దర్శకుడు కొరటాల శివ టైం అంత బాగా నడుస్తున్నట్టు లేదు. ఆచార్య మానని గాయం చేసింది. డిజాస్టర్లు అందరికీ వస్తాయి కానీ దాని విషయంలో జరిగిన ప్రచారం మాములు డ్యామేజ్ చేయలేదు. సరే జరిగిందేదో జరిగిందనుకుని జూనియర్ ఎన్టీఆర్ దేవర ఛాన్స్ ఇచ్చాడు. అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వసూళ్ల లెక్కలు పక్కన పెడితే తారక్ కు పెద్ద విజయం ఖాతాలో వేసింది. కానీ సెకండాఫ్, ఓవరాల్ కంటెంట్ గురించి యునానిమస్ ప్రశంసలు రాలేదన్నది వాస్తవం.
దాని తర్వాత అదిగో ఇదిగో అంటూ దేవర 2 ముందుకు వెళ్లకుండా చేశారు. ఈలోగా వార్ 2 రిలీజ్ అయిపోయింది. డ్రాగన్ రెండు భాగాలతో వచ్చే ఏడాది రెడీ అవుతోంది. కానీ కొరటాలకు సీక్వెల్ కు సంబంధించిన గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. జూనియర్ బర్త్ డేకి దేవర 2 పోస్టర్ ఇవ్వకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. సరే అయితే అయ్యింది లెమ్మని కొరటాల మెల్లగా బాలకృష్ణను చేరి కథ చెప్పి ఒప్పించుకున్నారు. ఆ మధ్య గ్రాండ్ గా ఓపెనింగ్ జరిగిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ ప్రాజెక్టు అంత తొందరగా ముందుకు వెళ్లకపోవచ్చని అంటున్నారు. స్క్రిప్ట్ విషయంలో ఇంకా ఏకాభిప్రాయం రాలేదని, బాలయ్య పూర్తి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఇన్ సైడ్ టాక్. మరింత బెటర్ గా వచ్చేంత వరకు కొరటాల శివ మళ్ళీ పని కొనసాగిస్తారా లేక మొత్తానికే ఆగిపోతుందా అనే డిస్కషన్ ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. గతంలో అల్లు అర్జున్ సినిమా ప్రకటన స్టేజి దాటిపోయాక ఆగిపోయిన సంగతి అభిమానులకు గుర్తే.
మరి బాలయ్య 112 ఏమవుతుందో ఇంకొద్ది రోజులు వేచి చూడాలి. గోపిచండ్ మలినేని షూటింగ్ లో గాయపడి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్య కొన్ని కథలు వింటున్నారట. అనిల్ రావిపూడి కూడా లైన్ లో ఉన్నప్పటికీ స్టోరీ పక్కాగా కుదిరి, భగవంత్ కేసరిని మించేలా ఉంటేనే సెట్స్ మీద వెళ్తారట. ఆదిత్య 999 మ్యాక్స్ తో పాటు మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన అప్డేట్ ఏదైనా ఇస్తారేమోనని నందమూరి అభిమానులు వెయిట్ చేస్తూనే ఉన్నారు. చూడాలి మరి.
This post was last modified on August 17, 2026 4:27 pm
విశ్వనాథ్ అండ్ సన్స్ తో దర్శకుడు వెంకీ అట్లూరి దిగ్విజయంగా హ్యాట్రిక్ పూర్తి చేశారు. ఇంత స్థిరంగా బ్యాక్ టు…
లోకేష్ కనగరాజ్ హీరోగా వచ్చిన 'డీసీ' సినిమాకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఆగస్టు 7న రిలీజైన…
ఓటిటిలు ఇంత విస్తృతంగా పెరిగిన తర్వాత ఏదైనా హిట్ సినిమాని రీమేక్ చేయాలంటే సంవత్సరాలు కాకుండా నెలల్లోనే పూర్తి చేయాలి.…
మల్లారెడ్డి విద్యాసంస్థలను ఏపీకి కూడా విస్తరించారు మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి. తిరుపతిలో మల్లారెడ్డి…
డబ్బు, బంగారం కోసం ఓ తల్లి తన మైనర్ కొడుకును హత్యలకు ప్రేరేపించిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. సిద్దిపేట…
సూర్యకు ఈ ఏడాది బాగానే కలిసి వస్తోంది. ‘వీరభద్రుడు’ తర్వాత ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా మంచి రన్లో…