Trends

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు ఓ సామాన్యుడి ధైర్యం ఎనిమిది మంది ప్రాణాలను కాపాడింది. మంటలు అంటుకుని బస్సు మొత్తం పొగతో నిండిపోయిన ఆ భయానక సమయంలో, ఒక ప్రయాణికుడు చూపిన సమయస్ఫూర్తి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చావు కళ్లముందు కనిపిస్తున్నా వణుకు లేకుండా, తనతో పాటు ఉన్న తోటి ప్రయాణికులను కాపాడి నిజమైన హీరో అనిపించుకున్నారు.

బస్సు టిప్పర్‌ను ఢీకొట్టిన వెంటనే డీజిల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు లోపల దట్టమైన పొగ వ్యాపించింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారిన ఆ స్థితిలో, అక్కడ ఉన్న ఒక వ్యక్తి తన వద్ద ఉన్న మొండికత్తిని తీశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కత్తితో బస్సు కిటికీ అద్దాలను బలంగా పగలగొట్టారు. మంటలు చుట్టుముడుతున్నా భయపడకుండా, తన దగ్గరలో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులను ఒక్కొక్కరిగా ఆ కిటికీ గుండా బయటకు తోసేశారు.

అందరినీ సురక్షితంగా బయటకు పంపిన తర్వాత, చివరగా అతను కూడా కిటికీలోంచి దూకి తన ప్రాణాలను కాపాడుకున్నారు. అప్పటికే బస్సు వెనుక భాగం పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. “పొగ దట్టంగా ఉండటంతో మిగతా వాళ్లను కాపాడలేకపోయాను” అని అతను ఆవేదనగా చెబుతుంటే, ఆ సమయంలో అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవాలని చూస్తుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం తన ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల కోసం పోరాడారు. ఆ మొండికత్తే ఆ ఎనిమిది మందికి ప్రాణదాతగా మారింది. మంటల్లో కాలిపోతున్న బస్సు నుంచి బయటపడిన ఆ ప్రయాణికులు, తమకు పునర్జన్మ ఇచ్చిన ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈ ఘటనలో 13 మంది సజీవ దహనం కావడం కలచివేసే విషయం. అయితే ఈ వ్యక్తి సాహసం చేయకపోయి ఉంటే ఆ మృతుల సంఖ్య ఇంకా పెరిగి ఉండేది.

This post was last modified on March 26, 2026 2:50 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Markapur

Recent Posts

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…

26 minutes ago

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

2 hours ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

2 hours ago

ధైర్యం అనుమానం మధ్య ‘పెద్ది’ సందిగ్ధం

రేపు ప్రారంభం కావాల్సిన పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏప్రిల్ 8కి వాయిదా వేయడం అభిమానుల్లో ఖంగారు పుట్టిస్తోంది.…

2 hours ago

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

4 hours ago

మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…

5 hours ago