మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు ఓ సామాన్యుడి ధైర్యం ఎనిమిది మంది ప్రాణాలను కాపాడింది. మంటలు అంటుకుని బస్సు మొత్తం పొగతో నిండిపోయిన ఆ భయానక సమయంలో, ఒక ప్రయాణికుడు చూపిన సమయస్ఫూర్తి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చావు కళ్లముందు కనిపిస్తున్నా వణుకు లేకుండా, తనతో పాటు ఉన్న తోటి ప్రయాణికులను కాపాడి నిజమైన హీరో అనిపించుకున్నారు.
బస్సు టిప్పర్ను ఢీకొట్టిన వెంటనే డీజిల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు లోపల దట్టమైన పొగ వ్యాపించింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారిన ఆ స్థితిలో, అక్కడ ఉన్న ఒక వ్యక్తి తన వద్ద ఉన్న మొండికత్తిని తీశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కత్తితో బస్సు కిటికీ అద్దాలను బలంగా పగలగొట్టారు. మంటలు చుట్టుముడుతున్నా భయపడకుండా, తన దగ్గరలో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులను ఒక్కొక్కరిగా ఆ కిటికీ గుండా బయటకు తోసేశారు.
అందరినీ సురక్షితంగా బయటకు పంపిన తర్వాత, చివరగా అతను కూడా కిటికీలోంచి దూకి తన ప్రాణాలను కాపాడుకున్నారు. అప్పటికే బస్సు వెనుక భాగం పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. “పొగ దట్టంగా ఉండటంతో మిగతా వాళ్లను కాపాడలేకపోయాను” అని అతను ఆవేదనగా చెబుతుంటే, ఆ సమయంలో అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవాలని చూస్తుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం తన ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల కోసం పోరాడారు. ఆ మొండికత్తే ఆ ఎనిమిది మందికి ప్రాణదాతగా మారింది. మంటల్లో కాలిపోతున్న బస్సు నుంచి బయటపడిన ఆ ప్రయాణికులు, తమకు పునర్జన్మ ఇచ్చిన ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈ ఘటనలో 13 మంది సజీవ దహనం కావడం కలచివేసే విషయం. అయితే ఈ వ్యక్తి సాహసం చేయకపోయి ఉంటే ఆ మృతుల సంఖ్య ఇంకా పెరిగి ఉండేది.
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…