ఏపీలోని కూటమి ప్రభుత్వంలో వైసీపీ కోవర్టులు ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అయితే.. రాజకీయంగా కాదు.. అధికారికంగా.. పలువురు ఉన్నతాధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా మరోసారి వీరి వ్యవహారం చర్చకు రావడం.. ఈ విషయం మీడియాలో పెద్ద ఎత్తున రావడంతో సీఎం చంద్రబాబు అలెర్టయ్యారు. సదరు అధికారులపై ఆరా తీశారు. ఏం జరిగింది? అనే విషయాలను చంద్రబాబు తెలుసుకుంటున్నారు.
అసలు విషయం ఇదీ..
వైసీపీ హయాంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో పథకాన్ని తీసుకు వచ్చారు. దీనిని మూడు ఫేజ్లలో అమలు చేశారు. డబ్బులు లేక, ఇళ్లు కట్టుకోలేని వారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అధికారులు.. అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు కుమ్మక్కయి.. అవసరానికి మించి ఇనుము, సిమెంటు, ఇతర నిర్మాణ సామగ్రిని వేల కోట్ల రూపాయల మేరకు కొనుగోలు చేశారు. వారు ఈ వస్తువులు కొనుగోలు చేసే నాటికి ఇంటి స్థలాల కేటాయింపే జరగలేదు.
అయినా కూడా.. కమీషన్లు, ముడుపుల కోసం.. సదరు కంపెనీలకు భారీ మొత్తంలో ఆర్డర్లు ఇచ్చారు. దీంతో ఆయా సరుకు మొత్తం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కు జిల్లాల్లో ఉన్న గోడౌనులకు చేరిపోయింది. కానీ, ఎంతకీ.. పనులు చేపట్టకపోవడంతో ఇనుము తుప్పుపట్టింది. వేల బస్తాల సిమెంటు రాళ్లుగా మారిపోయింది. దీనిపై కూటమి ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విజిలెన్స్ను నియమించి.. విచారణ చేయించింది. ఈ క్రమంలో జరిగిన తతంగాన్ని విజిలెన్సు నివేదిక రూపంలో ఇచ్చింది.
ఈ క్రమంలో సదరు అక్రమాలపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ.. సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అయితే.. చర్యలు అంటే వారికి ఎలా అర్థమైందో తెలియదు కానీ.. అసలు కేసును నీరుగార్చేలా.. సదరు తుప్పుపట్టిన ఇనుమును, గడ్డలుగా మారిన సిమెంటును ఖాళీ చేసేయాలని.. గోడౌనులను శుభ్రం చేసి తాళాలు వేయాలని ఆదేశించారు. ఈ పరిణామం.. సర్కారుకు శరాఘాతంగా మారింది.
అప్పట్లో వైసీపీ నాయకులతో కుమ్మక్కయిన అధికారులు ఇలా ఆదేశించారంటూ.. వార్తలు రావడంతో ఇప్పుడు.. చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. సదరు అధికారుల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. వాస్తవానికి చర్యలు తీసుకోమంటే.. అప్పట్లో తప్పులు చేసిన వారిని పట్టుకోవాలని చంద్రబాబు చెప్పారు. కానీ, దీనిని వదిలేసి.. నాటి తప్పులు మూసేసే ప్రయత్నం చేయడం గమనార్హం.
This post was last modified on March 3, 2026 2:59 pm
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…