Political News

కూట‌మి స‌ర్కారులో కోవ‌ర్టులు.. బాబు ఆరా!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వంలో వైసీపీ కోవ‌ర్టులు ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అయితే.. రాజ‌కీయంగా కాదు.. అధికారికంగా.. ప‌లువురు ఉన్న‌తాధికారులు వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. తాజాగా మ‌రోసారి వీరి వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు రావ‌డం.. ఈ విష‌యం మీడియాలో పెద్ద ఎత్తున రావ‌డంతో సీఎం చంద్ర‌బాబు అలెర్ట‌య్యారు. స‌ద‌రు అధికారుల‌పై ఆరా తీశారు. ఏం జ‌రిగింది? అనే విష‌యాల‌ను చంద్ర‌బాబు తెలుసుకుంటున్నారు.

అస‌లు విష‌యం ఇదీ..

వైసీపీ హ‌యాంలో పేద‌ల‌కు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు జ‌గ‌న‌న్న ఇళ్ల కాల‌నీల పేరుతో ప‌థ‌కాన్ని తీసుకు వ‌చ్చారు. దీనిని మూడు ఫేజ్‌ల‌లో అమ‌లు చేశారు. డ‌బ్బులు లేక‌, ఇళ్లు క‌ట్టుకోలేని వారికి ప్ర‌భుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. దీంతో అధికారులు.. అప్ప‌టి వైసీపీ ఎమ్మెల్యేలు, కొంద‌రు మంత్రులు కుమ్మ‌క్క‌యి.. అవ‌స‌రానికి మించి ఇనుము, సిమెంటు, ఇత‌ర నిర్మాణ సామ‌గ్రిని వేల కోట్ల రూపాయ‌ల మేర‌కు కొనుగోలు చేశారు. వారు ఈ వ‌స్తువులు కొనుగోలు చేసే నాటికి ఇంటి స్థ‌లాల కేటాయింపే జ‌ర‌గ‌లేదు.

అయినా కూడా.. క‌మీష‌న్లు, ముడుపుల కోసం.. స‌ద‌రు కంపెనీల‌కు భారీ మొత్తంలో ఆర్డ‌ర్లు ఇచ్చారు. దీంతో ఆయా స‌రుకు మొత్తం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేష‌న్ కు జిల్లాల్లో ఉన్న గోడౌనులకు చేరిపోయింది. కానీ, ఎంత‌కీ.. ప‌నులు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో ఇనుము తుప్పుప‌ట్టింది. వేల బ‌స్తాల సిమెంటు రాళ్లుగా మారిపోయింది. దీనిపై కూటమి ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు రావ‌డంతో ప్ర‌భుత్వం విజిలెన్స్‌ను నియ‌మించి.. విచార‌ణ చేయించింది. ఈ క్ర‌మంలో జ‌రిగిన త‌తంగాన్ని విజిలెన్సు నివేదిక రూపంలో ఇచ్చింది.

ఈ క్ర‌మంలో స‌ద‌రు అక్ర‌మాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచిస్తూ.. సీఎం చంద్ర‌బాబు అధికారుల‌ను ఆదేశించారు. అయితే.. చ‌ర్య‌లు అంటే వారికి ఎలా అర్థ‌మైందో తెలియ‌దు కానీ.. అస‌లు కేసును నీరుగార్చేలా.. స‌ద‌రు తుప్పుప‌ట్టిన ఇనుమును, గ‌డ్డ‌లుగా మారిన సిమెంటును ఖాళీ చేసేయాల‌ని.. గోడౌనులను శుభ్రం చేసి తాళాలు వేయాల‌ని ఆదేశించారు. ఈ ప‌రిణామం.. స‌ర్కారుకు శ‌రాఘాతంగా మారింది.

అప్ప‌ట్లో వైసీపీ నాయ‌కుల‌తో కుమ్మ‌క్క‌యిన అధికారులు ఇలా ఆదేశించారంటూ.. వార్త‌లు రావ‌డంతో ఇప్పుడు.. చంద్ర‌బాబు అలెర్ట్ అయ్యారు. స‌ద‌రు అధికారుల వివ‌రాలు ఇవ్వాల‌ని ఆదేశించారు. వాస్త‌వానికి చ‌ర్య‌లు తీసుకోమంటే.. అప్ప‌ట్లో త‌ప్పులు చేసిన వారిని ప‌ట్టుకోవాల‌ని చంద్ర‌బాబు చెప్పారు. కానీ, దీనిని వ‌దిలేసి.. నాటి త‌ప్పులు మూసేసే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on March 3, 2026 2:59 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

మన నిర్మాతలకు గట్స్ ఎక్కువ బ్రో

పేరుకేమో.. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిలిం ఇండస్ట్రీల్లో ఒకటిగా పేరు. భారీ బడ్జెట్లు, రికార్డు బిజినెస్‌లు, కళ్లు చెదిరే పారితోషకాలు.. చివరికి చూస్తేనేమో వసూళ్లు…

50 minutes ago

ఓట్ల తొల‌గింపు ఎఫెక్ట్ ఉంటే ఎన్నిక‌లు రద్దేనా?

ఓట్ల తొల‌గింపు అంశంపై సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇలా ఓట్లు కోల్పోయిన వారి వ‌ల్ల ఎన్నిక‌లు ప్ర‌భావితం (ఎఫెక్ట్‌)…

2 hours ago

`లీకు` మంత్రులు బాబుకు దొరికిపోయారా?

త‌న మంత్రి వ‌ర్గంలోని స‌భ్యుల వ్య‌వ‌హార శైలిపై సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. వారు…

3 hours ago

ఇది కదా SRH బలం… నోళ్ళు మూయించిన కుర్రాళ్ళు

​ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఓటమనేది ఎరుగని రాజస్థాన్ రాయల్స్ విజయయాత్రకు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్రేక్ వేసింది. ఉప్పల్ స్టేడియం వేదికగా…

4 hours ago

విజయ్ కు పవన్ సలహా ఇస్తారా?

``నేనెవ‌రికీ స‌ల‌హాలు ఇవ్వ‌ను.`` అని జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. ఎవ‌రి నుంచైనా తానే…

6 hours ago

నిర్మాతను ఆదుకోబోతున్న స్టార్ హీరో

తమిళంలో నంబర్ వన్ హీరోగా ఉన్న విజయ్‌తో సినిమా అంటే జాక్‌పాట్‌లా ఫీలవుతారు ఏ నిర్మాత అయినా. అందులోనూ రాజకీయాల్లోకి వెళ్లే…

8 hours ago