జగన్కు బలప్రదర్శనల మీద ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. జగన్ వెనుక సైతాన్ సైన్యం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సైన్యానికి లేదా ఆయన పార్టీ క్యాడర్కు ఇబ్బంది వస్తే తప్ప జగన్ బయటకు రారని ఆమె ఆరోపించారు.
రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రిలో కల్తీ పాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం షర్మిలా పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కల్తీ పాల ఘటనలో బాధితులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించకపోవడం దారుణమని అన్నారు.
ప్రజలకు సంబంధించిన సమస్యలపై ఆయనకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 11 ఏళ్లుగా అక్రమంగా డైరీ సంస్థ నడిచిన వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి కూడా బాధ్యతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. లైసెన్స్ లేకుండా 11 సంవత్సరాలుగా పాలు అమ్ముతున్నా ఫుడ్ సేఫ్టీ శాఖ తనిఖీలు చేయకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు.
రాష్ట్రంలో ప్రతిదీ కల్తీగా మారిపోయిందని షర్మిలా మండిపడ్డారు. పాలు, నెయ్యి, మద్యం, గుడ్లు, చికెన్ వంటి అనేక ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతోందని పేర్కొన్నారు. వరలక్ష్మి మిల్క్ వెండర్ 11 సంవత్సరాలుగా లైసెన్స్ లేకుండా పాలు అమ్ముతున్నాడని, అయినా ఎటువంటి తనిఖీలు జరగలేదని చెప్పారు.
పాలలో ఇథిలిన్ గ్లైకాల్ వంటి ప్రమాదకర రసాయనాలు కలవడంతో 11 మంది మరణించడం తీవ్ర విషాదమని అన్నారు. ప్రస్తుతం మరో 9 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని, కొందరు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఈ ఘటన తర్వాత నాలుగు రోజులు తనిఖీలు చేస్తున్నట్టు హడావిడి చేసి మళ్లీ యథావిధిగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు చేస్తే ఈ ఘటన జరిగేదే కాదని అన్నారు. అన్యం పుణ్యం ఎరగని సాధారణ ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…