Trends

భారత్, ఇంగ్లాండ్ సెమీస్ రద్దయితే…

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ఒకవేళ వర్షం కారణంగా రద్దయితే పరిస్థితి ఏంటనేది అందరిలో ఉన్న డౌట్. ప్రస్తుతం ముంబై వాతావరణం అయితే అనుకూలంగానే ఉంది. వర్షం పడే అవకాశాలు తక్కువే. ఒకవేళ వాతావరణం సహకరించకుంటే మాత్రం దానిపై టోర్నీ నిబంధనలు క్లియర్‌గా ఉన్నాయి. ఆట సాధ్యం కాని పక్షంలో టీమ్ ఇండియాకు నిరాశ తప్పదు.

సూపర్ 8 పాయింట్ల పట్టికలో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. టేబుల్ టాపర్లకు ఉండే వెయిటేజీ ఇక్కడ ఇంగ్లాండ్‌కు ప్లస్ కానుంది. ఈ మెగా ఫైట్ కోసం ఇప్పటికే ఒక రిజర్వ్ డేని కేటాయించారు. ఒకవేళ నిర్ణీత రోజున ఫలితం తేలకపోతే మరుసటి రోజున ఆటను పూర్తి చేస్తారు. మ్యాచ్ నిర్వహణ కోసం గురువారం అదనంగా 90 నిమిషాలు, శుక్రవారం 120 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది.

కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉన్నా ఆడిస్తారు. అప్పటికీ ఫలితం రాకపోతేనే సూపర్ 8 పాయింట్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. సూపర్ 8 గ్రూప్ స్టేజ్‌లో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. భారత్ మాత్రం రెండు విజయాలు సాధించి రెండో స్థానంలో ఉంది. ఒకవేళ రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు రద్దయితే, తమ గ్రూప్‌లలో టాప్ ప్లేస్‌లో ఉన్న ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు ఫైనల్‌లో తలపడతాయి. అంటే గ్రూప్ దశలో మెరుగైన ఆటతీరు కనబరిచిన జట్లకు ఇలాంటి సమయంలో అదనపు ప్రయోజనం లభిస్తుంది.

గత రికార్డులు చూస్తే భారత్, ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ పోరు ఎప్పుడూ ఉత్కంఠగానే సాగుతోంది. 2022లో ఇంగ్లాండ్ గెలిచి ఛాంపియన్‌గా నిలిస్తే, 2024లో భారత్ విజయం సాధించి కప్ కైవసం చేసుకుంది. విచిత్రంగా గత రెండు సార్లు ఈ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్‌లో ఎవరు గెలిస్తే వారే వరల్డ్ కప్ కొడుతున్నారు. ఈ సారి కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అందుకే మ్యాచ్ రద్దయి నిబంధనల ప్రకారం కాకుండా, మైదానంలో ఆట ద్వారా ఫలితం రావాలని కోరుకుంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా సూపర్ 8లో వెస్టిండీస్‌పై ఘనవిజయంతో సెమీస్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టేందుకు ఆటగాళ్లంతా పవర్ఫుల్ ఫామ్ తో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇంగ్లాండ్ మొదట వీక్ గానే కనిపించినా తెలివిగా ఆడుతూ సెమీస్ కు చేరింది.

This post was last modified on March 3, 2026 2:17 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Ind Vs Eng

Recent Posts

జగన్ అన్నా క్యాంటీన్లను తీసేసింది అందుకేనా?

వైసీపీ హ‌యాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జ‌గ‌న్‌.. పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం కూడా పెట్ట‌లేక పోయార‌ని సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు.…

1 hour ago

అమరావతిపై ఇంత విషమేంటి నాని గారు?

ఏపీ రాజ‌ధాని అమ‌రావతిపై వైసీపీ నాయ‌కులు అదే అక్క‌సు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రాజ‌ధానిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన…

2 hours ago

లాయర్ అవతారమెత్తిన రాజు గారు

కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…

2 hours ago

ఎట్టకేలకు వర్మ త్యాగానికి ఫలితం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…

3 hours ago

జోష్ తగ్గింది జగన్

వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…

3 hours ago

టీడీపీలో లోకేష్ శ‌కం… ఇక కథ వేరుంటది

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…

3 hours ago