంతర్జాతీయంగా యుద్ధం జరుగుతున్న వేళ పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా పెరుగుతాయని అందరూ భయపడుతుంటే, కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇంధనంపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని 10 రూపాయల మేర తగ్గిస్తూ ఊరటనిచ్చింది. అయితే, ఈ పన్ను తగ్గింపు వల్ల రేపటి నుండి పెట్రోల్ బంకుల్లో ధరలు భారీగా తగ్గిపోతాయని అనుకుంటే పొరపాటే. నిజానికి, ఈ నిర్ణయం వినియోగదారుడి జేబుకు తక్షణ లాభం కంటే, దేశీయ ఆయిల్ రిఫైనరీల పై పడే విపరీతమైన భారాన్ని తగ్గించడానికే అని చెప్పాలి.
పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు చుక్కలను చూస్తున్నాయి. హార్ముజ్ జలసంధి మూతపడటంతో రవాణా ఖర్చులు కూడా రెట్టింపు అయ్యాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో ఆయిల్ రిఫైనరీలు భారీ నష్టాల్లోకి వెళ్తాయి. ఆ నష్టాలను భర్తీ చేయడానికి కంపెనీలు లీటరుకు 20 నుండి 30 రూపాయల వరకు ధర పెంచాల్సి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే ప్రభుత్వం రంగంలోకి దిగింది.
పన్నును 10 రూపాయలు తగ్గించడం ద్వారా, రిఫైనరీలకు ఆ మేర ఉపశమనం కలిగించింది. అంటే, అంతర్జాతీయంగా ధర పెరిగినా, ఆ భారం మన బంకుల్లో కనిపించకుండా ఈ పన్ను తగ్గింపు ఒక ‘షీల్డ్’ లాగా పనిచేస్తుంది. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు సగానికి పైగా హార్ముజ్ మార్గం ద్వారానే పొందుతుంది. అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల ఈ మార్గం దెబ్బతినడంతో సరఫరా గొలుసులో గందరగోళం ఏర్పడింది. ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు ఈ పన్ను తగ్గించకపోయి ఉంటే, పెట్రోల్ ధర లీటరుకు 120 రూపాయలు దాటిపోయే ప్రమాదం ఉండేది.
ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ధరలు పెరగకుండా స్థిరంగా ఉండే అవకాశం ఉంది. అంటే, ఇది ధరలను తగ్గించే పథకం కాదు, పెరగకుండా అడ్డుకునే ఒక రక్షణ కవచం లాంటిది. వంట గ్యాస్ విషయంలో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది.
33 కోట్ల కుటుంబాలకు అవసరమైన ఎల్పీజీ దిగుమతులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తుగా నిల్వలను పెంచుతోంది. దేశంలో ప్రస్తుతం 60 రోజులకు సరిపడా చమురు, 30 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి. యుద్ధం సుదీర్ఘంగా సాగినా మనకు ఇబ్బంది కలగకుండా, రిఫైనరీల ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా ప్రభుత్వం పన్నుల సర్దుబాటు చేస్తోంది. దీనివల్ల కంపెనీలు నష్టపోకుండా తక్కువ ధరకే సామాన్యుడికి ఇంధనాన్ని అందించగలుగుతాయి.
This post was last modified on March 27, 2026 10:02 am
Rare & Unexpected:Probably for the first time, PM #Modi Addresses Nation Through a Selfie Video,…
అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం…
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి…
సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…
ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్కు చెందిన…