మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు ఓ సామాన్యుడి ధైర్యం ఎనిమిది మంది ప్రాణాలను కాపాడింది. మంటలు అంటుకుని బస్సు మొత్తం పొగతో నిండిపోయిన ఆ భయానక సమయంలో, ఒక ప్రయాణికుడు చూపిన సమయస్ఫూర్తి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చావు కళ్లముందు కనిపిస్తున్నా వణుకు లేకుండా, తనతో పాటు ఉన్న తోటి ప్రయాణికులను కాపాడి నిజమైన హీరో అనిపించుకున్నారు.
బస్సు టిప్పర్ను ఢీకొట్టిన వెంటనే డీజిల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు లోపల దట్టమైన పొగ వ్యాపించింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారిన ఆ స్థితిలో, అక్కడ ఉన్న ఒక వ్యక్తి తన వద్ద ఉన్న మొండికత్తిని తీశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కత్తితో బస్సు కిటికీ అద్దాలను బలంగా పగలగొట్టారు. మంటలు చుట్టుముడుతున్నా భయపడకుండా, తన దగ్గరలో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులను ఒక్కొక్కరిగా ఆ కిటికీ గుండా బయటకు తోసేశారు.
అందరినీ సురక్షితంగా బయటకు పంపిన తర్వాత, చివరగా అతను కూడా కిటికీలోంచి దూకి తన ప్రాణాలను కాపాడుకున్నారు. అప్పటికే బస్సు వెనుక భాగం పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. “పొగ దట్టంగా ఉండటంతో మిగతా వాళ్లను కాపాడలేకపోయాను” అని అతను ఆవేదనగా చెబుతుంటే, ఆ సమయంలో అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవాలని చూస్తుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం తన ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల కోసం పోరాడారు. ఆ మొండికత్తే ఆ ఎనిమిది మందికి ప్రాణదాతగా మారింది. మంటల్లో కాలిపోతున్న బస్సు నుంచి బయటపడిన ఆ ప్రయాణికులు, తమకు పునర్జన్మ ఇచ్చిన ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈ ఘటనలో 13 మంది సజీవ దహనం కావడం కలచివేసే విషయం. అయితే ఈ వ్యక్తి సాహసం చేయకపోయి ఉంటే ఆ మృతుల సంఖ్య ఇంకా పెరిగి ఉండేది.
This post was last modified on March 26, 2026 2:50 pm
ఓటిటిలు ఇంత విస్తృతంగా పెరిగిన తర్వాత ఏదైనా హిట్ సినిమాని రీమేక్ చేయాలంటే సంవత్సరాలు కాకుండా నెలల్లోనే పూర్తి చేయాలి.…
దర్శకుడు కొరటాల శివ టైం అంత బాగా నడుస్తున్నట్టు లేదు. ఆచార్య మానని గాయం చేసింది. డిజాస్టర్లు అందరికీ వస్తాయి…
మల్లారెడ్డి విద్యాసంస్థలను ఏపీకి కూడా విస్తరించారు మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి. తిరుపతిలో మల్లారెడ్డి…
డబ్బు, బంగారం కోసం ఓ తల్లి తన మైనర్ కొడుకును హత్యలకు ప్రేరేపించిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. సిద్దిపేట…
సూర్యకు ఈ ఏడాది బాగానే కలిసి వస్తోంది. ‘వీరభద్రుడు’ తర్వాత ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా మంచి రన్లో…
గ్రాండ్ ఓల్డ్ ట్రంక్ పార్టీ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. వరుసగా హ్యాట్రిక్ కొట్టి అధికారంలో ఉన్న…