తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి, మరోవైపు ఆర్థిక లోటుతో ప్రయాణం మొదలుపెట్టిన ఏపీని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విభజిత ఏపీకి తొలి సీఎంగా ఓ విస్పష్ట దారిని అయితే చూపారు.
ఆర్థిక లోటును క్రమంగా తగ్గించేస్తూ… కొత్తగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. విజయవాడ, గుంటూరుల మధ్యలో బాబు ఎంపిక చేసిన రాజధాని నిర్మాణానికి రైతులు తమ భూములను స్వచ్ఛందంగానే ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. రైతులు ఇచ్చిన భూముల్లో తొలి రెండు, మూడేళ్లలోనే చంద్రబాబు అమరావతికి రాజధాని రూపు తెచ్చారు. తాజాగా అమరావతికి పటిష్ఠతకు ఆయన చర్యలను ప్రారంభించారు.
అయితే 2019లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… రాజధానిగా అమరావతిని సమూలంగా నిర్మూలించే దిశగా అడుగులు వేశారు. మూడు రాజధానులంటూ జగన్ చెప్పిన సిద్ధాంతాన్ని రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ పోరాటం చేశారు.
2024 ఎన్నికల్లో తిరిగి టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాగా చంద్రబాబు మరోమారు సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టారు. ఇకపై ఎవరు అధికారంలోకి వచ్చినా…రాజధానిగా అమరావతికి ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో చర్యలకు బాబు సర్కారు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా త్వరలోనే ఏపీ సర్కారు ఓ కీలక అడుగు వేయనుంది.
అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా బాబు సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. అందులో భాగంగా ఏపీ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచనుంది. ఈ సమావేశంలో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించనుంది.
ఈ తీర్మానాన్ని నేరుగా కేంద్రానికి పంపనుంది. కేంద్రంలో కూటమి సర్కారే అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ తీర్మానానికి పార్లమెంటు ఆమోదం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ తీర్మానానికి పార్లమెంటు ఆమోదం లభిస్తే…. ఆ తర్వాత జగన్ అయినా, మరోవరైనా అధికారంలోకి వచ్చినా… అమరావతి నుంచి రాజదానిని మార్చడానికి వీలుండదు.
వాస్తవానికి కేంద్రానికి పంపే తీర్మానం విషయంలో రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీతో పాటు శాసన మండలి ఆమోదం కూడా తీసుకుంటారు. అయితే ప్రతి తీర్మానం విషయంలో మండలి ఆమోదం తప్పనిసరి అన్న నిబంధన అయితే లేదు. ఇదే విషయాన్ని ఆసరా చేసుకుని కూటమి సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది.
అసెంబ్లీతో కూటమికి పూర్తి స్థాయి మద్దతు ఉన్నా… మండలిలో వైసీపీకి మెజారిటీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మండలిలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడితే… వైసీపీ అడ్డుకుని తీరుతుంది. దీంతో మండలి ఆమోదం అవసరం లేకుండానే ఈ తీర్మారాన్ని కేవలం అసెంబ్లీ ఆమోదంతో మాత్రమే కేంద్రానికి పంపాలని బాబు సర్కారు తీర్మానించింది. ఈ లెక్కన ఇకపై జగన్ సహా మరెవరు వచ్చినా రాజధానిని అమరావతి నుంచి తరలించడం దుస్సాధ్యమేనని చెప్పక తప్పదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…