Trends

టీమ్ ఇండియా విజయం వెనుక కన్నీటి గాథలు

దేశం మొత్తం టీ20 ప్రపంచకప్ విజయాన్ని సంబరంగా జరుపుకుంటున్న వేళ, ఆ గెలుపు వెనుక కొందరు ఆటగాళ్లు అనుభవించిన గుండెకోత ఇప్పుడు అందరిని కలచివేస్తోంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, రింకు సింగ్ తమ కుటుంబాల్లో ఎదురైన తీరని విషాదాన్ని పక్కన పెట్టి దేశం కోసం మైదానంలోకి దిగారు. వ్యక్తిగత బాధను దిగమింగుకొని జట్టు ప్రయోజనాల కోసం వారు ప్రదర్శించిన తెగువ ప్రతి క్రికెట్ అభిమానిని కంటతడి పెట్టిస్తోంది. ఆటపై ఉన్న అంకితభావం ఎంతటి కష్టానైనా ఓర్చి పోరాడేలా చేస్తుందని వీరు నిరూపించారు.

విశ్వవిజేతగా నిలిచిన మరుసటి రోజే ఇషాన్ కిషన్ తన మనసులోని బాధను పంచుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌కు సరిగ్గా ఒకరోజు ముందే తన సోదరి, బావ రోడ్డు ప్రమాదంలో మరణించారనే వార్త అతన్ని కృంగదీసింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యాతో మాట్లాడిన ఇషాన్, జట్టును ముందుకు నడపడమే తన మొదటి బాధ్యత అని నిర్ణయించుకున్నాడు. ఆ కన్నీటిని దిగమింగుకుని ఫైనల్లో కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత విజయాన్ని తన సోదరి స్మృత్యర్థం అంకితమిచ్చాడు.

మరోవైపు యువ ఆటగాడు రింకు సింగ్ కూడా ఇటువంటి వేదననే అనుభవించాడు. టోర్నీ కొనసాగుతున్న సమయంలో రింకు తండ్రి ఖాన్‌చంద్ సింగ్ లివర్ క్యాన్సర్‌తో కన్నుమూశారు. తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే జట్టును వీడి ఇంటికి వెళ్ళిన రింకు, అంత్యక్రియలు ముగిసిన వెంటనే కేవలం రెండు రోజుల్లోనే తిరిగి జట్టుతో చేరాడు. తనను క్రికెటర్‌గా తీర్చిదిద్దడంలో తండ్రి పడిన శ్రమను గుర్తు చేసుకుంటూ, దేశానికి కప్పు అందించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని రింకు భావించాడు. ఆ మనోబలమే అతన్ని మైదానంలో నిలబెట్టింది.

ఈ టోర్నీలో ఇషాన్ కిషన్ ప్రదర్శన ఆల్ టైమ్ బెస్ట్ రికార్డ్ అని చెప్పవచ్చు. మొత్తం 9 మ్యాచ్‌లలో 317 పరుగులు చేసి టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. తన ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు వల్లే ఈ విజయం సాధ్యమైందని, అనవసర విషయాల గురించి అతిగా ఆలోచించడం మానేసి కేవలం ఆటపైనే దృష్టి పెట్టానని ఇషాన్ వివరించాడు. విరాట్ కోహ్లీ స్ఫూర్తితో తన బాధ్యతను నిర్వర్తించానని చెప్పాడు. ఫైనల్లో బ్యాటింగ్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ అద్భుతమైన క్యాచ్‌లు పట్టి కివీస్ కు బిగ్ షాక్ ఇచ్చాడు.

భారత్ ఈ ప్రపంచకప్‌ను గెలవడంలో ఆటగాళ్ల మానసిక స్థైర్యం ప్రధానం అని చెప్పవచ్చు. సంజూ శాంసన్ 89 పరుగులతో, అభిషేక్ శర్మ 52 పరుగులతో రాణించగా, బౌలింగ్‌లో బుమ్రా 4 వికెట్లతో మ్యాజిక్ చేశాడు. అయితే ఇషాన్, రింకు వంటి వారు పడిన మానసిక వేదనను తట్టుకుని రాణించడం అనేది ఈ విజయాన్ని మరింత ప్రత్యేకం చేసింది.

చివరికి భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి టైటిల్ గెలుచుకుంది. టైటిల్‌ను డిఫెండ్ చేసుకున్న మొదటి జట్టుగా, సొంత గడ్డపై కప్పు గెలిచిన ఆతిథ్య దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ ట్రోఫీ వెనుక ఆటగాళ్ల చెమటతో పాటు వారి కళ్లలోని కన్నీరు కూడా ఉందనేది వాస్తవం.

This post was last modified on March 9, 2026 4:21 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

2 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

2 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

3 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

3 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

3 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

4 hours ago