సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది అన్న విషయాల గురించి పంచాంగకర్తలు చెబుతుంటారు. ఇదే మాదిరిగా ఓ పంచాంగ శ్రవణం సందర్భంగా ఒక పంచాంగ కర్త చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ పంచాంగ శ్రవణం సందర్భంగా పంచాంగకర్త పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచి వారిని తిట్టడం, దేవతలను నిందించడం, గోవులను, బ్రాహ్మణులను, ధర్మాన్ని నిందించడం వంటివి చేసేవారికి హింస తప్పదట. వాళ్లకు పరాభవం జరుగుతుందట.
అందుకే, మౌనం మంచిదని, మైకులిచ్చినా ఎక్కువగా కాకుండా తక్కువగా మాట్లాడకుంటే రాజకీయ నాయకులకు పరాభవం తప్పదట. ఇక, యూట్యూబుల్లో వ్యూస్ కోసం, వాటి కోసం పిచ్చి పిచ్చి థంబ్ నెెయిల్స్ పెట్టి సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెట్టేవారికి పరాభవం తప్పదని ఆ పంచాగకర్త సెలవిచ్చిన వీడియో వైరల్ అయింది.
ఇక, ఈ సంవత్సరం…భారత దేశంలో పరిపాలనలో న్యాయస్థానాల జోక్యం విపరీతమవుతుందట. కొన్ని చట్టాల మీద బహిరంగ చర్చ, వాటికి న్యాయస్థానాల వత్తాసు విరివిగా ఉంటుందట. అంతర్జాతీయ న్యాయ వేదికపై భారత దేశం తిరుగులేని ముద్ర చూపుతుందట. అంతేకాదు, ఇతర దేశాలకు భారత దేశం పరాభవం చేసే సంవత్సరం ఈ పరాభవ నామ సంవత్సరం అని ఆ పంచాంగ కర్త చెప్పారు.
This post was last modified on March 19, 2026 4:57 pm
శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…
ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా…
ఇండస్ట్రీ, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న క్షణం పెద్ది అనౌన్స్ మెంట్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచం మొత్తం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాటజీకి తెరదీశారు. త్వరలోనే జిల్లాల విభజన చేయనున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను కస్టడీలో హింసించారని.. దీంతో తనకు…
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…