Political News

జగన్ పరామర్శలు.. సైతాన్ సైన్యం కోసమైనా?

జగన్‌కు బలప్రదర్శనల మీద ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. జగన్ వెనుక సైతాన్ సైన్యం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సైన్యానికి లేదా ఆయన పార్టీ క్యాడర్‌కు ఇబ్బంది వస్తే తప్ప జగన్ బయటకు రారని ఆమె ఆరోపించారు.

రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రిలో కల్తీ పాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం షర్మిలా పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కల్తీ పాల ఘటనలో బాధితులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించకపోవడం దారుణమని అన్నారు.

ప్రజలకు సంబంధించిన సమస్యలపై ఆయనకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 11 ఏళ్లుగా అక్రమంగా డైరీ సంస్థ నడిచిన వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి కూడా బాధ్యతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. లైసెన్స్ లేకుండా 11 సంవత్సరాలుగా పాలు అమ్ముతున్నా ఫుడ్ సేఫ్టీ శాఖ తనిఖీలు చేయకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు.

రాష్ట్రంలో ప్రతిదీ కల్తీగా మారిపోయిందని షర్మిలా మండిపడ్డారు. పాలు, నెయ్యి, మద్యం, గుడ్లు, చికెన్ వంటి అనేక ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతోందని పేర్కొన్నారు. వరలక్ష్మి మిల్క్ వెండర్ 11 సంవత్సరాలుగా లైసెన్స్ లేకుండా పాలు అమ్ముతున్నాడని, అయినా ఎటువంటి తనిఖీలు జరగలేదని చెప్పారు.

పాలలో ఇథిలిన్ గ్లైకాల్ వంటి ప్రమాదకర రసాయనాలు కలవడంతో 11 మంది మరణించడం తీవ్ర విషాదమని అన్నారు. ప్రస్తుతం మరో 9 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని, కొందరు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారని తెలిపారు.

ఈ ఘటన తర్వాత నాలుగు రోజులు తనిఖీలు చేస్తున్నట్టు హడావిడి చేసి మళ్లీ యథావిధిగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు చేస్తే ఈ ఘటన జరిగేదే కాదని అన్నారు. అన్యం పుణ్యం ఎరగని సాధారణ ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

This post was last modified on March 9, 2026 8:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

33 minutes ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

2 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

3 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

5 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

10 hours ago

మోడీపై సీనియర్ నటుడి ఊహించ‌ని ఎలివేషన్

సినిమా వాళ్ల‌కు రాజ‌కీయ ఆస‌క్తులు, అభిమానాలు ఉండ‌డం కొత్త కాదు. అందులో త‌ప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజ‌కీయాల…

10 hours ago