గ్రాండ్ ఓల్డ్ ట్రంక్ పార్టీ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. వరుసగా హ్యాట్రిక్ కొట్టి అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను గద్దె దింపేందుకు విఫల ప్రయత్నాలు చేస్తోంది. ఇక, ఎన్నో ఏళ్లుగా పార్టీని వేధిస్తున్న అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతి స్వరాలు, ఆధిపత్య పోరు, అసంతృప్త నేతల బుజ్జగింపులను కంట్రోల్ చేయలేక సతమతమవుతోంది.
తెలంగాణలో సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు ఎంతగా వ్యతిరేకించారో చెప్పనక్కర లేదు. చివరకు రేవంత్ సీఎం అయిన తర్వాత కూడా జీవన్ రెడ్డి వంటి నేతలు ఆయనపై అసంతృప్తి వెళ్లగక్కుతూ పార్టీని వీడారు. తాజాగా అదే బాటలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి పయనించబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
తాను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతానని చిన్నారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. సోనియా గాంధీ తనకు టికెట్ ఇచ్చారని, డబ్బులు లేకపోతే తనను ఖర్చు పెట్టుకుని గెలిపించాలని రేవంత్ రెడ్డికి చెప్పారని అన్నారు. మేఘారెడ్డి దగ్గర రేవంత్ డబ్బులు తీసుకుని అతడికే టికెట్ ఇచ్చారని షాకింగ్ ఆరోపణలు చేశారు.
మేఘారెడ్డి అడ్డుపడడం వల్లే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని మంత్రులు చెబుతున్నారని ఆరోపించారు. తన మనుషులకు కాంట్రాక్టులు రాకపోవడంతో పనులను మేఘారెడ్డి ఆపుతున్నట్లు మంత్రులు చెబుతున్నారని ఆరోపణలు గుప్పించారు. తన అనుచరులను కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవన్ రెడ్డి లాగా తాను కూడా పార్టీపై తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు.
అయితే, తాను పార్టీ వదిలి వెళ్లనని, మేఘారెడ్డి లాంటి తప్పుడు గాళ్లను పార్టీ నుంచి తరిమేస్తానని చిన్నారెడ్డి చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. మరి, ఈ కామెంట్లపై మేఘారెడ్డి రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on August 17, 2026 2:52 pm
డబ్బు, బంగారం కోసం ఓ తల్లి తన మైనర్ కొడుకును హత్యలకు ప్రేరేపించిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. సిద్దిపేట…
సూర్యకు ఈ ఏడాది బాగానే కలిసి వస్తోంది. ‘వీరభద్రుడు’ తర్వాత ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా మంచి రన్లో…
‘ఇరుముడి’ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘మల్లెపూల పల్లకి’ పాట వచ్చేసింది. అయ్యప్ప భక్తులకు ఈ పాట కొత్తది కాదు.…
ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యారు. ఈ నెల 17 నుంచి 20 వరకు ఈ…
‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబు సానా నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ ఆయన దగ్గర ఉన్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబుకు ఏపీ కేబినెట్ లో మంత్రి పదవి…