తన అభిమానుల పట్ల మెగాస్టార్ చిరంజీవి చూపించే ప్రేమ ఎలాంటిదో ఎన్నో సందర్భాల్లో చూశాం. అభిమానుల వల్లే ఇలా ఉన్నాను అంటూ కేవలం గొప్పగా మాటలు చెప్పడం కాకుండా తరచుగా తన వీరాభిమానులకు తనను కలిసే అవకాశం కల్పించి వారితో ప్రేమగా మాట్లాడుతుంటాడు చిరు. తాజాగా ఒక సీనియర్ అభిమానికి జీవిత కాల అనుభవాన్ని మిగిల్చారు చిరు.
మెగాస్టార్ పాటలకు అదిరిపోయే లెవెల్లో స్టెప్పులు వేస్తూ నడి వయస్కుడైన మురళీ అనే ఆంధ్రా అభిమాని సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. చిరు మీద తన వల్లమాలిన అభిమానాన్ని గుర్తించి ఆయన్ని మెగాస్టార్తో కల్పించే ఏర్పాటు చేశారట మెగా బ్రదర్ నాగబాబు. ఐతే చిరు పది నిమిషాలు సమయం ఇస్తారని.. ఆ టైంలో చిరుతో మాట్లాడి, కాఫీ తాగి, ఫొటో దిగే అవకాశం కల్పిస్తానని నాగబాబు చెప్పారట.
కానీ వాస్తవంగా చిరు మాత్రం నాగబాబు చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించారట. ఆ అభిమానితో ఏకంగా రెండు గంటల పాటు సమయం గడిపాడట. ఈ అనుభవం గురించి సదరు అభిమాని తీవ్ర భావోద్వేగంతో మాట్లాడాడు.
‘‘చిరంజీవి గారితో మిమ్మల్ని కల్పిస్తాం. పది నిమిషాలు కాఫీ తాగి, ఫొటో దిగే అవకాశం ఉంటుందని నాగబాబు సార్ చెప్పారు. కానీ నాగబాబు గారి చెప్పిన దాని కన్నా చాలా ఎక్కువ చేశారు చిరంజీవి గారు. రెండు గంటల పాటు కూర్చోబెట్టి మాట్లాడారు. మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ జరుగుతుంటే..
ఆ షూట్ ఆపి మరీ మాతో మాట్లాడారు. ఇంత ఎనర్జీ మీకు ఎలా వచ్చింది, నేను ఎప్పుడో చేసిన పాటలను ఇప్పుడు మీరు ఎలా చేయగలుగుతున్నారు.. సూపరండీ, మీరు చాలా గొప్ప అని చెప్పారు. ఆయన అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. మీరు లేకుండా నేను లేను అని.. మీరే నా ప్రాణం అని చెప్పాను. రెండు గంటల పాటు నాకు ఎలా కాలక్షేపం అయిందో తెలియలేదు’’ అని మురళి వివరించారు.
This post was last modified on March 27, 2026 5:16 am
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…
సూర్య వీరభద్రుడు ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. తమిళనాడులో రాజకీయ వాతావరణం వల్ల రిలీజ్ చేయాలా వద్దాని రెండు…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక కొన్ని రోజుల పాటు నడిచిన డ్రామాకు ఆదివారం తెరపడి, ఆదివారం నాడు తమిళ…