ఎంత నేర్చినా.. ఎంత వారలైనా.. ఇప్పటికీ మూఢనమ్మకాలకు, రాశిఫలాలకు, జ్యోతిష్యాలకు దాసులుగా నే వ్యవహరిస్తున్నారు. ఆదివారం రాగానే.. పత్రికల్లో వచ్చే వార్తలకంటే కూడా.. ఆయా పత్రికల్లో వచ్చే రాశిఫలాలను నమ్ముతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉందని ఇటీవల ఓ పరిశోధన తెలిపింది. ఇక, ఆన్లైన్, ఆఫ్లైన్ అనే తేడా లేకుండా.. జ్యోతిష్యాలు చెప్పించుకునేవారు కూడా పెరిగిపోతున్నారు. పోనీ.. ఇవేవైనా నిజంగానే జరుగుతాయన్న నమ్మకం ఉందా.. అంటే ఆ చెప్పే వారే నమ్మకం లేదని చెబుతారు!.
అలాంటి జ్యోతిష్యాన్ని నమ్మి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆమెకు 9 రోజుల కిందటే వివాహం జరిగింది. దీంతో ఇప్పుడు ఆమె కుటుంబం సహా.. మెట్టినింటి వారు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు. మూఢనమ్మకాలు వ్యక్తులపై ఎంత బలమైన ముద్ర వేస్తాయో చెప్పడానికి కర్ణాటకలో తాజాగా జరిగిన ఈ ఘటన అద్దం పడుతోంది.
ఏం జరిగింది?
బెంగళూరులోని కొడగు ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల విద్యాజ్యోతి స్థానికంగా ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. నెలకు రెండు లక్షలపైచిలుకు జీతం సంపాయించుకుంటున్నారు. అయితే.. ఆమెకుఎంతకీ వివాహం కాకపోవడంతో ఓ జ్యోతిష్యుడిని సంప్రదించగా.. “నీకు పెళ్లి అవుతుంది. కానీ, 9వ రోజు నీకు మరణం తప్పదు“ అని గుండె పగిలే మాట చెప్పాడు. దీనికి కొనసాగింపుగా.. పరిహారం కూడా సూచించారు. పెళ్లయిన తర్వాత.. భర్తకు దూరంగా ఉంటూ.. అమ్మవారికి పూజలు చేయాలని.. చివరి రోజు అంటే.. 9వ రోజు మెడలో తాళి తీసి..అమ్మవారికి సమర్పిస్తే.. అప్పుడు దోషం పోతుందన్నాడు.
జ్యోతిష్యుడు చెప్పినట్టుగానే.. జ్యోతికి వివాహం అయింది. దీంతో 9వ రోజు టెన్షన్ పట్టుకుంది. ఈ నేపథ్యంలో భర్తను దూరం పెట్టి.. ఆ 9 రోజులు పూజకు చేరువైంది. 8 రోజులుగా ఉపవాసం ఉంటూ.. పూజలు చేసింది. ఇక, 9వ రోజు.. తాళిని అమ్మవారికి సమర్పించాల్సిన సమయంలో అన్ని క్రతువులు పూర్తి చేసి.. ఓ గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందింది. ఈ ఘటన కర్నాటకలో తీవ్ర కలకలం సృష్టించింది. మరోవైపు.. జ్యోతిని రెచ్చగొట్టిన జ్యోతిష్యుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
This post was last modified on March 1, 2026 11:31 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…