Political News

కూట‌మి స‌ర్కారులో కోవ‌ర్టులు.. బాబు ఆరా!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వంలో వైసీపీ కోవ‌ర్టులు ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అయితే.. రాజ‌కీయంగా కాదు.. అధికారికంగా.. ప‌లువురు ఉన్న‌తాధికారులు వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. తాజాగా మ‌రోసారి వీరి వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు రావ‌డం.. ఈ విష‌యం మీడియాలో పెద్ద ఎత్తున రావ‌డంతో సీఎం చంద్ర‌బాబు అలెర్ట‌య్యారు. స‌ద‌రు అధికారుల‌పై ఆరా తీశారు. ఏం జ‌రిగింది? అనే విష‌యాల‌ను చంద్ర‌బాబు తెలుసుకుంటున్నారు.

అస‌లు విష‌యం ఇదీ..

వైసీపీ హ‌యాంలో పేద‌ల‌కు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు జ‌గ‌న‌న్న ఇళ్ల కాల‌నీల పేరుతో ప‌థ‌కాన్ని తీసుకు వ‌చ్చారు. దీనిని మూడు ఫేజ్‌ల‌లో అమ‌లు చేశారు. డ‌బ్బులు లేక‌, ఇళ్లు క‌ట్టుకోలేని వారికి ప్ర‌భుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. దీంతో అధికారులు.. అప్ప‌టి వైసీపీ ఎమ్మెల్యేలు, కొంద‌రు మంత్రులు కుమ్మ‌క్క‌యి.. అవ‌స‌రానికి మించి ఇనుము, సిమెంటు, ఇత‌ర నిర్మాణ సామ‌గ్రిని వేల కోట్ల రూపాయ‌ల మేర‌కు కొనుగోలు చేశారు. వారు ఈ వ‌స్తువులు కొనుగోలు చేసే నాటికి ఇంటి స్థ‌లాల కేటాయింపే జ‌ర‌గ‌లేదు.

అయినా కూడా.. క‌మీష‌న్లు, ముడుపుల కోసం.. స‌ద‌రు కంపెనీల‌కు భారీ మొత్తంలో ఆర్డ‌ర్లు ఇచ్చారు. దీంతో ఆయా స‌రుకు మొత్తం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేష‌న్ కు జిల్లాల్లో ఉన్న గోడౌనులకు చేరిపోయింది. కానీ, ఎంత‌కీ.. ప‌నులు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో ఇనుము తుప్పుప‌ట్టింది. వేల బ‌స్తాల సిమెంటు రాళ్లుగా మారిపోయింది. దీనిపై కూటమి ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు రావ‌డంతో ప్ర‌భుత్వం విజిలెన్స్‌ను నియ‌మించి.. విచార‌ణ చేయించింది. ఈ క్ర‌మంలో జ‌రిగిన త‌తంగాన్ని విజిలెన్సు నివేదిక రూపంలో ఇచ్చింది.

ఈ క్ర‌మంలో స‌ద‌రు అక్ర‌మాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచిస్తూ.. సీఎం చంద్ర‌బాబు అధికారుల‌ను ఆదేశించారు. అయితే.. చ‌ర్య‌లు అంటే వారికి ఎలా అర్థ‌మైందో తెలియ‌దు కానీ.. అస‌లు కేసును నీరుగార్చేలా.. స‌ద‌రు తుప్పుప‌ట్టిన ఇనుమును, గ‌డ్డ‌లుగా మారిన సిమెంటును ఖాళీ చేసేయాల‌ని.. గోడౌనులను శుభ్రం చేసి తాళాలు వేయాల‌ని ఆదేశించారు. ఈ ప‌రిణామం.. స‌ర్కారుకు శ‌రాఘాతంగా మారింది.

అప్ప‌ట్లో వైసీపీ నాయ‌కుల‌తో కుమ్మ‌క్క‌యిన అధికారులు ఇలా ఆదేశించారంటూ.. వార్త‌లు రావ‌డంతో ఇప్పుడు.. చంద్ర‌బాబు అలెర్ట్ అయ్యారు. స‌ద‌రు అధికారుల వివ‌రాలు ఇవ్వాల‌ని ఆదేశించారు. వాస్త‌వానికి చ‌ర్య‌లు తీసుకోమంటే.. అప్ప‌ట్లో త‌ప్పులు చేసిన వారిని ప‌ట్టుకోవాల‌ని చంద్ర‌బాబు చెప్పారు. కానీ, దీనిని వ‌దిలేసి.. నాటి త‌ప్పులు మూసేసే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on March 3, 2026 2:59 pm

Share

Recent Posts

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

3 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

4 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

4 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

5 hours ago

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

6 hours ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

6 hours ago