Political News

కూట‌మి స‌ర్కారులో కోవ‌ర్టులు.. బాబు ఆరా!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వంలో వైసీపీ కోవ‌ర్టులు ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అయితే.. రాజ‌కీయంగా కాదు.. అధికారికంగా.. ప‌లువురు ఉన్న‌తాధికారులు వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. తాజాగా మ‌రోసారి వీరి వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు రావ‌డం.. ఈ విష‌యం మీడియాలో పెద్ద ఎత్తున రావ‌డంతో సీఎం చంద్ర‌బాబు అలెర్ట‌య్యారు. స‌ద‌రు అధికారుల‌పై ఆరా తీశారు. ఏం జ‌రిగింది? అనే విష‌యాల‌ను చంద్ర‌బాబు తెలుసుకుంటున్నారు.

అస‌లు విష‌యం ఇదీ..

వైసీపీ హ‌యాంలో పేద‌ల‌కు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు జ‌గ‌న‌న్న ఇళ్ల కాల‌నీల పేరుతో ప‌థ‌కాన్ని తీసుకు వ‌చ్చారు. దీనిని మూడు ఫేజ్‌ల‌లో అమ‌లు చేశారు. డ‌బ్బులు లేక‌, ఇళ్లు క‌ట్టుకోలేని వారికి ప్ర‌భుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. దీంతో అధికారులు.. అప్ప‌టి వైసీపీ ఎమ్మెల్యేలు, కొంద‌రు మంత్రులు కుమ్మ‌క్క‌యి.. అవ‌స‌రానికి మించి ఇనుము, సిమెంటు, ఇత‌ర నిర్మాణ సామ‌గ్రిని వేల కోట్ల రూపాయ‌ల మేర‌కు కొనుగోలు చేశారు. వారు ఈ వ‌స్తువులు కొనుగోలు చేసే నాటికి ఇంటి స్థ‌లాల కేటాయింపే జ‌ర‌గ‌లేదు.

అయినా కూడా.. క‌మీష‌న్లు, ముడుపుల కోసం.. స‌ద‌రు కంపెనీల‌కు భారీ మొత్తంలో ఆర్డ‌ర్లు ఇచ్చారు. దీంతో ఆయా స‌రుకు మొత్తం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేష‌న్ కు జిల్లాల్లో ఉన్న గోడౌనులకు చేరిపోయింది. కానీ, ఎంత‌కీ.. ప‌నులు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో ఇనుము తుప్పుప‌ట్టింది. వేల బ‌స్తాల సిమెంటు రాళ్లుగా మారిపోయింది. దీనిపై కూటమి ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు రావ‌డంతో ప్ర‌భుత్వం విజిలెన్స్‌ను నియ‌మించి.. విచార‌ణ చేయించింది. ఈ క్ర‌మంలో జ‌రిగిన త‌తంగాన్ని విజిలెన్సు నివేదిక రూపంలో ఇచ్చింది.

ఈ క్ర‌మంలో స‌ద‌రు అక్ర‌మాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచిస్తూ.. సీఎం చంద్ర‌బాబు అధికారుల‌ను ఆదేశించారు. అయితే.. చ‌ర్య‌లు అంటే వారికి ఎలా అర్థ‌మైందో తెలియ‌దు కానీ.. అస‌లు కేసును నీరుగార్చేలా.. స‌ద‌రు తుప్పుప‌ట్టిన ఇనుమును, గ‌డ్డ‌లుగా మారిన సిమెంటును ఖాళీ చేసేయాల‌ని.. గోడౌనులను శుభ్రం చేసి తాళాలు వేయాల‌ని ఆదేశించారు. ఈ ప‌రిణామం.. స‌ర్కారుకు శ‌రాఘాతంగా మారింది.

అప్ప‌ట్లో వైసీపీ నాయ‌కుల‌తో కుమ్మ‌క్క‌యిన అధికారులు ఇలా ఆదేశించారంటూ.. వార్త‌లు రావ‌డంతో ఇప్పుడు.. చంద్ర‌బాబు అలెర్ట్ అయ్యారు. స‌ద‌రు అధికారుల వివ‌రాలు ఇవ్వాల‌ని ఆదేశించారు. వాస్త‌వానికి చ‌ర్య‌లు తీసుకోమంటే.. అప్ప‌ట్లో త‌ప్పులు చేసిన వారిని ప‌ట్టుకోవాల‌ని చంద్ర‌బాబు చెప్పారు. కానీ, దీనిని వ‌దిలేసి.. నాటి త‌ప్పులు మూసేసే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. 

Kumar

Recent Posts

థియేటర్ ప్రకటనలు ఆరోగ్యాన్ని భోదిస్తున్నాయి

ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…

7 minutes ago

రెచ్చగొడితే రచ్చే.. లంక బౌలర్లను ఉతికారేసిన వైభవ్!

పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…

40 minutes ago

రాందేవ్ బాబాకు ధీటుగా చంద్రబాబు

జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…

1 hour ago

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

2 hours ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

2 hours ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

4 hours ago