తమిళనాట సినీ, రాజకీయ రంగాల్లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన పేరు.. త్రిష.
ఈ సీనియర్ నటికి, రాజకీయాల్లోకి వచ్చిన అగ్ర కథానాయకుడు విజయ్కి మధ్య బంధం గురించి ఇటీవల ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. విజయ్ విడాకులకు త్రిషనే కారణమనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ.. ఇటీవల విజయ్, త్రిష కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరు కావడం చర్చనీయాంశం అయింది. దీంతో త్రిష మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా ట్రోలింగ్ కూడా గట్టిగా జరుగుతోంది.
ఇలాంటి టైంలోనే సీనియర్ నటుడు, దర్శకుడు పార్తీబన్.. ఒక సినీ వేడుకలో త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. స్టేజ్ మీద ఆయన మాట్లాడుతుండగా.. వెనుక ఉన్న స్క్రీన్ మీద త్రిష ఫొటో డిస్ప్లే అయింది. త్రిషను ఉద్దేశించి పార్తీబన్ మాట్లాడుతూ.. ‘‘ఆమె కొన్ని రోజులు ఇంట్లోనే ఉండడం మంచిది. ఆమె బయటికి వస్తే లేని పోని సమస్యలు వస్తున్నాయి’’ అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లతో ఆడిటోరియం హోరెత్తింది.
ఐతే ఈ వ్యాఖ్యలపై త్రిష మండిపడింది. చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కామెడీ అవ్వదు, మూర్ఖత్వమే అవుతుందని వ్యాఖ్యానించింది. విజయ్, త్రిష ఫ్యాన్స్ కూడా పార్తీబన్ను ఎటాక్ చేశారు. ఈ నేపథ్యంలో పార్తీబన్ స్పందించారు. తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జరిగిందంతా తప్పుగా భావిస్తున్నారని.. అలాంటపుడు తనకు క్షమాపణలు చెప్పడం తప్ప వేరే మార్గం లేదని పార్తీబన్ పేర్కొన్నారు. అంతటితో ఈ వ్యవహారం సద్దుమణిగినట్లయింది.
రేపు విడుదల కాబోతున్న నాగబంధంకు ఇవాళ హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్ వేస్తున్నారు. దీంతో పాటే రిలీజవుతున్న రావు బహదూర్…
తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతల మధ్య గత కొన్ని రోజులుగా సాగుతున్న…
వైసీపీ అధినేత జగన్ చేసిన మావిగన్ ప్రకటన దరిమిలా.. అమరావతిపై మరింత ఆసక్తి పెరిగింది. గూగుల్లో అమరావతి రాజధానిపై బుధవారం…
ఆరు నెలల నుంచి నిర్మాత ఆఫీస్ లో సెన్సార్ చిక్కుల్లో మగ్గిపోతున్న జన నాయకుడు ఎట్టకేలకు సర్టిఫికెట్ దక్కించుకుందని చెన్నై…
2026 ఆరు నెలలు గడిచిపోయాయి. టాలీవుడ్ వరకు చూసుంటే కనీసం సూపర్ హిట్లని చెప్పుకునేవి పది సినిమాలు లేకపోవడం కొంత…
ఉత్తరప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత అయోధ్య బాల రామయ్యకు భక్తులు సమర్పించిన కానుకల దోపిడీ వ్యవహారంలో కీలక విషయం వెలుగు చూసింది.…