తన అభిమానుల పట్ల మెగాస్టార్ చిరంజీవి చూపించే ప్రేమ ఎలాంటిదో ఎన్నో సందర్భాల్లో చూశాం. అభిమానుల వల్లే ఇలా ఉన్నాను అంటూ కేవలం గొప్పగా మాటలు చెప్పడం కాకుండా తరచుగా తన వీరాభిమానులకు తనను కలిసే అవకాశం కల్పించి వారితో ప్రేమగా మాట్లాడుతుంటాడు చిరు. తాజాగా ఒక సీనియర్ అభిమానికి జీవిత కాల అనుభవాన్ని మిగిల్చారు చిరు.
మెగాస్టార్ పాటలకు అదిరిపోయే లెవెల్లో స్టెప్పులు వేస్తూ నడి వయస్కుడైన మురళీ అనే ఆంధ్రా అభిమాని సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. చిరు మీద తన వల్లమాలిన అభిమానాన్ని గుర్తించి ఆయన్ని మెగాస్టార్తో కల్పించే ఏర్పాటు చేశారట మెగా బ్రదర్ నాగబాబు. ఐతే చిరు పది నిమిషాలు సమయం ఇస్తారని.. ఆ టైంలో చిరుతో మాట్లాడి, కాఫీ తాగి, ఫొటో దిగే అవకాశం కల్పిస్తానని నాగబాబు చెప్పారట.
కానీ వాస్తవంగా చిరు మాత్రం నాగబాబు చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించారట. ఆ అభిమానితో ఏకంగా రెండు గంటల పాటు సమయం గడిపాడట. ఈ అనుభవం గురించి సదరు అభిమాని తీవ్ర భావోద్వేగంతో మాట్లాడాడు.
‘‘చిరంజీవి గారితో మిమ్మల్ని కల్పిస్తాం. పది నిమిషాలు కాఫీ తాగి, ఫొటో దిగే అవకాశం ఉంటుందని నాగబాబు సార్ చెప్పారు. కానీ నాగబాబు గారి చెప్పిన దాని కన్నా చాలా ఎక్కువ చేశారు చిరంజీవి గారు. రెండు గంటల పాటు కూర్చోబెట్టి మాట్లాడారు. మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ జరుగుతుంటే..
ఆ షూట్ ఆపి మరీ మాతో మాట్లాడారు. ఇంత ఎనర్జీ మీకు ఎలా వచ్చింది, నేను ఎప్పుడో చేసిన పాటలను ఇప్పుడు మీరు ఎలా చేయగలుగుతున్నారు.. సూపరండీ, మీరు చాలా గొప్ప అని చెప్పారు. ఆయన అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. మీరు లేకుండా నేను లేను అని.. మీరే నా ప్రాణం అని చెప్పాను. రెండు గంటల పాటు నాకు ఎలా కాలక్షేపం అయిందో తెలియలేదు’’ అని మురళి వివరించారు.
This post was last modified on March 27, 2026 5:16 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…