జగన్కు బలప్రదర్శనల మీద ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. జగన్ వెనుక సైతాన్ సైన్యం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సైన్యానికి లేదా ఆయన పార్టీ క్యాడర్కు ఇబ్బంది వస్తే తప్ప జగన్ బయటకు రారని ఆమె ఆరోపించారు.
రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రిలో కల్తీ పాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం షర్మిలా పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కల్తీ పాల ఘటనలో బాధితులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించకపోవడం దారుణమని అన్నారు.
ప్రజలకు సంబంధించిన సమస్యలపై ఆయనకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 11 ఏళ్లుగా అక్రమంగా డైరీ సంస్థ నడిచిన వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి కూడా బాధ్యతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. లైసెన్స్ లేకుండా 11 సంవత్సరాలుగా పాలు అమ్ముతున్నా ఫుడ్ సేఫ్టీ శాఖ తనిఖీలు చేయకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు.
రాష్ట్రంలో ప్రతిదీ కల్తీగా మారిపోయిందని షర్మిలా మండిపడ్డారు. పాలు, నెయ్యి, మద్యం, గుడ్లు, చికెన్ వంటి అనేక ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతోందని పేర్కొన్నారు. వరలక్ష్మి మిల్క్ వెండర్ 11 సంవత్సరాలుగా లైసెన్స్ లేకుండా పాలు అమ్ముతున్నాడని, అయినా ఎటువంటి తనిఖీలు జరగలేదని చెప్పారు.
పాలలో ఇథిలిన్ గ్లైకాల్ వంటి ప్రమాదకర రసాయనాలు కలవడంతో 11 మంది మరణించడం తీవ్ర విషాదమని అన్నారు. ప్రస్తుతం మరో 9 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని, కొందరు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఈ ఘటన తర్వాత నాలుగు రోజులు తనిఖీలు చేస్తున్నట్టు హడావిడి చేసి మళ్లీ యథావిధిగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు చేస్తే ఈ ఘటన జరిగేదే కాదని అన్నారు. అన్యం పుణ్యం ఎరగని సాధారణ ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
This post was last modified on March 9, 2026 8:02 pm
ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…
వైసీపీ అధినేత జగన్ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ..…
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…