Political News

ఇక ఎవరొచ్చినా అమరావతిని ముట్టుకోలేరు

తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి, మరోవైపు ఆర్థిక లోటుతో ప్రయాణం మొదలుపెట్టిన ఏపీని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విభజిత ఏపీకి తొలి సీఎంగా ఓ విస్పష్ట దారిని అయితే చూపారు.

ఆర్థిక లోటును క్రమంగా తగ్గించేస్తూ… కొత్తగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. విజయవాడ, గుంటూరుల మధ్యలో బాబు ఎంపిక చేసిన రాజధాని నిర్మాణానికి రైతులు తమ భూములను స్వచ్ఛందంగానే ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. రైతులు ఇచ్చిన భూముల్లో తొలి రెండు, మూడేళ్లలోనే చంద్రబాబు అమరావతికి రాజధాని రూపు తెచ్చారు. తాజాగా అమరావతికి పటిష్ఠతకు ఆయన చర్యలను ప్రారంభించారు.

అయితే 2019లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… రాజధానిగా అమరావతిని సమూలంగా నిర్మూలించే దిశగా అడుగులు వేశారు. మూడు రాజధానులంటూ జగన్ చెప్పిన సిద్ధాంతాన్ని రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ పోరాటం చేశారు.

2024 ఎన్నికల్లో తిరిగి టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాగా చంద్రబాబు మరోమారు సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టారు. ఇకపై ఎవరు అధికారంలోకి వచ్చినా…రాజధానిగా అమరావతికి ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో చర్యలకు బాబు సర్కారు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా త్వరలోనే ఏపీ సర్కారు ఓ కీలక అడుగు వేయనుంది.

అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా బాబు సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. అందులో భాగంగా ఏపీ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచనుంది. ఈ సమావేశంలో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించనుంది.

ఈ తీర్మానాన్ని నేరుగా కేంద్రానికి పంపనుంది. కేంద్రంలో కూటమి సర్కారే అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ తీర్మానానికి పార్లమెంటు ఆమోదం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ తీర్మానానికి పార్లమెంటు ఆమోదం లభిస్తే…. ఆ తర్వాత జగన్ అయినా, మరోవరైనా అధికారంలోకి వచ్చినా… అమరావతి నుంచి రాజదానిని మార్చడానికి వీలుండదు. 

వాస్తవానికి కేంద్రానికి పంపే తీర్మానం విషయంలో రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీతో పాటు శాసన మండలి ఆమోదం కూడా తీసుకుంటారు. అయితే ప్రతి తీర్మానం విషయంలో మండలి ఆమోదం తప్పనిసరి అన్న నిబంధన అయితే లేదు. ఇదే విషయాన్ని ఆసరా చేసుకుని కూటమి సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది.

అసెంబ్లీతో కూటమికి పూర్తి స్థాయి మద్దతు ఉన్నా… మండలిలో వైసీపీకి మెజారిటీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మండలిలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడితే… వైసీపీ అడ్డుకుని తీరుతుంది. దీంతో మండలి ఆమోదం అవసరం లేకుండానే ఈ తీర్మారాన్ని కేవలం అసెంబ్లీ ఆమోదంతో మాత్రమే కేంద్రానికి పంపాలని బాబు సర్కారు తీర్మానించింది. ఈ లెక్కన ఇకపై జగన్ సహా మరెవరు వచ్చినా రాజధానిని అమరావతి నుంచి తరలించడం దుస్సాధ్యమేనని చెప్పక తప్పదు.

This post was last modified on March 26, 2026 2:47 pm

Share

Recent Posts

పార్టీ సమస్యలు పట్టించుకోండి సీఎం సార్

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…

58 minutes ago

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

3 hours ago

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

7 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

10 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

10 hours ago

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

11 hours ago