Trends

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు ఓ సామాన్యుడి ధైర్యం ఎనిమిది మంది ప్రాణాలను కాపాడింది. మంటలు అంటుకుని బస్సు మొత్తం పొగతో నిండిపోయిన ఆ భయానక సమయంలో, ఒక ప్రయాణికుడు చూపిన సమయస్ఫూర్తి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చావు కళ్లముందు కనిపిస్తున్నా వణుకు లేకుండా, తనతో పాటు ఉన్న తోటి ప్రయాణికులను కాపాడి నిజమైన హీరో అనిపించుకున్నారు.

బస్సు టిప్పర్‌ను ఢీకొట్టిన వెంటనే డీజిల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు లోపల దట్టమైన పొగ వ్యాపించింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారిన ఆ స్థితిలో, అక్కడ ఉన్న ఒక వ్యక్తి తన వద్ద ఉన్న మొండికత్తిని తీశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కత్తితో బస్సు కిటికీ అద్దాలను బలంగా పగలగొట్టారు. మంటలు చుట్టుముడుతున్నా భయపడకుండా, తన దగ్గరలో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులను ఒక్కొక్కరిగా ఆ కిటికీ గుండా బయటకు తోసేశారు.

అందరినీ సురక్షితంగా బయటకు పంపిన తర్వాత, చివరగా అతను కూడా కిటికీలోంచి దూకి తన ప్రాణాలను కాపాడుకున్నారు. అప్పటికే బస్సు వెనుక భాగం పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. “పొగ దట్టంగా ఉండటంతో మిగతా వాళ్లను కాపాడలేకపోయాను” అని అతను ఆవేదనగా చెబుతుంటే, ఆ సమయంలో అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవాలని చూస్తుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం తన ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల కోసం పోరాడారు. ఆ మొండికత్తే ఆ ఎనిమిది మందికి ప్రాణదాతగా మారింది. మంటల్లో కాలిపోతున్న బస్సు నుంచి బయటపడిన ఆ ప్రయాణికులు, తమకు పునర్జన్మ ఇచ్చిన ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈ ఘటనలో 13 మంది సజీవ దహనం కావడం కలచివేసే విషయం. అయితే ఈ వ్యక్తి సాహసం చేయకపోయి ఉంటే ఆ మృతుల సంఖ్య ఇంకా పెరిగి ఉండేది.

This post was last modified on March 26, 2026 2:50 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

3 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

4 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

4 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

6 hours ago