తమిళనాట సినీ, రాజకీయ రంగాల్లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన పేరు.. త్రిష.
ఈ సీనియర్ నటికి, రాజకీయాల్లోకి వచ్చిన అగ్ర కథానాయకుడు విజయ్కి మధ్య బంధం గురించి ఇటీవల ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. విజయ్ విడాకులకు త్రిషనే కారణమనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ.. ఇటీవల విజయ్, త్రిష కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరు కావడం చర్చనీయాంశం అయింది. దీంతో త్రిష మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా ట్రోలింగ్ కూడా గట్టిగా జరుగుతోంది.
ఇలాంటి టైంలోనే సీనియర్ నటుడు, దర్శకుడు పార్తీబన్.. ఒక సినీ వేడుకలో త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. స్టేజ్ మీద ఆయన మాట్లాడుతుండగా.. వెనుక ఉన్న స్క్రీన్ మీద త్రిష ఫొటో డిస్ప్లే అయింది. త్రిషను ఉద్దేశించి పార్తీబన్ మాట్లాడుతూ.. ‘‘ఆమె కొన్ని రోజులు ఇంట్లోనే ఉండడం మంచిది. ఆమె బయటికి వస్తే లేని పోని సమస్యలు వస్తున్నాయి’’ అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లతో ఆడిటోరియం హోరెత్తింది.
ఐతే ఈ వ్యాఖ్యలపై త్రిష మండిపడింది. చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కామెడీ అవ్వదు, మూర్ఖత్వమే అవుతుందని వ్యాఖ్యానించింది. విజయ్, త్రిష ఫ్యాన్స్ కూడా పార్తీబన్ను ఎటాక్ చేశారు. ఈ నేపథ్యంలో పార్తీబన్ స్పందించారు. తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జరిగిందంతా తప్పుగా భావిస్తున్నారని.. అలాంటపుడు తనకు క్షమాపణలు చెప్పడం తప్ప వేరే మార్గం లేదని పార్తీబన్ పేర్కొన్నారు. అంతటితో ఈ వ్యవహారం సద్దుమణిగినట్లయింది.
This post was last modified on March 9, 2026 4:08 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…