గ్రాండ్ ఓల్డ్ ట్రంక్ పార్టీ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. వరుసగా హ్యాట్రిక్ కొట్టి అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను గద్దె దింపేందుకు విఫల ప్రయత్నాలు చేస్తోంది. ఇక, ఎన్నో ఏళ్లుగా పార్టీని వేధిస్తున్న అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతి స్వరాలు, ఆధిపత్య పోరు, అసంతృప్త నేతల బుజ్జగింపులను కంట్రోల్ చేయలేక సతమతమవుతోంది.
తెలంగాణలో సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు ఎంతగా వ్యతిరేకించారో చెప్పనక్కర లేదు. చివరకు రేవంత్ సీఎం అయిన తర్వాత కూడా జీవన్ రెడ్డి వంటి నేతలు ఆయనపై అసంతృప్తి వెళ్లగక్కుతూ పార్టీని వీడారు. తాజాగా అదే బాటలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి పయనించబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
తాను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతానని చిన్నారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. సోనియా గాంధీ తనకు టికెట్ ఇచ్చారని, డబ్బులు లేకపోతే తనను ఖర్చు పెట్టుకుని గెలిపించాలని రేవంత్ రెడ్డికి చెప్పారని అన్నారు. మేఘారెడ్డి దగ్గర రేవంత్ డబ్బులు తీసుకుని అతడికే టికెట్ ఇచ్చారని షాకింగ్ ఆరోపణలు చేశారు.
మేఘారెడ్డి అడ్డుపడడం వల్లే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని మంత్రులు చెబుతున్నారని ఆరోపించారు. తన మనుషులకు కాంట్రాక్టులు రాకపోవడంతో పనులను మేఘారెడ్డి ఆపుతున్నట్లు మంత్రులు చెబుతున్నారని ఆరోపణలు గుప్పించారు. తన అనుచరులను కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవన్ రెడ్డి లాగా తాను కూడా పార్టీపై తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు.
అయితే, తాను పార్టీ వదిలి వెళ్లనని, మేఘారెడ్డి లాంటి తప్పుడు గాళ్లను పార్టీ నుంచి తరిమేస్తానని చిన్నారెడ్డి చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. మరి, ఈ కామెంట్లపై మేఘారెడ్డి రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on August 17, 2026 2:52 pm
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…
తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…
విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…
నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా…