తన అభిమానుల పట్ల మెగాస్టార్ చిరంజీవి చూపించే ప్రేమ ఎలాంటిదో ఎన్నో సందర్భాల్లో చూశాం. అభిమానుల వల్లే ఇలా ఉన్నాను అంటూ కేవలం గొప్పగా మాటలు చెప్పడం కాకుండా తరచుగా తన వీరాభిమానులకు తనను కలిసే అవకాశం కల్పించి వారితో ప్రేమగా మాట్లాడుతుంటాడు చిరు. తాజాగా ఒక సీనియర్ అభిమానికి జీవిత కాల అనుభవాన్ని మిగిల్చారు చిరు.
మెగాస్టార్ పాటలకు అదిరిపోయే లెవెల్లో స్టెప్పులు వేస్తూ నడి వయస్కుడైన మురళీ అనే ఆంధ్రా అభిమాని సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. చిరు మీద తన వల్లమాలిన అభిమానాన్ని గుర్తించి ఆయన్ని మెగాస్టార్తో కల్పించే ఏర్పాటు చేశారట మెగా బ్రదర్ నాగబాబు. ఐతే చిరు పది నిమిషాలు సమయం ఇస్తారని.. ఆ టైంలో చిరుతో మాట్లాడి, కాఫీ తాగి, ఫొటో దిగే అవకాశం కల్పిస్తానని నాగబాబు చెప్పారట.
కానీ వాస్తవంగా చిరు మాత్రం నాగబాబు చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించారట. ఆ అభిమానితో ఏకంగా రెండు గంటల పాటు సమయం గడిపాడట. ఈ అనుభవం గురించి సదరు అభిమాని తీవ్ర భావోద్వేగంతో మాట్లాడాడు.
‘‘చిరంజీవి గారితో మిమ్మల్ని కల్పిస్తాం. పది నిమిషాలు కాఫీ తాగి, ఫొటో దిగే అవకాశం ఉంటుందని నాగబాబు సార్ చెప్పారు. కానీ నాగబాబు గారి చెప్పిన దాని కన్నా చాలా ఎక్కువ చేశారు చిరంజీవి గారు. రెండు గంటల పాటు కూర్చోబెట్టి మాట్లాడారు. మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ జరుగుతుంటే..
ఆ షూట్ ఆపి మరీ మాతో మాట్లాడారు. ఇంత ఎనర్జీ మీకు ఎలా వచ్చింది, నేను ఎప్పుడో చేసిన పాటలను ఇప్పుడు మీరు ఎలా చేయగలుగుతున్నారు.. సూపరండీ, మీరు చాలా గొప్ప అని చెప్పారు. ఆయన అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. మీరు లేకుండా నేను లేను అని.. మీరే నా ప్రాణం అని చెప్పాను. రెండు గంటల పాటు నాకు ఎలా కాలక్షేపం అయిందో తెలియలేదు’’ అని మురళి వివరించారు.
This post was last modified on March 27, 2026 5:16 am
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…