Political News

బ్యాలెట్ పేపరుపై ఒకే పేరు.. ఒకే అభ్యర్థి.. 99.93 శాతం ఓటింగ్!

ఇదేదో చిత్రంగా ఉంది కదా! అనుకుంటున్నారా? కానీ నిజమే. ఎక్కడైనా ఎన్నికలు జరిగితే కనీసం ఒక స్థానానికి ఇద్దరైనా పోటీ చేస్తారు. కానీ అక్కడ మాత్రం ఒకే అభ్యర్థి, ఒకే పేరు. ఓటు వేసేది మాత్రం ప్రజలు. చేసేది ఏముంది.. అదే పేరుకే, అదే నాయకుడికే ఓటేయాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే ఉత్తర కొరియా పరిస్థితి.

ఉత్తర కొరియా అంటేనే నియంత పాలన గుర్తుకు వస్తుంది. అక్కడి నాయకుడు కిమ్ జోంగ్ ఉన్. గత పదేళ్లుగా దేశాన్ని కఠిన నియంత్రణలో నడిపిస్తున్న ఆయన, ఈ నెల 15న దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష పదవితో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్వహించారు.

ఎన్నికలు అంటే పోటీ సహజం. కానీ ఇక్కడ మాత్రం ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీ చేశాడు. ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ విధానాన్ని ఉపయోగించారు. అర్హులైన ఓటర్లు తప్పనిసరిగా ఓటు వేయాలని ఆదేశించారు.

ఫలితంగా ప్రజలు క్యూలలో నిలబడి ఓటేశారు. మొత్తం ప్రక్రియ కేవలం 4 గంటల్లోనే పూర్తయింది. కిమ్ జోంగ్ ఉన్‌కు 99.93 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన మళ్లీ అధ్యక్షుడిగా ప్రకటించారు.

మిగిలిన 0.07 శాతం ఓటు వేయని వారిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంట్‌లోని 687 స్థానాలను కూడా అధికార వర్కర్స్ పార్టీ కైవసం చేసుకుంది.

Satya

Recent Posts

అబ్బవరం స్టోరీకి శకునాలు బాగున్నాయి

వచ్చే వారం జూలై 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద క్రమంగా పాజిటివ్ బజ్ పెరుగుతోంది. టీమ్…

27 minutes ago

నాగవంశీ 100 కోట్ల కోరిక తీరుతుందా

లెనిన్ సక్సెస్ మీట్ గుంటూరులో ఘనంగా జరిగింది. దశాబ్దంకు పైగా ఎదురు చూసిన విజయం కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున…

2 hours ago

ల‌వ్ జిహాద్ ఆరోప‌ణ‌లు… భార్య మతమేంటో చెప్పిన ఆమిర్ ఖాన్

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి వ్య‌వ‌హారం ఇటీవ‌ల చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. మొద‌ట 80వ…

3 hours ago

ఆంధ్రా సర్ ఆర్ధర్ ‘కాటన్’ చంద్రబాబు!

నదుల అనుసంధానం….ఈ మాట టీడీపీ అధినేత నారా చంద్రబాబు నోటి వెంట కొన్ని వందల సార్లు విని ఉంటాం. ప్రాక్టికల్…

3 hours ago

టాలీవుడ్ అలెర్ట్… AIని కంట్రోల్ చేయాలి

ఇటీవలే రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ AI వల్ల భవిష్యత్తులో సినిమా పరిశ్రమ మీద పడబోయే తీవ్ర ప్రభావం…

3 hours ago

ఏడాది తర్వాత… అటు జగన్, ఇటు కేటీఆర్ !

మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…

5 hours ago