Trends

భారత్, ఇంగ్లాండ్ సెమీస్ రద్దయితే…

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ఒకవేళ వర్షం కారణంగా రద్దయితే పరిస్థితి ఏంటనేది అందరిలో ఉన్న డౌట్. ప్రస్తుతం ముంబై వాతావరణం అయితే అనుకూలంగానే ఉంది. వర్షం పడే అవకాశాలు తక్కువే. ఒకవేళ వాతావరణం సహకరించకుంటే మాత్రం దానిపై టోర్నీ నిబంధనలు క్లియర్‌గా ఉన్నాయి. ఆట సాధ్యం కాని పక్షంలో టీమ్ ఇండియాకు నిరాశ తప్పదు.

సూపర్ 8 పాయింట్ల పట్టికలో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. టేబుల్ టాపర్లకు ఉండే వెయిటేజీ ఇక్కడ ఇంగ్లాండ్‌కు ప్లస్ కానుంది. ఈ మెగా ఫైట్ కోసం ఇప్పటికే ఒక రిజర్వ్ డేని కేటాయించారు. ఒకవేళ నిర్ణీత రోజున ఫలితం తేలకపోతే మరుసటి రోజున ఆటను పూర్తి చేస్తారు. మ్యాచ్ నిర్వహణ కోసం గురువారం అదనంగా 90 నిమిషాలు, శుక్రవారం 120 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది.

కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉన్నా ఆడిస్తారు. అప్పటికీ ఫలితం రాకపోతేనే సూపర్ 8 పాయింట్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. సూపర్ 8 గ్రూప్ స్టేజ్‌లో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. భారత్ మాత్రం రెండు విజయాలు సాధించి రెండో స్థానంలో ఉంది. ఒకవేళ రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు రద్దయితే, తమ గ్రూప్‌లలో టాప్ ప్లేస్‌లో ఉన్న ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు ఫైనల్‌లో తలపడతాయి. అంటే గ్రూప్ దశలో మెరుగైన ఆటతీరు కనబరిచిన జట్లకు ఇలాంటి సమయంలో అదనపు ప్రయోజనం లభిస్తుంది.

గత రికార్డులు చూస్తే భారత్, ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ పోరు ఎప్పుడూ ఉత్కంఠగానే సాగుతోంది. 2022లో ఇంగ్లాండ్ గెలిచి ఛాంపియన్‌గా నిలిస్తే, 2024లో భారత్ విజయం సాధించి కప్ కైవసం చేసుకుంది. విచిత్రంగా గత రెండు సార్లు ఈ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్‌లో ఎవరు గెలిస్తే వారే వరల్డ్ కప్ కొడుతున్నారు. ఈ సారి కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అందుకే మ్యాచ్ రద్దయి నిబంధనల ప్రకారం కాకుండా, మైదానంలో ఆట ద్వారా ఫలితం రావాలని కోరుకుంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా సూపర్ 8లో వెస్టిండీస్‌పై ఘనవిజయంతో సెమీస్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టేందుకు ఆటగాళ్లంతా పవర్ఫుల్ ఫామ్ తో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇంగ్లాండ్ మొదట వీక్ గానే కనిపించినా తెలివిగా ఆడుతూ సెమీస్ కు చేరింది.

This post was last modified on March 3, 2026 2:17 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Ind Vs Eng

Recent Posts

కూట‌మి స‌ర్కారులో కోవ‌ర్టులు.. బాబు ఆరా!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వంలో వైసీపీ కోవ‌ర్టులు ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అయితే.. రాజ‌కీయంగా కాదు.. అధికారికంగా.. ప‌లువురు…

36 minutes ago

యష్ మీద ఒత్తిడి పెరుగుతోంది

తెలుగు, తమిళంతో పోలిస్తే మార్కెట్, బడ్జెట్ పరంగా వెనుకబడి ఉన్న కన్నడ పరిశ్రమను ఒకేసారి పది మెట్లు ఎక్కించిన సినిమా…

3 hours ago

వాహ్ పవన్.. వన్య ప్రాణులకు అంబులెన్సులు

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని అటవీ…

4 hours ago

బుచ్చిబాబు రెహమాన్ మళ్ళీ పేల్చేశారు

టాలీవుడ్ స్టార్ హీరోలందరిలోనూ ఒక ఎనర్జీ ఉంటుంది. దాన్ని సరిగ్గా వాడుకోవడం తెలిసిన దర్శకులే అద్భుతాలు చేస్తారు. సుకుమార్ చూపించబట్టే…

4 hours ago

స్వామివారి చెంతనా మీ కీచులాట?

దైవ కార్యక్రమాలు భక్తి, శ్రద్ధలకు ప్రతీకలు కావాలి. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది సంప్రదాయబద్ధంగా, ఆచార నియమాలకు అనుగుణంగా…

4 hours ago

అనుదీప్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదెవరు?

టాలీవుడ్‌లో ఒక వెరైటీ కామెడీ టైమింగ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అనుదీప్ కేవీ. 'జాతిరత్నాలు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద…

4 hours ago