తన అభిమానుల పట్ల మెగాస్టార్ చిరంజీవి చూపించే ప్రేమ ఎలాంటిదో ఎన్నో సందర్భాల్లో చూశాం. అభిమానుల వల్లే ఇలా ఉన్నాను అంటూ కేవలం గొప్పగా మాటలు చెప్పడం కాకుండా తరచుగా తన వీరాభిమానులకు తనను కలిసే అవకాశం కల్పించి వారితో ప్రేమగా మాట్లాడుతుంటాడు చిరు. తాజాగా ఒక సీనియర్ అభిమానికి జీవిత కాల అనుభవాన్ని మిగిల్చారు చిరు.
మెగాస్టార్ పాటలకు అదిరిపోయే లెవెల్లో స్టెప్పులు వేస్తూ నడి వయస్కుడైన మురళీ అనే ఆంధ్రా అభిమాని సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. చిరు మీద తన వల్లమాలిన అభిమానాన్ని గుర్తించి ఆయన్ని మెగాస్టార్తో కల్పించే ఏర్పాటు చేశారట మెగా బ్రదర్ నాగబాబు. ఐతే చిరు పది నిమిషాలు సమయం ఇస్తారని.. ఆ టైంలో చిరుతో మాట్లాడి, కాఫీ తాగి, ఫొటో దిగే అవకాశం కల్పిస్తానని నాగబాబు చెప్పారట.
కానీ వాస్తవంగా చిరు మాత్రం నాగబాబు చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించారట. ఆ అభిమానితో ఏకంగా రెండు గంటల పాటు సమయం గడిపాడట. ఈ అనుభవం గురించి సదరు అభిమాని తీవ్ర భావోద్వేగంతో మాట్లాడాడు.
‘‘చిరంజీవి గారితో మిమ్మల్ని కల్పిస్తాం. పది నిమిషాలు కాఫీ తాగి, ఫొటో దిగే అవకాశం ఉంటుందని నాగబాబు సార్ చెప్పారు. కానీ నాగబాబు గారి చెప్పిన దాని కన్నా చాలా ఎక్కువ చేశారు చిరంజీవి గారు. రెండు గంటల పాటు కూర్చోబెట్టి మాట్లాడారు. మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ జరుగుతుంటే..
ఆ షూట్ ఆపి మరీ మాతో మాట్లాడారు. ఇంత ఎనర్జీ మీకు ఎలా వచ్చింది, నేను ఎప్పుడో చేసిన పాటలను ఇప్పుడు మీరు ఎలా చేయగలుగుతున్నారు.. సూపరండీ, మీరు చాలా గొప్ప అని చెప్పారు. ఆయన అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. మీరు లేకుండా నేను లేను అని.. మీరే నా ప్రాణం అని చెప్పాను. రెండు గంటల పాటు నాకు ఎలా కాలక్షేపం అయిందో తెలియలేదు’’ అని మురళి వివరించారు.
This post was last modified on March 27, 2026 5:16 am
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…