Political News

జగన్ పరామర్శలు.. సైతాన్ సైన్యం కోసమైనా?

జగన్‌కు బలప్రదర్శనల మీద ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. జగన్ వెనుక సైతాన్ సైన్యం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సైన్యానికి లేదా ఆయన పార్టీ క్యాడర్‌కు ఇబ్బంది వస్తే తప్ప జగన్ బయటకు రారని ఆమె ఆరోపించారు.

రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రిలో కల్తీ పాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం షర్మిలా పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కల్తీ పాల ఘటనలో బాధితులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించకపోవడం దారుణమని అన్నారు.

ప్రజలకు సంబంధించిన సమస్యలపై ఆయనకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 11 ఏళ్లుగా అక్రమంగా డైరీ సంస్థ నడిచిన వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి కూడా బాధ్యతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. లైసెన్స్ లేకుండా 11 సంవత్సరాలుగా పాలు అమ్ముతున్నా ఫుడ్ సేఫ్టీ శాఖ తనిఖీలు చేయకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు.

రాష్ట్రంలో ప్రతిదీ కల్తీగా మారిపోయిందని షర్మిలా మండిపడ్డారు. పాలు, నెయ్యి, మద్యం, గుడ్లు, చికెన్ వంటి అనేక ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతోందని పేర్కొన్నారు. వరలక్ష్మి మిల్క్ వెండర్ 11 సంవత్సరాలుగా లైసెన్స్ లేకుండా పాలు అమ్ముతున్నాడని, అయినా ఎటువంటి తనిఖీలు జరగలేదని చెప్పారు.

పాలలో ఇథిలిన్ గ్లైకాల్ వంటి ప్రమాదకర రసాయనాలు కలవడంతో 11 మంది మరణించడం తీవ్ర విషాదమని అన్నారు. ప్రస్తుతం మరో 9 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని, కొందరు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారని తెలిపారు.

ఈ ఘటన తర్వాత నాలుగు రోజులు తనిఖీలు చేస్తున్నట్టు హడావిడి చేసి మళ్లీ యథావిధిగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు చేస్తే ఈ ఘటన జరిగేదే కాదని అన్నారు. అన్యం పుణ్యం ఎరగని సాధారణ ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

Kumar

Recent Posts

ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ‘ది ఒడిస్సీ’

ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…

58 minutes ago

‘ఎన్టీఆర్ పేరుతో ప్రెస్ నోట్… సంతకం ఎక్కడ?’

ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల వ్య‌వ‌హారం ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి…

1 hour ago

అనుకూలమైన తీర్పు కోసం జడ్జి కుర్చీపైనే చేతబడి…!

న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…

1 hour ago

త్రివిక్రమ్ కోసం బ్రేస్‌లెట్ తాకట్టు

సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…

2 hours ago

ఏం పాపం చేశారని… చిన్నారులనూ చిదిమేస్తున్నారు

ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…

2 hours ago

రాయ‌ల‌సీమ‌కు మరో పేరు

రాయ‌లసీమ‌ను కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల సీమ‌గా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు త‌ర‌లి వ‌స్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…

2 hours ago