ఇదేదో చిత్రంగా ఉంది కదా! అనుకుంటున్నారా? కానీ నిజమే. ఎక్కడైనా ఎన్నికలు జరిగితే కనీసం ఒక స్థానానికి ఇద్దరైనా పోటీ చేస్తారు. కానీ అక్కడ మాత్రం ఒకే అభ్యర్థి, ఒకే పేరు. ఓటు వేసేది మాత్రం ప్రజలు. చేసేది ఏముంది.. అదే పేరుకే, అదే నాయకుడికే ఓటేయాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే ఉత్తర కొరియా పరిస్థితి.
ఉత్తర కొరియా అంటేనే నియంత పాలన గుర్తుకు వస్తుంది. అక్కడి నాయకుడు కిమ్ జోంగ్ ఉన్. గత పదేళ్లుగా దేశాన్ని కఠిన నియంత్రణలో నడిపిస్తున్న ఆయన, ఈ నెల 15న దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష పదవితో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్వహించారు.
ఎన్నికలు అంటే పోటీ సహజం. కానీ ఇక్కడ మాత్రం ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీ చేశాడు. ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ విధానాన్ని ఉపయోగించారు. అర్హులైన ఓటర్లు తప్పనిసరిగా ఓటు వేయాలని ఆదేశించారు.
ఫలితంగా ప్రజలు క్యూలలో నిలబడి ఓటేశారు. మొత్తం ప్రక్రియ కేవలం 4 గంటల్లోనే పూర్తయింది. కిమ్ జోంగ్ ఉన్కు 99.93 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన మళ్లీ అధ్యక్షుడిగా ప్రకటించారు.
మిగిలిన 0.07 శాతం ఓటు వేయని వారిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంట్లోని 687 స్థానాలను కూడా అధికార వర్కర్స్ పార్టీ కైవసం చేసుకుంది.
This post was last modified on March 19, 2026 11:06 pm
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…
నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…