Political News

ఇక ఎవరొచ్చినా అమరావతిని ముట్టుకోలేరు

తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి, మరోవైపు ఆర్థిక లోటుతో ప్రయాణం మొదలుపెట్టిన ఏపీని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విభజిత ఏపీకి తొలి సీఎంగా ఓ విస్పష్ట దారిని అయితే చూపారు.

ఆర్థిక లోటును క్రమంగా తగ్గించేస్తూ… కొత్తగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. విజయవాడ, గుంటూరుల మధ్యలో బాబు ఎంపిక చేసిన రాజధాని నిర్మాణానికి రైతులు తమ భూములను స్వచ్ఛందంగానే ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. రైతులు ఇచ్చిన భూముల్లో తొలి రెండు, మూడేళ్లలోనే చంద్రబాబు అమరావతికి రాజధాని రూపు తెచ్చారు. తాజాగా అమరావతికి పటిష్ఠతకు ఆయన చర్యలను ప్రారంభించారు.

అయితే 2019లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… రాజధానిగా అమరావతిని సమూలంగా నిర్మూలించే దిశగా అడుగులు వేశారు. మూడు రాజధానులంటూ జగన్ చెప్పిన సిద్ధాంతాన్ని రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ పోరాటం చేశారు.

2024 ఎన్నికల్లో తిరిగి టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాగా చంద్రబాబు మరోమారు సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టారు. ఇకపై ఎవరు అధికారంలోకి వచ్చినా…రాజధానిగా అమరావతికి ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో చర్యలకు బాబు సర్కారు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా త్వరలోనే ఏపీ సర్కారు ఓ కీలక అడుగు వేయనుంది.

అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా బాబు సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. అందులో భాగంగా ఏపీ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచనుంది. ఈ సమావేశంలో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించనుంది.

ఈ తీర్మానాన్ని నేరుగా కేంద్రానికి పంపనుంది. కేంద్రంలో కూటమి సర్కారే అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ తీర్మానానికి పార్లమెంటు ఆమోదం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ తీర్మానానికి పార్లమెంటు ఆమోదం లభిస్తే…. ఆ తర్వాత జగన్ అయినా, మరోవరైనా అధికారంలోకి వచ్చినా… అమరావతి నుంచి రాజదానిని మార్చడానికి వీలుండదు. 

వాస్తవానికి కేంద్రానికి పంపే తీర్మానం విషయంలో రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీతో పాటు శాసన మండలి ఆమోదం కూడా తీసుకుంటారు. అయితే ప్రతి తీర్మానం విషయంలో మండలి ఆమోదం తప్పనిసరి అన్న నిబంధన అయితే లేదు. ఇదే విషయాన్ని ఆసరా చేసుకుని కూటమి సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది.

అసెంబ్లీతో కూటమికి పూర్తి స్థాయి మద్దతు ఉన్నా… మండలిలో వైసీపీకి మెజారిటీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మండలిలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడితే… వైసీపీ అడ్డుకుని తీరుతుంది. దీంతో మండలి ఆమోదం అవసరం లేకుండానే ఈ తీర్మారాన్ని కేవలం అసెంబ్లీ ఆమోదంతో మాత్రమే కేంద్రానికి పంపాలని బాబు సర్కారు తీర్మానించింది. ఈ లెక్కన ఇకపై జగన్ సహా మరెవరు వచ్చినా రాజధానిని అమరావతి నుంచి తరలించడం దుస్సాధ్యమేనని చెప్పక తప్పదు.

This post was last modified on March 26, 2026 2:47 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Amaravati

Recent Posts

పాపం కాదు… బాగుంది ప్రయత్నం అనిపించాలి

తిరువీర్ అంటే రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు సుపరిచితుడే కానీ సెలెక్టివ్ గా థియేటర్లకు వెళ్లే వాళ్లకు మాత్రం కొంచెం…

1 hour ago

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…

2 hours ago

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…

3 hours ago

పవన్ భార్యకు కూడా చిరు అన్నయే…

​మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…

3 hours ago

‘ఉస్తాద్’కు లాస్ట్ ఛాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…

4 hours ago

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

4 hours ago