Trends

భారత్, ఇంగ్లాండ్ సెమీస్ రద్దయితే…

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ఒకవేళ వర్షం కారణంగా రద్దయితే పరిస్థితి ఏంటనేది అందరిలో ఉన్న డౌట్. ప్రస్తుతం ముంబై వాతావరణం అయితే అనుకూలంగానే ఉంది. వర్షం పడే అవకాశాలు తక్కువే. ఒకవేళ వాతావరణం సహకరించకుంటే మాత్రం దానిపై టోర్నీ నిబంధనలు క్లియర్‌గా ఉన్నాయి. ఆట సాధ్యం కాని పక్షంలో టీమ్ ఇండియాకు నిరాశ తప్పదు.

సూపర్ 8 పాయింట్ల పట్టికలో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. టేబుల్ టాపర్లకు ఉండే వెయిటేజీ ఇక్కడ ఇంగ్లాండ్‌కు ప్లస్ కానుంది. ఈ మెగా ఫైట్ కోసం ఇప్పటికే ఒక రిజర్వ్ డేని కేటాయించారు. ఒకవేళ నిర్ణీత రోజున ఫలితం తేలకపోతే మరుసటి రోజున ఆటను పూర్తి చేస్తారు. మ్యాచ్ నిర్వహణ కోసం గురువారం అదనంగా 90 నిమిషాలు, శుక్రవారం 120 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది.

కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉన్నా ఆడిస్తారు. అప్పటికీ ఫలితం రాకపోతేనే సూపర్ 8 పాయింట్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. సూపర్ 8 గ్రూప్ స్టేజ్‌లో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. భారత్ మాత్రం రెండు విజయాలు సాధించి రెండో స్థానంలో ఉంది. ఒకవేళ రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు రద్దయితే, తమ గ్రూప్‌లలో టాప్ ప్లేస్‌లో ఉన్న ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు ఫైనల్‌లో తలపడతాయి. అంటే గ్రూప్ దశలో మెరుగైన ఆటతీరు కనబరిచిన జట్లకు ఇలాంటి సమయంలో అదనపు ప్రయోజనం లభిస్తుంది.

గత రికార్డులు చూస్తే భారత్, ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ పోరు ఎప్పుడూ ఉత్కంఠగానే సాగుతోంది. 2022లో ఇంగ్లాండ్ గెలిచి ఛాంపియన్‌గా నిలిస్తే, 2024లో భారత్ విజయం సాధించి కప్ కైవసం చేసుకుంది. విచిత్రంగా గత రెండు సార్లు ఈ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్‌లో ఎవరు గెలిస్తే వారే వరల్డ్ కప్ కొడుతున్నారు. ఈ సారి కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అందుకే మ్యాచ్ రద్దయి నిబంధనల ప్రకారం కాకుండా, మైదానంలో ఆట ద్వారా ఫలితం రావాలని కోరుకుంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా సూపర్ 8లో వెస్టిండీస్‌పై ఘనవిజయంతో సెమీస్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టేందుకు ఆటగాళ్లంతా పవర్ఫుల్ ఫామ్ తో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇంగ్లాండ్ మొదట వీక్ గానే కనిపించినా తెలివిగా ఆడుతూ సెమీస్ కు చేరింది.

This post was last modified on March 3, 2026 2:17 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Ind Vs Eng

Recent Posts

దారి తప్పుతున్న కంటెంట్లు – ఎవరు బాధ్యులు

ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…

6 minutes ago

మళ్ళీ అలా.. ఛాన్స్ వస్తే..

అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్‌లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్‌ని రివర్స్‌లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…

36 minutes ago

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

5 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

7 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

14 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

15 hours ago